Gloden Crown: 2500 ఏళ్ల నాటి బంగారు కిరీటం... అప్పుడెప్పుడో పోయింది! కానీ ఇప్పుడు... PM Modi: బీజేపీ రాగానే జైలుకు వెళ్లక తప్పదు.. ఆ నేతలకు ప్రధాని నరేంద్ర మోదీ స్ట్రాంగ్ వార్నింగ్.. Iran War: కాపీ పేస్ట్ పొరపాటు.. బయటపడ్డ అసలు గుట్టు? పాక్ ప్రధాని పోస్టు వెనుక ట్రంప్ హస్తం ఉందా? Govardhan Reddy: వైసీపీ కి దిమ్మతిరిగే షాక్.. మాజీ మంత్రి పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు! Ramprasad Reddy: పది రోజుల్లో 10 వేల బస్సుల తనిఖీ.. మంత్రి రాంప్రసాద్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు.. నిబంధనలు ఉల్లంఘిస్తే! Gold Rates Today: అంతర్జాతీయ యుద్ధ ప్రభావం... భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు! Weather Report: రెండు తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన... మైలా తుఫాన్ ఎఫెక్ట్! Renu Desai: రేణు దేశాయ్‌పై అసభ్యకర కామెంట్.. గుంటూరు వ్యక్తి అరెస్ట్! ట్రోలర్లకు గట్టి వార్నింగ్.. Indian Worker Deaths: విదేశీ గడ్డపై రాలిపోతున్న ప్రాణాలు.. ఐదేళ్లలో 37,740 మంది భారతీయ కార్మికుల మృతి! TRAI: ట్రాయ్ సంచలన నిర్ణయం... ఇకపై నెలకు రూ. 20తో రీఛార్జ్ చేస్తే చాలు... సిమ్ కార్డును యాక్టివ్‌గా ఉంచుకోవచ్చు! Gloden Crown: 2500 ఏళ్ల నాటి బంగారు కిరీటం... అప్పుడెప్పుడో పోయింది! కానీ ఇప్పుడు... PM Modi: బీజేపీ రాగానే జైలుకు వెళ్లక తప్పదు.. ఆ నేతలకు ప్రధాని నరేంద్ర మోదీ స్ట్రాంగ్ వార్నింగ్.. Iran War: కాపీ పేస్ట్ పొరపాటు.. బయటపడ్డ అసలు గుట్టు? పాక్ ప్రధాని పోస్టు వెనుక ట్రంప్ హస్తం ఉందా? Govardhan Reddy: వైసీపీ కి దిమ్మతిరిగే షాక్.. మాజీ మంత్రి పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు! Ramprasad Reddy: పది రోజుల్లో 10 వేల బస్సుల తనిఖీ.. మంత్రి రాంప్రసాద్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు.. నిబంధనలు ఉల్లంఘిస్తే! Gold Rates Today: అంతర్జాతీయ యుద్ధ ప్రభావం... భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు! Weather Report: రెండు తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన... మైలా తుఫాన్ ఎఫెక్ట్! Renu Desai: రేణు దేశాయ్‌పై అసభ్యకర కామెంట్.. గుంటూరు వ్యక్తి అరెస్ట్! ట్రోలర్లకు గట్టి వార్నింగ్.. Indian Worker Deaths: విదేశీ గడ్డపై రాలిపోతున్న ప్రాణాలు.. ఐదేళ్లలో 37,740 మంది భారతీయ కార్మికుల మృతి! TRAI: ట్రాయ్ సంచలన నిర్ణయం... ఇకపై నెలకు రూ. 20తో రీఛార్జ్ చేస్తే చాలు... సిమ్ కార్డును యాక్టివ్‌గా ఉంచుకోవచ్చు!

Indian Worker Deaths: విదేశీ గడ్డపై రాలిపోతున్న ప్రాణాలు.. ఐదేళ్లలో 37,740 మంది భారతీయ కార్మికుల మృతి!

Indian Worker Deaths: 2021 నుండి 2025 మధ్య విదేశాల్లో పని చేస్తూ 37,740 మంది భారతీయ కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. వీరిలో 86% మరణాలు గల్ఫ్ దేశాలైన UAE, సౌదీ అరేబియాలోనే...

Published : 2026-04-09 13:28:00

Indian Worker Deaths: విదేశాలకు ఉపాధి కోసం వెళ్తున్న భారతీయ కార్మికుల భద్రతపై ఇప్పుడు తీవ్ర చర్చ జరుగుతోంది. గత ఐదేళ్లలో (2021-2025) విదేశాల్లో మరణించిన భారతీయ కార్మికుల వివరాలను పరిశీలిస్తే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థమవుతోంది. కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ రాజ్యసభలో వెల్లడించిన వివరాల ప్రకారం.. ఈ ఐదేళ్ల కాలంలో మొత్తం 37,740 మంది భారతీయులు ప్రాణాలు కోల్పోయారు. అంటే సగటున రోజుకు 20 మందికి పైగా మరణిస్తున్నట్లు లెక్కలు చెబుతున్నాయి.

ముఖ్యంగా గల్ఫ్ దేశాల్లో పని చేస్తున్న కార్మికుల పరిస్థితి అత్యంత దయనీయంగా ఉంది. మొత్తం మరణాల్లో 86 శాతం కంటే ఎక్కువ మరణాలు ఒక్క గల్ఫ్ ప్రాంతంలోనే సంభవించడం గమనార్హం. ఉపాధి కోసం అక్కడికి వెళ్లే కార్మికులు ఎదుర్కొంటున్న కఠినమైన పని పరిస్థితులు, వాతావరణ మార్పులు లేదా ఇతర ప్రమాదాలు ఈ మరణాలకు ప్రధాన కారణాలుగా మారుతున్నాయని ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.

దేశాల వారీగా చూస్తే, అత్యధికంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) లో 12,380 మంది కార్మికులు మరణించారు. దీని తర్వాత స్థానంలో సౌదీ అరేబియా నిలిచింది, అక్కడ 11,757 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ రెండు దేశాల్లోనే మరణాల సంఖ్య వేలల్లో ఉండటం ఆందోళన రేకెత్తిస్తోంది. వీటితో పాటు కువైట్ (3,890), ఒమన్ (2,821), ఖతార్ (1,760) వంటి దేశాల్లో కూడా మరణాల రేటు గణనీయంగా ఉంది.

గల్ఫ్ దేశాలే కాకుండా ఇతర దేశాలైన మలేషియాలో 1,915 మంది, అమెరికాలో 454 మంది, సింగపూర్‌లో 451 మంది భారతీయులు మరణించారు. నైజీరియా (210)  బ్రిటన్ (188) వంటి దేశాలు కూడా ఈ జాబితాలో ఉన్నాయి. అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే గల్ఫ్  ఆసియా దేశాల్లో పని చేస్తున్న కార్మికులే ఎక్కువగా ప్రాణాలు కోల్పోతున్నట్లు ఈ డేటా ద్వారా తెలుస్తోంది.

ఈ గణంకాలు కేవలం అంకెలు మాత్రమే కాదని, వేల కుటుంబాల విషాదానికి నిదర్శనమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. విదేశాల్లో భారతీయ కార్మికుల రక్షణ కోసం మరింత పటిష్టమైన చట్టాలు, మెరుగైన వైద్య సౌకర్యాలు  పని ప్రదేశాల్లో భద్రతను పర్యవేక్షించాల్సిన అవసరం ఉందని ఈ నివేదిక హెచ్చరిస్తోంది.

Spotlight

Read More →