రైల్వే టికెట్ల బుకింగ్లో కీలకమైన మార్పు చోటుచేసుకుంది. ముందస్తు రిజర్వేషన్ వ్యవధి (ARP) 120 రోజుల నుంచి 60 రోజులకు తగ్గింది. ఈ కొత్త నిబంధన ఇవాళ్టి (నవంబర్ 1) నుంచే అమల్లోకి వచ్చింది. ఈ మేరకు ప్రయాణీకులకు అవగాహన కల్పిస్తూ అక్టోబర్ 16న ఇండియన్ రైల్వేస్ ఒక సర్క్యూలర్ విడుదల చేసింది. నిజమైన రైల్వే ప్రయాణికులను ప్రోత్సహించడం, పెరిగిపోతున్న ‘నో టికెట్ ట్రెండ్’ను తగ్గించడం లక్ష్యంగా ఈ మార్పుని తీసుకొచ్చినట్టు తెలిపింది. కాగా 61 నుంచి 120 రోజుల ముందుగా రిజర్వేషన్ చేసుకుంటున్న టికెట్లలో దాదాపు 21 శాతం టికెట్లు రద్దవుతున్నట్టు గుర్తించామని రైల్వేస్ పేర్కొంది.
అదనంగా మరో 5 శాతం మంది ప్రయాణం చేయకపోవడం లేదా టికెట్లు రద్దు చేసుకోవడం లేదని తెలిపింది. ‘నో టికెట్ ట్రెండ్’కు ఇది కూడా కారణమేనని పేర్కొంది. రద్దీ సీజన్లలో ప్రత్యేక రైళ్లను మరింత మెరుగైన ప్రణాళికతో అందుబాటులోకి తీసుకురావడానికి ఈ నిర్ణయం దోహదపడుతుందని తెలిపింది. కాగా ఈ కొత్త నిబంధన అమల్లోకి రావడంతో కేవలం 2 నెలల ముందు మాత్రమే రైలు టికెట్లు బుక్ చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. అయితే ఇప్పటికే టికెట్లు బుక్ చేసుకున్న వారిపై కొత్త నిబంధన ప్రభావం ఉండదని పీఐబీ వెల్లడించింది. విదేశీ పర్యాటకుల విషయంలో 365 రోజుల ముందస్తు రిజర్వేషన్ పరిమితిలో ఎలాంటి మార్పు ఉండదని ప్రభుత్వం తెలిపింది. కాగా అడ్వాన్స్ రిజర్వేషన్ వ్యవధిని చివరిసారిగా 2015లో సవరించి 60 నుంచి 120 రోజులకు పెంచారు. 1998 వరకు ఈ వ్యవధి 30 రోజుల కంటే తక్కువగా ఉండేది.
ఇంకా చదవండి: ఆమెకు ఆ అరబి కుటుంబం దేవుడుతో సమానం! పొగడ్తల తో ముంచేత్తుతున్న తెలుగు ఆడ పడుచు! ఇంతకీ ఆమెకు ఏమి జరిగిందంటే! 14
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
చంద్రబాబు విజయనగరం జిల్లా పర్యటనలో మార్పు! ఎందుకో తెలుసా..?
ఈరోజే నామినేటెడ్ పోస్టుల రెండవ లిస్టు విడుదల? టీటీడీ చైర్మన్ ఆయనేనా?
పోలీసుల వేషంలో కిడ్నాప్ డ్రామా...చంపుతామని బెదిరింపు! వాహన తనిఖీలో నిందితులు అరెస్ట్!
మద్యంపై చేసే ఖర్చులో తెలుగు రాష్ట్రాలే టాప్! సంవత్సరానికి ఎంతో తెలుసా?
ఏపీలో మందుబాబులకు వెరైటీ ఆఫర్! ఒక బాటిల్ కొంటే అవి ఫ్రీ!
గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్ నియామక వివాదం! ఫోన్ సంభాషణ సోషల్ మీడియాలో హల్ చల్!
విభజన తర్వాత ఢిల్లీలో కొత్త ఏపీ భవన్ నిర్మాణానికి పచ్చ జెండా! నవంబర్ లోపు గుత్తేదారులకు ఆహ్వానం!
ఈ-చలాన్ పేరుతో కొత్త స్కామ్! ఒక్క క్లిక్ తో బ్యాంక్ అకౌంటు ఖాళీ! హెచ్చరికలు జారీ చేసిన కేంద్రం!
పార్లమెంట్ ఉభయసభలు ప్రత్యేక సమావేశం! ఎప్పుడు - ఎందుకు?
"ప్రజా వేదిక" కార్యక్రమంలో ఈరోజు పాల్గొననున్న మంత్రులు మరియు నాయకుల షెడ్యూల్! మీ కోసం!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: