Guntur Brigde: మరో కొద్ది రోజులే.. శంకర్ విలాస్ బ్రిడ్జ్ పనుల్లో వేగం- కేంద్ర మంత్రి పెమ్మసాని! Balakrishna: రాజధాని నిర్మాణం హడావుడి కాదు.. ఓ దార్శనికత! అమరావతిపై బాలకృష్ణ ఆసక్తికర వ్యాఖ్యలు.. Nara Lokesh: తల్లీకొడుకుల అద్భుత విజయం - ఒకేసారి టెన్త్ పాస్.. ఫిదా అయిన మంత్రి నారా లోకేష్.! Chandrababu: ఆఫీసర్లు మారాలి.. లేదంటే ఇంటికే! ప్రభుత్వ యంత్రాంగానికి సీఎం ఆఖరి వార్నింగ్! AP New Company: సత్యసాయి జిల్లా దశ మార్చే ప్రాజెక్టులు.. రూ.10,000 కోట్లకు పైగా పెట్టుబడులు! 1,000 మందికి పైగా.. Aerospace AP: శ్రీ సత్యసాయి జిల్లాలో విమానాల హోరు... భారీ ఏరోస్పేస్ పరిశ్రమ! Chandrababu: ఏపీ సీఎం చంద్రబాబును కలిసిన 'తిమ్మరాజుపల్లి టీవీ' సినిమా దర్శకుడు! Mega Furniture Cluster: ఏపీలో ఆ ప్రాంతానికి మహర్దశ! రూ.3,500 కోట్లతో మెగా ఫర్నిచర్ క్లస్టర్! LPG New Rules: ఎల్పీజీ వినియోగదారులకు కేంద్రం బిగ్ షాక్! నేటి నుండి కొత్త రూల్స్.... Prajavedhika: ఆధార్ కార్డు బ్లాక్ చేసి భూమి కబ్జా.. రెవెన్యూ అధికారుల 'హైటెక్' దందా! కోర్టు తీర్పు ఉన్నా దక్కని భూమి.. Guntur Brigde: మరో కొద్ది రోజులే.. శంకర్ విలాస్ బ్రిడ్జ్ పనుల్లో వేగం- కేంద్ర మంత్రి పెమ్మసాని! Balakrishna: రాజధాని నిర్మాణం హడావుడి కాదు.. ఓ దార్శనికత! అమరావతిపై బాలకృష్ణ ఆసక్తికర వ్యాఖ్యలు.. Nara Lokesh: తల్లీకొడుకుల అద్భుత విజయం - ఒకేసారి టెన్త్ పాస్.. ఫిదా అయిన మంత్రి నారా లోకేష్.! Chandrababu: ఆఫీసర్లు మారాలి.. లేదంటే ఇంటికే! ప్రభుత్వ యంత్రాంగానికి సీఎం ఆఖరి వార్నింగ్! AP New Company: సత్యసాయి జిల్లా దశ మార్చే ప్రాజెక్టులు.. రూ.10,000 కోట్లకు పైగా పెట్టుబడులు! 1,000 మందికి పైగా.. Aerospace AP: శ్రీ సత్యసాయి జిల్లాలో విమానాల హోరు... భారీ ఏరోస్పేస్ పరిశ్రమ! Chandrababu: ఏపీ సీఎం చంద్రబాబును కలిసిన 'తిమ్మరాజుపల్లి టీవీ' సినిమా దర్శకుడు! Mega Furniture Cluster: ఏపీలో ఆ ప్రాంతానికి మహర్దశ! రూ.3,500 కోట్లతో మెగా ఫర్నిచర్ క్లస్టర్! LPG New Rules: ఎల్పీజీ వినియోగదారులకు కేంద్రం బిగ్ షాక్! నేటి నుండి కొత్త రూల్స్.... Prajavedhika: ఆధార్ కార్డు బ్లాక్ చేసి భూమి కబ్జా.. రెవెన్యూ అధికారుల 'హైటెక్' దందా! కోర్టు తీర్పు ఉన్నా దక్కని భూమి..

Mahanadu: నెల్లూరులో మహానాడు సన్నాహాలు జోరుగా.. చరిత్రలో నిలిచేలా నిర్వహణకు భారీ ఏర్పాట్లు!

Mahanadu: నెల్లూరు జిల్లా చరిత్రలో ఎప్పటికీ గుర్తుండిపోయేలా తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మక మహానాడు కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు సన్నాహాలు జోరుగా సాగుతున్నాయి.

Published : 2026-05-01 15:42:00

నెల్లూరు చరిత్రలో.. అపూర్వ ఘట్టంగా.. పార్టీ మహానాడు..

తుది వేదికను పార్టీ అధిష్టానం ఖరారు చేస్తుంది : మంత్రి ఆనం..

నెల్లూరు: నెల్లూరు జిల్లా చరిత్రలో ఎప్పటికీ గుర్తుండిపోయేలా తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మక మహానాడు కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు సన్నాహాలు జోరుగా సాగుతున్నాయి. రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ఈ విషయాన్ని వెల్లడిస్తూ, మహానాడును ప్రతి కార్యకర్త గర్వపడేలా నిర్వహిస్తామని స్పష్టం చేశారు.

తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత తొలిసారిగా నెల్లూరు జిల్లాలో మహానాడు నిర్వహించేందుకు పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకోవడం జిల్లా కార్యకర్తలకు ఎంతో గౌరవంగా భావిస్తున్నామని మంత్రి ఆనం తెలిపారు. ఈ కార్యక్రమం నెల్లూరు చరిత్రలో ఒక అపూర్వ ఘట్టంగా నిలిచిపోతుందని ఆయన అన్నారు.

మహానాడు నిర్వహణకు అనువైన ప్రదేశాల ఎంపిక కోసం మంత్రి ఆనం రామనారాయణరెడ్డి నేతృత్వంలో విస్తృతంగా స్థలాల పరిశీలన కొనసాగుతోంది. ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర నాయకులతో కలిసి కోవూరు సమీపంలోని 110 ఎకరాల APIIC భూములు, రాజుపాలెం వద్ద ఇఫ్కో కిసాన్ సెజ్ ప్రాంతం, నెల్లూరు రూరల్ పరిధిలోని జాతీయ రహదారి సమీప ప్రాంతాలను పరిశీలించారు. పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ కూడా ఈ పరిశీలనలో పాల్గొన్నారు.

పరిశీలించిన అన్ని వివరాలను పార్టీ కేంద్రానికి నివేదిస్తామని, అనంతరం పార్టీ అధిష్టానం తుది వేదికను ఖరారు చేస్తుందని మంత్రి ఆనం తెలిపారు.

మే 27, 28, 29 తేదీల్లో మహానాడు నిర్వహణకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ముఖ్యంగా మే 28న నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా లక్షలాది మంది కార్యకర్తల సమక్షంలో మహానాడు నిర్వహించేందుకు పార్టీ సిద్ధమవుతోంది. ఐదు లక్షల మందికి పైగా కార్యకర్తలు, నాయకులు హాజరయ్యే అవకాశం ఉందని అంచనా.

ఈ నేపథ్యంలో భారీ బహిరంగ సభ వేదిక, వేలాది వాహనాలకు పార్కింగ్ సదుపాయం, మూడు రోజుల పాటు కార్యకర్తలకు భోజన వసతి, అతిథులకు తగిన నివాస ఏర్పాట్లు వంటి అన్ని అంశాల్లో సమగ్ర ప్రణాళికతో ఏర్పాట్లు చేస్తున్నారు. మహానాడును పసుపు పండుగలా నిర్వహించేందుకు పార్టీ శ్రద్ధ తీసుకుంటోంది.

నెల్లూరులో జరగనున్న ఈ మహానాడు కేవలం ఒక పార్టీ కార్యక్రమమే కాకుండా, జిల్లా చరిత్రలో చిరస్థాయిగా నిలిచే మహోత్సవంగా మారనుందని స్థానిక నాయకులు, కార్యకర్తలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Spotlight

Read More →