ప్రస్తుతం ఇంగ్లండ్ లయన్స్ (ఇంగ్లండ్-ఏ) జట్టు భారత్ లో పర్యటిస్తోంది.
అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఇండియా-ఏ, ఇంగ్లండ్ లయన్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ డ్రాగా ముగిసింది.
ఈ మ్యాచ్ లో తెలుగుతేజం, ఆంధ్రా వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ కేఎస్ భరత్ వీరోచిత సెంచరీ చేయడం విశేషం.
రెండో ఇన్నింగ్స్ లో 490 పరుగుల లక్ష్యఛేదనకు దిగిన భారత్-ఏ జట్టు ఓ దశలో ఓటమిదిశగా పయనిస్తున్నట్టు కనిపించింది.
అయితే భరత్ అద్భుత పోరాటపటిమ కనబర్చి జట్టును ఓటమి బారి నుంచి కాపాడాడు.
సింగపూర్ లో తెలుగు వారికి శుభవార్త! హైదరాబాద్ లో పెట్టుబడి అవకాశం మీ ముంగిట్లోకే! ఈ నెల 20 - 21 తేదీలలో! మరిన్ని వివరాల కోసం Click Here
ఆరో వికెట్ కు మానవ్ సుతార్ తో కలిసి అజేయంగా 207 పరుగులు జోడించాడు.
భరత్ 165 బంతుల్లో 116 పరుగులు చేశాడు. కాగా, సెంచరీ పూర్తి కాగానే భరత్ తన బ్యాట్ ను విల్లుగా మార్చి బాణం సంధిస్తున్నట్టుగా సెలబ్రేట్ చేసుకున్నాడు.
తద్వారా తన సెంచరీని అయోధ్య రాముడికి అంకితం ఇస్తున్నట్టుగా ప్రకటించాడు.
దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
తెలుగు ప్రవాసులకు ఉపయోగ పడే వార్తలు, వారికి సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒక చోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి