SwachhAndhra: చిలకలూరిపేట హాస్టల్ సరికొత్త రికార్డు... రాష్ట్రంలోనే తొలి 'నెట్ జీరో' వసతి గృహం! మంత్రి హర్షం... Amaravati Capital Legality: జగన్ 'మూడు ముక్కలాట'తో రాష్ట్రం సర్వనాశనం: మంత్రి సవిత..! Prajavedhika: అర్ధరాత్రి రాళ్ల దాడులు.. మాజీ ఎమ్మెల్యే అనుచరుల అరాచకంపై గ్రీవెన్స్‌లో ఫిర్యాదు! AP Assembly: ఎమ్మెల్యే పదవి పోయినా పర్వాలేదు.. అమరావతి కదలనివ్వం.. అసెంబ్లీలో సభ్యుడి భావోద్వేగం.! AP Assembly: అమరావతి అజేయం... రాజధాని చట్టబద్ధత తీర్మానానికి ఏపీ అసెంబ్లీ ఏకగ్రీవ ఆమోదం! MLA Galla Madhavi: విద్వేషం, విధ్వంసం, వినాశనం.. ఇవే జగన్ మార్క్ పాలన.. ఏపీ అసెంబ్లీలో సభ్యుల ఘాటు విమర్శలు.! Minister Payyavula Keshav: ప్రతిపక్షాన్ని మేం కాదు.. ప్రజలే తుడిచిపెట్టేశారు! ఆ పార్టీ రాష్ట్రానికి.. AndhraPradesh: అమరావతి విధ్వంసం ప్రజావేదిక కూల్చివేతతోనే మొదలైంది- బుచ్చయ్య చౌదరి! MLA Madhavi Reddy: చరిత్ర పునరావృతం.. నాడు తుగ్లక్, నేడు జగన్: రాజధాని మార్పుపై అసెంబ్లీలో సెటైర్లు.! Nara Lokesh: అమరావతికి చట్టబద్ధత.. ఏప్రిల్ 2న పార్లమెంట్‌లో బిల్లు: మంత్రి నారా లోకేశ్ కీలక ప్రకటన! SwachhAndhra: చిలకలూరిపేట హాస్టల్ సరికొత్త రికార్డు... రాష్ట్రంలోనే తొలి 'నెట్ జీరో' వసతి గృహం! మంత్రి హర్షం... Amaravati Capital Legality: జగన్ 'మూడు ముక్కలాట'తో రాష్ట్రం సర్వనాశనం: మంత్రి సవిత..! Prajavedhika: అర్ధరాత్రి రాళ్ల దాడులు.. మాజీ ఎమ్మెల్యే అనుచరుల అరాచకంపై గ్రీవెన్స్‌లో ఫిర్యాదు! AP Assembly: ఎమ్మెల్యే పదవి పోయినా పర్వాలేదు.. అమరావతి కదలనివ్వం.. అసెంబ్లీలో సభ్యుడి భావోద్వేగం.! AP Assembly: అమరావతి అజేయం... రాజధాని చట్టబద్ధత తీర్మానానికి ఏపీ అసెంబ్లీ ఏకగ్రీవ ఆమోదం! MLA Galla Madhavi: విద్వేషం, విధ్వంసం, వినాశనం.. ఇవే జగన్ మార్క్ పాలన.. ఏపీ అసెంబ్లీలో సభ్యుల ఘాటు విమర్శలు.! Minister Payyavula Keshav: ప్రతిపక్షాన్ని మేం కాదు.. ప్రజలే తుడిచిపెట్టేశారు! ఆ పార్టీ రాష్ట్రానికి.. AndhraPradesh: అమరావతి విధ్వంసం ప్రజావేదిక కూల్చివేతతోనే మొదలైంది- బుచ్చయ్య చౌదరి! MLA Madhavi Reddy: చరిత్ర పునరావృతం.. నాడు తుగ్లక్, నేడు జగన్: రాజధాని మార్పుపై అసెంబ్లీలో సెటైర్లు.! Nara Lokesh: అమరావతికి చట్టబద్ధత.. ఏప్రిల్ 2న పార్లమెంట్‌లో బిల్లు: మంత్రి నారా లోకేశ్ కీలక ప్రకటన!

Konatala Ramakrishna: రాజధాని శ్మశానం కాదు.. రైతుల త్యాగాల పురిటిగడ్డ.. వైసీపీ వ్యాఖ్యలపై కొణతాల ఆగ్రహం.!

Konatala Ramakrishna: ఆంధ్రప్రదేశ్ శాసనసభలో రాజధాని అమరావతిపై జరుగుతున్న చర్చా వేదికగా జనసేన ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ గత ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. గత ఐదేళ్ల కాలంలో ఏపీ రాజధాని పరిస్థితిని ఒక 'వైకుంఠపాళి' ఆటలా మార్చేశారని, అభివృద్ధి ఏ దశలో ఉన్నా మళ్లీ మొదటికే వచ్చేలా కుట్రలు పన్నారని ఆయన విమర్శించారు.

Published : 2026-03-28 14:50:00
  • Politics: 20 మాసాల్లోనే అభివృద్ధిని గాడిలో పెట్టిన చంద్రబాబు: కొణతాల రామకృష్ణ ప్రశంసలు..
     
  • "జగన్ మాటలన్నీ అభూతకల్పనలే": క్షేత్రస్థాయి వాస్తవాలను వివరించిన కొణతాల..

Konatala Ramakrishna: ఆంధ్రప్రదేశ్ శాసనసభలో రాజధాని అమరావతిపై జరుగుతున్న చర్చా వేదికగా జనసేన ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ గత ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. గత ఐదేళ్ల కాలంలో ఏపీ రాజధాని పరిస్థితిని ఒక 'వైకుంఠపాళి' ఆటలా మార్చేశారని, అభివృద్ధి ఏ దశలో ఉన్నా మళ్లీ మొదటికే వచ్చేలా కుట్రలు పన్నారని ఆయన విమర్శించారు. వైసీపీ నేతలు రాజధాని ప్రాంతాన్ని 'శ్మశాన వాటిక'గా అభివర్ణించడం పట్ల ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ, ఇది ప్రజాస్వామ్యమే తలదించుకునేలా చేసిన చర్య అని మండిపడ్డారు. అమరావతి కోసం తమ విలువైన భూములను త్యాగం చేసిన రైతుల కృషి వెలకట్టలేనిదని, అటువంటి పవిత్ర ప్రాంతాన్ని కించపరిచేలా మాట్లాడటం దుర్మార్గమని ఆయన ధ్వజమెత్తారు. గత పాలకులు తమ స్వార్థ రాజకీయాల కోసం రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని కొణతాల ఆవేదన వ్యక్తం చేశారు.

రాష్ట్రం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న సమయంలో అనుభవజ్ఞుడైన నారా చంద్రబాబు నాయుడు నాయకత్వం ఆవశ్యకతను కొణతాల రామకృష్ణ గుర్తు చేశారు. కేవలం 20 మాసాల అతి తక్కువ కాలంలోనే చంద్రబాబు రాష్ట్రాన్ని మళ్లీ అభివృద్ధి గాడిలో పెట్టారని కొనియాడారు. ఉత్తరాంధ్ర పారిశ్రామికాభివృద్ధిపై స్పందిస్తూ, విశాఖ స్టీల్ ప్లాంట్‌ను కాపాడుకుంటూనే, నక్కపల్లిలో మరో భారీ స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు ప్రభుత్వం తీసుకున్న చొరవను ఆయన ప్రశంసించారు. ఒకవైపు ఉన్న పరిశ్రమలను రక్షించుకుంటూనే, కొత్త పరిశ్రమల స్థాపన ద్వారా ఉపాధి అవకాశాలు మెరుగుపరుస్తున్న తీరు అభినందనీయమని పేర్కొన్నారు. అభివృద్ధికి ఆటంకం కలిగించే ధోరణిని వీడి, రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రతిపక్షాలు సహకరించాలని సూచించారు.

మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి వైఖరిని విమర్శిస్తూ, అన్నీ తానే చేశానంటూ ఆయన అభూతకల్పనలు మాట్లాడుతున్నారని కొణతాల రామకృష్ణ ఎద్దేవా చేశారు. క్షేత్రస్థాయిలో వాస్తవాలు వేరుగా ఉంటే, అసత్య ప్రచారాలతో ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తున్నారని దుయ్యబట్టారు. రాజధాని నిర్మాణం ఆగిపోవడానికి, రాష్ట్రం ఆర్థికంగా వెనుకబడటానికి ప్రధాన కారణం గత ప్రభుత్వ నిర్ణయాలేనని స్పష్టం చేశారు. ఇప్పటికైనా వాస్తవాలను గ్రహించి, రాష్ట్ర పునర్నిర్మాణంలో భాగస్వాములు కావాలని కోరారు. అమరావతి నిర్మాణం మరియు ఉత్తరాంధ్ర అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, ప్రజల ఆకాంక్షలను నెరవేర్చి తీరుతామని ఆయన పునరుద్ఘాటించారు.

Spotlight

Read More →