Women's Reservation Bill: చట్టసభల్లో మహిళా గర్జన.. ఈనెల 16న పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు - రిజర్వేషన్ బిల్లుపై మోదీ కీలక ప్రకటన! Headmaster Suspension: ముఖ్యమంత్రిపై వివాదాస్పద పోస్టులు... తాళ్లూరు హెడ్మాస్టర్ శ్రీనివాస్ సస్పెన్షన్! Nellore Tension: నెల్లూరులో హై టెన్షన్... ఆంధ్రజ్యోతి ఆఫీసుపై మాజీ మంత్రి దాడి యత్నం! AP Political News: పనితీరు మార్చుకోకుంటే కష్టమే..ఆ ఎమ్మెల్యేలకు సీఎం సీరియస్ హెచ్చరిక.!! Elections 2026: ఈ మూడు రాష్ట్రాల్లో పోలింగ్ ప్రారంభం... ఓటు హక్కు వినియోగించుకోండి- ప్రధాని మోదీ! Pattadaru Passbooks: బాపట్ల జిల్లాలో నేడు సీఎం చంద్రబాబు పర్యటన.. రైతులకు పట్టాదారు పాస్‌బుక్ల పంపిణీ! Minister Ramprasad Reddy: కాజా టోల్ గేట్ వద్ద మంత్రి రాంప్రసాద్ రెడ్డి తనిఖీలు- వారికి సీరియస్ వార్నింగ్! Praja Vedika: నేడు (09/04) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! AP Government: చంద్రబాబు సర్కార్ కీలక నిర్ణయం! 2016 కి ముందే ఇంటి పట్టా ఉందా... దర్జాగా అమ్ముకోవచ్చు! Nara Lokesh: పార్టీ సిద్ధాంతం అంటేనే కార్యకర్తల గుర్తింపు.. టాప్ పెర్ఫార్మర్స్ భేటీలో లోకేశ్ కీలక వ్యాఖ్యలు.. Women's Reservation Bill: చట్టసభల్లో మహిళా గర్జన.. ఈనెల 16న పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు - రిజర్వేషన్ బిల్లుపై మోదీ కీలక ప్రకటన! Headmaster Suspension: ముఖ్యమంత్రిపై వివాదాస్పద పోస్టులు... తాళ్లూరు హెడ్మాస్టర్ శ్రీనివాస్ సస్పెన్షన్! Nellore Tension: నెల్లూరులో హై టెన్షన్... ఆంధ్రజ్యోతి ఆఫీసుపై మాజీ మంత్రి దాడి యత్నం! AP Political News: పనితీరు మార్చుకోకుంటే కష్టమే..ఆ ఎమ్మెల్యేలకు సీఎం సీరియస్ హెచ్చరిక.!! Elections 2026: ఈ మూడు రాష్ట్రాల్లో పోలింగ్ ప్రారంభం... ఓటు హక్కు వినియోగించుకోండి- ప్రధాని మోదీ! Pattadaru Passbooks: బాపట్ల జిల్లాలో నేడు సీఎం చంద్రబాబు పర్యటన.. రైతులకు పట్టాదారు పాస్‌బుక్ల పంపిణీ! Minister Ramprasad Reddy: కాజా టోల్ గేట్ వద్ద మంత్రి రాంప్రసాద్ రెడ్డి తనిఖీలు- వారికి సీరియస్ వార్నింగ్! Praja Vedika: నేడు (09/04) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! AP Government: చంద్రబాబు సర్కార్ కీలక నిర్ణయం! 2016 కి ముందే ఇంటి పట్టా ఉందా... దర్జాగా అమ్ముకోవచ్చు! Nara Lokesh: పార్టీ సిద్ధాంతం అంటేనే కార్యకర్తల గుర్తింపు.. టాప్ పెర్ఫార్మర్స్ భేటీలో లోకేశ్ కీలక వ్యాఖ్యలు..

Amaravati Quantum Valley: అమరావతిలో దేశంలోనే తొలి క్వాంటం టెస్ట్ బెడ్‌లు.. ఏప్రిల్ 14న సీఎం చంద్రబాబు శ్రీకారం..!

Amaravati Quantum Valley: దేశంలోనే మొట్టమొదటి క్వాంటం హార్డ్‌వేర్ టెస్ట్ బెడ్‌లను ఏప్రిల్ 14న అమరావతిలో సీఎం చంద్రబాబు ప్రారంభించనున్నారు. ఎస్‌ఆర్‌ఎం యూనివర్సిటీ, మేధా టవర్స్‌లో ఏర్పాటు చేసిన ఈ కేంద్రాలు ఏపీని గ్లోబల్ క్వాంటం హబ్‌గా మార్చనున్నాయి

Published : 2026-04-09 11:07:00

Amaravati Quantum Valley: భవిష్యత్తు సాంకేతిక పరిజ్ఞానానికి చిరునామాగా అమరావతి మారుతోంది. ఐటీ రంగంలో ఇప్పటికే తనదైన ముద్ర వేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఇప్పుడు 'క్వాంటం టెక్నాలజీ'పై దృష్టి పెట్టారు. ఇందులో భాగంగా దేశంలోనే మొట్టమొదటి క్వాంటం హార్డ్‌వేర్ టెస్ట్ బెడ్‌లను అమరావతిలో ఏర్పాటు చేశారు. ఈ నెల 14వ తేదీన ప్రపంచ క్వాంటం దినోత్సవం సందర్భంగా వీటిని ముఖ్యమంత్రి అధికారికంగా ప్రారంభించనున్నారు. కేవలం ఎనిమిది నెలల స్వల్ప వ్యవధిలోనే ఈ ప్రాజెక్టును పూర్తి చేయడం విశేషం.

రాష్ట్ర రాజధానిని గ్లోబల్ క్వాంటం హబ్‌గా మార్చాలన్నది ప్రభుత్వ ప్రధాన లక్ష్యం. దీని కోసం విజయవాడలోని మేధా టవర్స్, అమరావతిలోని ఎస్ఆర్ఎం  యూనివర్సిటీల్లో రెండు ప్రత్యేక కేంద్రాలను సిద్ధం చేశారు. వీటిని 'భారత్ క్వాంటం రిఫరెన్స్ ఫెసిలిటీస్' అని పిలుస్తారు. ఇక్కడ స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన 'అమరావతి 1ఎస్', 'అమరావతి 1క్యూ' అనే రెండు చిన్న క్వాంటం కంప్యూటర్లను అమర్చారు. క్యూబిట్ ఫోర్స్ అనే స్టార్టప్ సంస్థ ఈ కంప్యూటర్ల తయారీలో కీలక పాత్ర పోషించింది.

ఈ ప్రాజెక్టు వెనుక దేశంలోని అగ్రశ్రేణి పరిశోధనా సంస్థల కృషి ఉంది. ముంబయిలోని టీఐఎఫ్ఆర్, బెంగళూరులోని ఐఐఎస్సీ వంటి ప్రతిష్టాత్మక సంస్థలు క్వాంటం అందించాయి. అలాగే డీఆర్డీవో శాస్త్రవేత్తలు కంట్రోల్ ఎలక్ట్రానిక్స్ విభాగంలో సహకరించారు. ప్రైవేటు సంస్థలైన ఆంబర్ ఎంటర్‌ప్రైజెస్, క్యూట్ ఎలక్ట్రానిక్స్ తమవంతుగా హార్డ్‌వేర్ భాగాలను సమకూర్చాయి. ఇలా ప్రభుత్వ, ప్రైవేటు రంగాలు చేతులు కలపడం వల్ల అమరావతిలో క్వాంటం విడిభాగాల తయారీకి గట్టి పునాది పడింది.

ఈ టెస్ట్ బెడ్‌ల వల్ల పరిశోధకులకు, విద్యార్థులకు భారీ ప్రయోజనం చేకూరనుంది. సాధారణంగా క్వాంటం చిప్‌లను పరీక్షించాలంటే మన దేశంలో సరైన వసతులు లేక విదేశాలకు పంపాల్సి వచ్చేది. దీనివల్ల సమయం, డబ్బు వృథా అయ్యేవి. ఇప్పుడు అమరావతిలోనే ఈ పరీక్షలు చేసుకునే వీలుంటుంది. కేవలం థియరీ చదువులకే పరిమితం కాకుండా, విద్యార్థులు నేరుగా ఈ కంప్యూటర్లపై ప్రయోగాలు చేసే అవకాశం కలగడం ఒక గొప్ప మార్పుగా చెప్పవచ్చు.

రాబోయే రోజుల్లో అమరావతిని క్వాంటం హార్డ్‌వేర్ తయారీ కేంద్రంగా మార్చాలని ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇప్పటివరకు 111 క్యూబిట్స్ వరకు ఉన్న ప్రాసెసర్లను ఇక్కడ పరీక్షించవచ్చు. భవిష్యత్తులో ఈ సామర్థ్యాన్ని పది లక్షల (మిలియన్) క్యూబిట్స్ వరకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ సరికొత్త టెక్నాలజీతో రాష్ట్రంలోకి భారీ పెట్టుబడులు రావడమే కాకుండా, ఉన్నత విద్యావంతులైన యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని నిపుణులు భావిస్తున్నారు.

Spotlight

Read More →