AP Govt: ఆ జిల్లా అభివృద్ధికి మాస్టర్ ప్లాన్.. రూ. 14 వేల కోట్లతో రైల్వే, జాతీయ రహదారుల ప్రతిపాదనలు.! AP Govt: ₹185 కోట్లతో 130 కొత్త అంగన్‌వాడీ కేంద్రాలు.. 55,766 కేంద్రాల్లో.. అంగన్‌వాడీల రూపురేఖలు సమూల మార్పు! Nara Lokesh: పిల్లలను సోషల్ మీడియాకు దూరంగా ఉంచడం అనివార్యం! దీనిపై రాష్ట్రవ్యాప్తంగా.. Nimmala Ramanaidu: వైసీపీది విధ్వంస పాలన.. కూటమిది అభివృద్ధి బాట.. పెనుమదం సభలో మంత్రి! రూ. 4.49 కోట్లతో.. Vijay Tirunelveli Speech: వ్యక్తిగత జీవితంపై దాడిని సహించను.. విడాకుల వివాదంపై నోరు విప్పిన దళపతి విజయ్! Prajavedhika: రికార్డుల నుంచి 19 సెంట్లు మాయం.. రీ-సర్వేలో రైతుకు జరిగిన ఆ అన్యాయం! సామాన్యుడి ఆర్తనాదం ఎందుకు వినిపించడం లేదు? Chandrababu: మీ భూమిపై మీకే హక్కు.. సూరేపల్లి వేదికగా సీఎం చంద్రబాబు భరోసా! Chandrababu: పోలవరం, అమరావతిని పునర్నిర్మించే అదృష్టం నాదే.. రూ. 1,000 కోట్లు వదులుకున్నాం.. సీఎం కీలక వ్యాఖ్యలు.! Atchannaidu: జగన్ అసలు రంగు బయటపడిందన్న కూటమి... వైఎస్ మరణం వెనుక జగన్ హస్తం! మంత్రి సంచలన కామెంట్లు.. AP Politics: పదవి కోసం సొంత చెల్లిని, తల్లిని కూడా వదలలేదు జగన్‌పై విరుచుకుపడ్డ మంత్రి అచ్చెన్నాయుడు..! AP Govt: ఆ జిల్లా అభివృద్ధికి మాస్టర్ ప్లాన్.. రూ. 14 వేల కోట్లతో రైల్వే, జాతీయ రహదారుల ప్రతిపాదనలు.! AP Govt: ₹185 కోట్లతో 130 కొత్త అంగన్‌వాడీ కేంద్రాలు.. 55,766 కేంద్రాల్లో.. అంగన్‌వాడీల రూపురేఖలు సమూల మార్పు! Nara Lokesh: పిల్లలను సోషల్ మీడియాకు దూరంగా ఉంచడం అనివార్యం! దీనిపై రాష్ట్రవ్యాప్తంగా.. Nimmala Ramanaidu: వైసీపీది విధ్వంస పాలన.. కూటమిది అభివృద్ధి బాట.. పెనుమదం సభలో మంత్రి! రూ. 4.49 కోట్లతో.. Vijay Tirunelveli Speech: వ్యక్తిగత జీవితంపై దాడిని సహించను.. విడాకుల వివాదంపై నోరు విప్పిన దళపతి విజయ్! Prajavedhika: రికార్డుల నుంచి 19 సెంట్లు మాయం.. రీ-సర్వేలో రైతుకు జరిగిన ఆ అన్యాయం! సామాన్యుడి ఆర్తనాదం ఎందుకు వినిపించడం లేదు? Chandrababu: మీ భూమిపై మీకే హక్కు.. సూరేపల్లి వేదికగా సీఎం చంద్రబాబు భరోసా! Chandrababu: పోలవరం, అమరావతిని పునర్నిర్మించే అదృష్టం నాదే.. రూ. 1,000 కోట్లు వదులుకున్నాం.. సీఎం కీలక వ్యాఖ్యలు.! Atchannaidu: జగన్ అసలు రంగు బయటపడిందన్న కూటమి... వైఎస్ మరణం వెనుక జగన్ హస్తం! మంత్రి సంచలన కామెంట్లు.. AP Politics: పదవి కోసం సొంత చెల్లిని, తల్లిని కూడా వదలలేదు జగన్‌పై విరుచుకుపడ్డ మంత్రి అచ్చెన్నాయుడు..!

High Court: సోషల్ మీడియా పోస్టులపై హైకోర్టు ఆగ్రహం.. కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక

AP High Court: సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు, ప్లెక్సీల వ్యవహారంపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. వైసీపీ సోషల్ మీడియా పూర్వ ఇన్‌ఛార్జ్ సజ్జల భార్గవ్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా కోర్టు పలు కీలక వ్యాఖ్యలు చేసింది..

Published : 2026-04-09 20:44:00

ఒక సీఎంను అవమానించడం అంటే కోట్లాది ప్రజలను అవమానించడం కాదా? 

చట్టం, కోర్టులంటే భయం కలిగేలా పోలీసుల చర్యలు ఉండాలి.. 

సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు, ప్లెక్సీల వ్యవహారంపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. వైసీపీ సోషల్ మీడియా పూర్వ ఇన్‌ఛార్జ్ సజ్జల భార్గవ్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా కోర్టు పలు కీలక వ్యాఖ్యలు చేసింది. వాదనలు పూర్తయ్యాక ఈ కేసులో తీర్పును హైకోర్టు రిజర్వ్ చేసింది.

విచారణలో భాగంగా, “2029లో మీరు చేసే విధ్వంసం కోసం ఎదురు చూస్తున్నాం” అనే వ్యాఖ్యలతో ప్లెక్సీలు ఏర్పాటు చేయడంపై న్యాయస్థానం తీవ్రంగా స్పందించింది. “ఇలాంటి ప్లెక్సీలు పెట్టడానికి ఎంత ధైర్యం ఉండాలి? ఎవరిని విధ్వంసం చేస్తారు? రాష్ట్రాన్నా? లేక రాష్ట్ర ప్రజలనా?” అంటూ ప్రశ్నించింది.

అలాగే, ముఖ్యమంత్రిని అవమానించడం అంటే రాష్ట్ర ప్రజల భావాలను దెబ్బతీయడమేనని కోర్టు స్పష్టం చేసింది. “ఒక సీఎంను అవమానించడం అంటే కోట్లాది ప్రజలను అవమానించడం కాదా?” అని ప్రశ్నిస్తూ, వ్యక్తిగతంగా మరియు కుటుంబ సభ్యులను లక్ష్యంగా చేసుకుని మాట్లాడటం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించింది.

“అవమానించేలా మాట్లాడే హక్కు, పోస్టులు పెట్టే అధికారం ఎవరిచ్చారు? వ్యక్తిగత ప్రతిష్ఠను దెబ్బతీసే హక్కు ఎవరికీ లేదు” అంటూ హైకోర్టు కఠినంగా వ్యాఖ్యానించింది.

ఈ సందర్భంలో పోలీసుల పనితీరుపైనా కోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. అభ్యంతరకర పోస్టులపై కఠిన చర్యలు తీసుకుని ఉంటే ఇలాంటి పరిస్థితులు మళ్లీ రావని పేర్కొంది. “చట్టం, కోర్టులంటే భయం కలిగేలా పోలీసుల చర్యలు ఉండాలి. పోలీసులు కఠినంగా వ్యవహరించి ఉంటే 2024 తర్వాత కూడా ఇలాంటి పోస్టులు పెట్టే ధైర్యం వచ్చేదే కాదు” అని కోర్టు వ్యాఖ్యానించింది.

అభ్యంతరకర సోషల్ మీడియా పోస్టుల కేసులను డీల్ చేయడంలో పోలీసులు విఫలమయ్యారని కూడా హైకోర్టు స్పష్టం చేసింది. ఈ కేసులో అన్ని వాదనలు పూర్తయ్యాయి. తుది తీర్పును హైకోర్టు త్వరలో వెలువరించనుంది.

అలాగే, సోషల్ మీడియాలో బాధ్యతాయుతమైన వ్యవహారం అవసరమని, వ్యక్తిగత అవమానాలు, దూషణలు సహించబోమని హైకోర్టు స్పష్టమైన సందేశం ఇచ్చింది.

Spotlight

Read More →