Prajavedhika: భూ సర్వే జరిగినా సరిహద్దుల లొల్లి... ఇసుక మాఫియా వేధింపులు.. మంత్రి భరోసా!! Maruti Alto K10: తగ్గిన ధరలు.. పెరిగిన క్రేజ్! మళ్ళీ రేసులో మధ్యతరగతి కారు ఆల్టో K10 ! Best Foods: వేసవిలో గుండెకు మేలు చేసే సూపర్ ఫుడ్స్! H1B visa: "కరిగిపోతున్న అమెరికా కల": అగ్రరాజ్యాన్ని వీడాలనుకుంటున్న 40 శాతం మంది భారతీయులు! Agadha: 45 నిమిషాల వీఎఫ్ఎక్స్ హంగులతో.. విజువల్ వండర్‌గా రాబోతున్న మిస్టికల్ డివైన్ థ్రిల్లర్.. Pawan Kalyan: అమరావతి నుంచి ఫోన్.. సహచర మంత్రికి అండగా ఉంటామని పవన్ భరోసా.. Minister Savitha: వైసీపీ అంటే హంతకులను తయారుచేసే ఫ్యాక్టరీ.. మంత్రి సవిత సంచలన వ్యాఖ్యలు! Chandrababu: ఏపీ ఇక గ్రీన్ ఎనర్జీ హబ్.. రూ. 5.95 లక్షల కోట్ల పెట్టుబడులే లక్ష్యం.. అభివృద్ధిపై సీఎం దార్శనికత.. Mangli: నిజం త్వరలోనే బయటకు వస్తుంది.. ఇన్వెస్టర్ల సొమ్ము మాయం కేసులో మంగ్లీ క్లారిటీ.! Clay Pot Water: ఫ్రిజ్ నీళ్ల కంటే మట్టి పాత్రలోని నీరే మిన్న.. ఆ సీక్రెట్ ఏంటో తెలుసా? Prajavedhika: భూ సర్వే జరిగినా సరిహద్దుల లొల్లి... ఇసుక మాఫియా వేధింపులు.. మంత్రి భరోసా!! Maruti Alto K10: తగ్గిన ధరలు.. పెరిగిన క్రేజ్! మళ్ళీ రేసులో మధ్యతరగతి కారు ఆల్టో K10 ! Best Foods: వేసవిలో గుండెకు మేలు చేసే సూపర్ ఫుడ్స్! H1B visa: "కరిగిపోతున్న అమెరికా కల": అగ్రరాజ్యాన్ని వీడాలనుకుంటున్న 40 శాతం మంది భారతీయులు! Agadha: 45 నిమిషాల వీఎఫ్ఎక్స్ హంగులతో.. విజువల్ వండర్‌గా రాబోతున్న మిస్టికల్ డివైన్ థ్రిల్లర్.. Pawan Kalyan: అమరావతి నుంచి ఫోన్.. సహచర మంత్రికి అండగా ఉంటామని పవన్ భరోసా.. Minister Savitha: వైసీపీ అంటే హంతకులను తయారుచేసే ఫ్యాక్టరీ.. మంత్రి సవిత సంచలన వ్యాఖ్యలు! Chandrababu: ఏపీ ఇక గ్రీన్ ఎనర్జీ హబ్.. రూ. 5.95 లక్షల కోట్ల పెట్టుబడులే లక్ష్యం.. అభివృద్ధిపై సీఎం దార్శనికత.. Mangli: నిజం త్వరలోనే బయటకు వస్తుంది.. ఇన్వెస్టర్ల సొమ్ము మాయం కేసులో మంగ్లీ క్లారిటీ.! Clay Pot Water: ఫ్రిజ్ నీళ్ల కంటే మట్టి పాత్రలోని నీరే మిన్న.. ఆ సీక్రెట్ ఏంటో తెలుసా?

Kejriwal: కేజ్రీవాల్‌కు ఢిల్లీ హైకోర్టు నోటీసులు.. కోర్టు ఆగ్రహం!

Kejriwal: ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌కు ఢిల్లీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. కోర్టు ధిక్కరణ చర్యలకు సంబంధించి వివరణ ఇవ్వాలని ఆదేశించింది.

Published : 2026-04-23 18:54:00

అరవింద్ కేజ్రీవాల్‌కు ఢిల్లీ హైకోర్టు నోటీసులు..

కోర్టు నిబంధనలను ఉల్లంఘించి వీడియోలు రికార్డు చేయడంపై విచారణ..

న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌కు ఢిల్లీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. కోర్టు ధిక్కరణ చర్యలకు సంబంధించి వివరణ ఇవ్వాలని ఆదేశించింది. జస్టిస్ స్వర్ణకాంత్ శర్మ ధర్మాసనం ఈ కేసును విచారిస్తూ కేజ్రీవాల్ వ్యవహారంపై అసంతృప్తి వ్యక్తం చేసింది.

కోర్టు విచారణకు సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేయడాన్ని హైకోర్టు తీవ్రంగా తప్పుబట్టింది. ముఖ్యంగా కేజ్రీవాల్ వాదనలు ఉన్న వీడియోలు సోషల్ మీడియాలో ప్రచారం కావడం న్యాయవ్యవస్థ గౌరవానికి భంగం కలిగించేలా ఉందని అభిప్రాయపడింది.

ఈ నేపథ్యంలో ఆ వీడియోలను తక్షణమే సోషల్ మీడియా నుంచి తొలగించాలని హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. కోర్టు నిబంధనలను ఉల్లంఘిస్తూ విచారణ సమయంలో వీడియోలు రికార్డు చేయడం, వాటిని బయటకు పంపించడం కూడా గంభీరమైన విషయం అని పేర్కొంది.

ఈ కేసుకు కారణమైన పిటిషన్‌ను న్యాయవాది వైభవ్ సింగ్ దాఖలు చేశారు. కోర్టు అనుమతి లేకుండా విచారణ వీడియోలను రికార్డు చేసి, సోషల్ మీడియాలో పంచుకోవడం ద్వారా న్యాయవ్యవస్థ ప్రతిష్టను దెబ్బతీసేలా వ్యవహరించారని ఆయన పిటిషన్‌లో పేర్కొన్నారు.

ఈ అంశంపై సమగ్ర విచారణ జరపాలని కోర్టును అభ్యర్థించారు. పిటిషన్‌ను పరిశీలించిన హైకోర్టు, ఈ వ్యవహారంపై కేజ్రీవాల్‌తో పాటు సంబంధిత సోషల్ మీడియా సంస్థలకు కూడా నోటీసులు జారీ చేసింది.

ఈ కేసులో తదుపరి విచారణలో కేజ్రీవాల్ సమర్పించే వివరణ కీలకంగా మారనుంది. కోర్టు నిబంధనలపై స్పష్టత ఇవ్వడంతో పాటు, న్యాయవ్యవస్థ గౌరవాన్ని కాపాడే దిశగా హైకోర్టు తీసుకునే నిర్ణయం పై ఆసక్తి నెలకొంది.

Spotlight

Read More →