Google AI Overviews: గూగుల్ AI సెర్చ్‌లో భారీ తప్పులు.. గంటకు లక్షల సంఖ్యలో తప్పుడు సమాధానాలు! Nara Lokesh: పార్టీ సిద్ధాంతం అంటేనే కార్యకర్తల గుర్తింపు.. టాప్ పెర్ఫార్మర్స్ భేటీలో లోకేశ్ కీలక వ్యాఖ్యలు.. Kalburgi rottelu: కల్బుర్గి రొట్టెలు రుచితో పాటు ఆరోగ్యాన్ని పంచే ఉత్తర కర్ణాటక స్పెషల్.. ఈ రొట్టెల వెనక కథ ఏంటి.? AP Govt: దేవుడి పేరుతో దగా.. కులం పేరుతో దూషణలు! వైసీపీ నేతల కనుసన్నల్లోనే భూమి అక్రమ రిజిస్ట్రేషన్ Middle East Conflict: అతలాకుతలమైన లెబనాన్.. ఇజ్రాయెల్ దాడుల్లో వందల సంఖ్యలో మృతులు.!! Chocolate Town Of India: ఇండియాలో ఉత్తమమైన చాక్లెట్లు ఎక్కడ దొరుకుతాయో తెలుసా? బ్రిటీష్ కాలం నాటి చాక్లెట్ సిటీ.. highspeed trains night: టెక్నికల్ రీజన్స్ vs మైండ్ గేమ్: రాత్రి పూట రైలు ప్రయాణంలో కలిగే ఆ త్రిల్లింగ్ అనుభూతి వెనుక సైన్స్.. Central Secretariat: అమరావతికి కేంద్రం భారీ కానుక.. రూ. 2,534 కోట్లతో సెంట్రల్ సెక్రటేరియట్ నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్! Amazon Layoffs: అమేజాన్ ఉద్యోగుల్లో మళ్లీ మొదలైన టెన్షన్.. వచ్చే నెలలో 14,000 మందిపై వేటు? Techie Trekking: ట్రెకింగ్ అని వెళ్ళి.. అదృశ్యమై.. తిరిగి వచ్చి.... పోలీసుల దర్యాప్తులో విస్తుపోయే నిజాలు! Google AI Overviews: గూగుల్ AI సెర్చ్‌లో భారీ తప్పులు.. గంటకు లక్షల సంఖ్యలో తప్పుడు సమాధానాలు! Nara Lokesh: పార్టీ సిద్ధాంతం అంటేనే కార్యకర్తల గుర్తింపు.. టాప్ పెర్ఫార్మర్స్ భేటీలో లోకేశ్ కీలక వ్యాఖ్యలు.. Kalburgi rottelu: కల్బుర్గి రొట్టెలు రుచితో పాటు ఆరోగ్యాన్ని పంచే ఉత్తర కర్ణాటక స్పెషల్.. ఈ రొట్టెల వెనక కథ ఏంటి.? AP Govt: దేవుడి పేరుతో దగా.. కులం పేరుతో దూషణలు! వైసీపీ నేతల కనుసన్నల్లోనే భూమి అక్రమ రిజిస్ట్రేషన్ Middle East Conflict: అతలాకుతలమైన లెబనాన్.. ఇజ్రాయెల్ దాడుల్లో వందల సంఖ్యలో మృతులు.!! Chocolate Town Of India: ఇండియాలో ఉత్తమమైన చాక్లెట్లు ఎక్కడ దొరుకుతాయో తెలుసా? బ్రిటీష్ కాలం నాటి చాక్లెట్ సిటీ.. highspeed trains night: టెక్నికల్ రీజన్స్ vs మైండ్ గేమ్: రాత్రి పూట రైలు ప్రయాణంలో కలిగే ఆ త్రిల్లింగ్ అనుభూతి వెనుక సైన్స్.. Central Secretariat: అమరావతికి కేంద్రం భారీ కానుక.. రూ. 2,534 కోట్లతో సెంట్రల్ సెక్రటేరియట్ నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్! Amazon Layoffs: అమేజాన్ ఉద్యోగుల్లో మళ్లీ మొదలైన టెన్షన్.. వచ్చే నెలలో 14,000 మందిపై వేటు? Techie Trekking: ట్రెకింగ్ అని వెళ్ళి.. అదృశ్యమై.. తిరిగి వచ్చి.... పోలీసుల దర్యాప్తులో విస్తుపోయే నిజాలు!

Chandrababu: రహదారుల రూపురేఖలు మార్చాలని నిర్ణయం.. ఏపీలో ఈ-బస్సులు.. చంద్రబాబు కీలక ఆదేశాలు!

Chandrababu: రాష్ట్రంలో రహదారులను గుంతలు లేకుండా పటిష్ఠంగా తీర్చిదిద్దాలని, ప్రజా రవాణాకు తక్కువ ఖర్చుతో ఎలక్ట్రిక్ బస్సులను అందుబాటులోకి తేవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. అమరావతి సచివాలయంలో బుధవారం ఆయన రహదారులు, భవనాలు (ఆర్ అండ్ బీ), రవాణా శాఖల పనితీరుపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు.

Published : 2026-04-08 15:56:00
  • "తాత్కాలిక మరమ్మతులు వద్దు.. శాశ్వత పరిష్కారం కావాలి": రోడ్ల నిర్వహణపై చంద్రబాబు సీరియస్..
     
  • Politics: సామాన్యుడికి చౌక ప్రయాణం: ఏపీలో భారీగా అందుబాటులోకి రానున్న ఎలక్ట్రిక్ బస్సులు..

Chandrababu: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా రహదారులను గుంతలు లేని మార్గాలుగా తీర్చిదిద్దాలని, అదే సమయంలో సామాన్యులకు భారం తగ్గించేలా చౌకైన ఎలక్ట్రిక్ రవాణా వ్యవస్థను అందుబాటులోకి తేవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. అమరావతి సచివాలయంలో బుధవారం జరిగిన ఉన్నతస్థాయి సమీక్షా సమావేశంలో ఆయన రహదారులు, భవనాలు (ఆర్ అండ్ బీ) మరియు రవాణా శాఖల పనితీరుపై సుదీర్ఘంగా చర్చించారు. రాష్ట్రంలో సుమారు 45 వేల కిలోమీటర్లకు పైగా ఉన్న రహదారుల నిర్వహణను ప్రాధాన్యతగా తీసుకోవాలని, కేవలం తాత్కాలిక మరమ్మతులతో సరిపెట్టకుండా ఆయా ప్రాంతాల భౌగోళిక పరిస్థితులను శాస్త్రీయంగా అధ్యయనం చేసి శాశ్వత ప్రాతిపదికన నాణ్యమైన రోడ్లను నిర్మించాలని ఆయన స్పష్టం చేశారు. మౌలిక సదుపాయాల కల్పనలోనే రాష్ట్రాభివృద్ధి దాగి ఉందని, మెరుగైన రవాణా సౌకర్యాలు ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరుస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు.

ప్రజా రవాణా వ్యవస్థను మరింత పటిష్ఠం చేసే క్రమంలో ఎలక్ట్రిక్ బస్సుల ప్రాధాన్యతను ముఖ్యమంత్రి నొక్కి చెప్పారు. సామాన్య ప్రయాణికులపై ఆర్థిక భారం పడకుండా, అతి తక్కువ వ్యయంతో గమ్యస్థానాలకు చేరుకునేలా వ్యూహరచన చేయాలని అధికారులకు సూచించారు. కాలుష్య రహిత రవాణాతో పాటు నిర్వహణ ఖర్చులను తగ్గించుకోవడానికి ఎలక్ట్రిక్ బస్సుల పెంపు ఒక్కటే మార్గమని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ కీలక సమావేశంలో మంత్రులు బీసీ జనార్ధన్ రెడ్డి, మండిపల్లి రాంప్రసాద్ రెడ్డితో పాటు రవాణా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు, ఆర్టీసీ ఎండీ బాలసుబ్రహ్మణ్యం మరియు ఇతర ఉన్నతాధికారులు పాల్గొని, ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా కార్యాచరణను రూపొందించాలని నిర్ణయించారు.

Spotlight

Read More →