Prajavedhika: భూ సర్వే జరిగినా సరిహద్దుల లొల్లి... ఇసుక మాఫియా వేధింపులు.. మంత్రి భరోసా!! Maruti Alto K10: తగ్గిన ధరలు.. పెరిగిన క్రేజ్! మళ్ళీ రేసులో మధ్యతరగతి కారు ఆల్టో K10 ! Best Foods: వేసవిలో గుండెకు మేలు చేసే సూపర్ ఫుడ్స్! H1B visa: "కరిగిపోతున్న అమెరికా కల": అగ్రరాజ్యాన్ని వీడాలనుకుంటున్న 40 శాతం మంది భారతీయులు! Agadha: 45 నిమిషాల వీఎఫ్ఎక్స్ హంగులతో.. విజువల్ వండర్‌గా రాబోతున్న మిస్టికల్ డివైన్ థ్రిల్లర్.. Pawan Kalyan: అమరావతి నుంచి ఫోన్.. సహచర మంత్రికి అండగా ఉంటామని పవన్ భరోసా.. Minister Savitha: వైసీపీ అంటే హంతకులను తయారుచేసే ఫ్యాక్టరీ.. మంత్రి సవిత సంచలన వ్యాఖ్యలు! Chandrababu: ఏపీ ఇక గ్రీన్ ఎనర్జీ హబ్.. రూ. 5.95 లక్షల కోట్ల పెట్టుబడులే లక్ష్యం.. అభివృద్ధిపై సీఎం దార్శనికత.. Mangli: నిజం త్వరలోనే బయటకు వస్తుంది.. ఇన్వెస్టర్ల సొమ్ము మాయం కేసులో మంగ్లీ క్లారిటీ.! Clay Pot Water: ఫ్రిజ్ నీళ్ల కంటే మట్టి పాత్రలోని నీరే మిన్న.. ఆ సీక్రెట్ ఏంటో తెలుసా? Prajavedhika: భూ సర్వే జరిగినా సరిహద్దుల లొల్లి... ఇసుక మాఫియా వేధింపులు.. మంత్రి భరోసా!! Maruti Alto K10: తగ్గిన ధరలు.. పెరిగిన క్రేజ్! మళ్ళీ రేసులో మధ్యతరగతి కారు ఆల్టో K10 ! Best Foods: వేసవిలో గుండెకు మేలు చేసే సూపర్ ఫుడ్స్! H1B visa: "కరిగిపోతున్న అమెరికా కల": అగ్రరాజ్యాన్ని వీడాలనుకుంటున్న 40 శాతం మంది భారతీయులు! Agadha: 45 నిమిషాల వీఎఫ్ఎక్స్ హంగులతో.. విజువల్ వండర్‌గా రాబోతున్న మిస్టికల్ డివైన్ థ్రిల్లర్.. Pawan Kalyan: అమరావతి నుంచి ఫోన్.. సహచర మంత్రికి అండగా ఉంటామని పవన్ భరోసా.. Minister Savitha: వైసీపీ అంటే హంతకులను తయారుచేసే ఫ్యాక్టరీ.. మంత్రి సవిత సంచలన వ్యాఖ్యలు! Chandrababu: ఏపీ ఇక గ్రీన్ ఎనర్జీ హబ్.. రూ. 5.95 లక్షల కోట్ల పెట్టుబడులే లక్ష్యం.. అభివృద్ధిపై సీఎం దార్శనికత.. Mangli: నిజం త్వరలోనే బయటకు వస్తుంది.. ఇన్వెస్టర్ల సొమ్ము మాయం కేసులో మంగ్లీ క్లారిటీ.! Clay Pot Water: ఫ్రిజ్ నీళ్ల కంటే మట్టి పాత్రలోని నీరే మిన్న.. ఆ సీక్రెట్ ఏంటో తెలుసా?

Chandrababu: నేడు ఆ జిల్లాలో చంద్రబాబు పర్యటన! రూ.5,400 కోట్ల భారీ పెట్టుబడితో రెండు ప్రాజెక్టులు..

సీఎం చంద్రబాబు నాయుడు నేడు అనకాపల్లి జిల్లాలో పర్యటించ‌నున్నారు. జిల్లాలోని రాంబిల్లిలో రెన్యూ ఎనర్జీ గ్లోబస్ సంస్థ ఏర్పాటు చేయనున్న భారీ ప్రాజెక్టుకు ఆయన శంకుస్థాపన చేయనున్నారు. సుమారు రూ.5,400 కోట్ల పెట్టుబడితో రూపుదిద్దుకుంటున్న ఈ ప్రాజెక్టు ద్వారా వేలాది మందికి ఉపాధి లభించనుంది.

Published : 2026-04-23 11:08:00
  • ఈ ప్రాజెక్టుల ద్వారా 2,100 మందికి ఉద్యోగ అవ‌కాశాలు…
     
  • Politics: రెండేళ్లలో పూర్తికానున్న ప్రాజెక్టుల నిర్మాణం…

Chandrababu: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేడు అనకాపల్లి జిల్లాలో పర్యటించనున్నారు. జిల్లాలోని రాంబిల్లి మండలంలో గల జెడ్. చింతువ గ్రామం వద్ద ప్రముఖ పునరుత్పాదక ఇంధన సంస్థ 'రెన్యూ ఎనర్జీ గ్లోబల్' నిర్మించనున్న భారీ ప్రాజెక్టుకు ఆయన శంకుస్థాపన చేయనున్నారు. సుమారు రూ. 5,400 కోట్ల భారీ పెట్టుబడితో రూపుదిద్దుకుంటున్న ఈ ప్రాజెక్టు రాష్ట్ర పారిశ్రామిక రంగంలో కీలక మైలురాయిగా నిలవనుంది. ముఖ్యమంత్రి పర్యటన నిమిత్తం అమరావతి నుంచి ఉదయం 9.30 గంటలకు బయలుదేరగా, 11.10 గంటల ప్రాంతంలో ఆయన కార్యక్రమ వేదికకు చేరుకుని భూమి పూజ నిర్వహించి, అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు.

ఈ భారీ పెట్టుబడిలో భాగంగా రెండు కీలకమైన ప్లాంట్లు ఏర్పాటు కానున్నాయి. సుమారు రూ. 4,200 కోట్ల వ్యయంతో 6.5 గిగావాట్ల సామర్థ్యంతో సోలార్ ఇంగాట్-వేఫర్ తయారీ యూనిట్‌ను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. దీనితో పాటు రూ. 1,200 కోట్ల అంచనా వ్యయంతో 125 మెగావాట్ల హైబ్రిడ్ క్యాప్టివ్ రెన్యువబుల్ పవర్ ప్రాజెక్టుకు కూడా నేడు పునాది రాయి పడనుంది. ఈ రెండు ప్రాజెక్టుల నిర్మాణ పనులను రానున్న రెండేళ్ల కాలపరిమితిలో పూర్తి చేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. అత్యాధునిక సాంకేతికతతో నిర్మితమయ్యే ఈ ప్లాంట్లు రాష్ట్ర ఇంధన అవసరాలను తీర్చడమే కాకుండా, పర్యావరణ హితమైన ఇంధన ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్‌ను ముందువరుసలో నిలుపుతాయని భావిస్తున్నారు.

ఈ ప్రాజెక్టుల రాకతో అనకాపల్లి జిల్లా పారిశ్రామిక ముఖచిత్రం పూర్తిగా మారనుంది. ఈ యూనిట్ల ద్వారా ప్రత్యక్షంగా మరియు పరోక్షంగా సుమారు 2,100 మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని అంచనా వేస్తున్నారు. స్థానిక యువతకు ఉపాధి కల్పించడంతో పాటు అనుబంధ పరిశ్రమల అభివృద్ధికి కూడా ఇది బాటలు వేయనుంది.

Spotlight

Read More →