Nara Lokesh: వరద ముప్పుకు శాశ్వత పరిష్కారం.. రూ.294.20 కోట్లతో రిటైనింగ్ వాల్ నిర్మాణానికి లోకేష్ శ్రీకారం! Nara Lokesh: ఇచ్చిన మాట నిలబెట్టుకున్న నారా లోకేష్.. మంగళగిరిలో రూ.14.88 కోట్లతో Chandrababu: చంద్రబాబు సంచలన ప్రకటన.. వారికి పెన్షన్ పెంపు! ట్రిపుల్ బెడ్ రూమ్ ఇళ్లు... Parliament's Budget Meeting: ఢిల్లీలో పార్లమెంటు మలి విడత బడ్జెట్ సమావేశాలు ప్రారంభం! Praja Vedika: నేడు (09/03) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! Ration cards: ఏపీలో రేషన్ కార్డు సేవల ఛార్జీల పెంపు... పూర్తి వివరాలివే! Chandrababu: త్వరలోనే వారికి 33% రిజర్వేషన్లు! ఎమ్మెల్యేలు అయ్యేందుకు సిద్ధం కండి- చంద్రబాబు! Iconic Bridge: అమరావతి ఐకానిక్ బ్రిడ్జ్ లొకేషన్ మార్పు! కొత్త రూట్ ఇదే... Iran Politics: ఇజ్రాయెల్ దాడుల వేళ ఇరాన్ కీలక నిర్ణయం..! నూతన సుప్రీం లీడర్ ఎంపిక! Inner Ring Road: అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు.. ఆ 15 గ్రామాలకు మహర్దశ! Nara Lokesh: వరద ముప్పుకు శాశ్వత పరిష్కారం.. రూ.294.20 కోట్లతో రిటైనింగ్ వాల్ నిర్మాణానికి లోకేష్ శ్రీకారం! Nara Lokesh: ఇచ్చిన మాట నిలబెట్టుకున్న నారా లోకేష్.. మంగళగిరిలో రూ.14.88 కోట్లతో Chandrababu: చంద్రబాబు సంచలన ప్రకటన.. వారికి పెన్షన్ పెంపు! ట్రిపుల్ బెడ్ రూమ్ ఇళ్లు... Parliament's Budget Meeting: ఢిల్లీలో పార్లమెంటు మలి విడత బడ్జెట్ సమావేశాలు ప్రారంభం! Praja Vedika: నేడు (09/03) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! Ration cards: ఏపీలో రేషన్ కార్డు సేవల ఛార్జీల పెంపు... పూర్తి వివరాలివే! Chandrababu: త్వరలోనే వారికి 33% రిజర్వేషన్లు! ఎమ్మెల్యేలు అయ్యేందుకు సిద్ధం కండి- చంద్రబాబు! Iconic Bridge: అమరావతి ఐకానిక్ బ్రిడ్జ్ లొకేషన్ మార్పు! కొత్త రూట్ ఇదే... Iran Politics: ఇజ్రాయెల్ దాడుల వేళ ఇరాన్ కీలక నిర్ణయం..! నూతన సుప్రీం లీడర్ ఎంపిక! Inner Ring Road: అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు.. ఆ 15 గ్రామాలకు మహర్దశ!

AP Politics: అరెస్టు అవుతానన్న భయంతో అజ్ఞాతంలోకి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే..!!

గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ నేత వల్లభనేని వంశీ ప్రస్తుతం అజ్ఞాతంలోకి వెళ్లినట్లు సమాచారం వెలుగులోకి వచ్చింది. గత కొన్ని రోజులుగా ఆయన ప్రజల్లో కనిపించడ

Published : 2025-12-30 13:41:00
ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టేందుకు ఎన్నారైలకు పెద్ద పీట.. ఎన్నారైల తో చంద్రబాబు

గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ నేత వల్లభనేని వంశీ ప్రస్తుతం అజ్ఞాతంలోకి వెళ్లినట్లు సమాచారం వెలుగులోకి వచ్చింది. గత కొన్ని రోజులుగా ఆయన ప్రజల్లో కనిపించడం లేదు. తనపై నమోదైన కేసుల్లో పోలీసులు అరెస్టు చేస్తారన్న అనుమానంతోనే ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి అండర్‌గ్రౌండ్‌కు వెళ్లారని పోలీసు వర్గాలు భావిస్తున్నాయి. ఈ పరిణామం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.

Delhi High Court: పవన్ కళ్యాణ్, Jr.NTR పిటిషన్లపై ఢిల్లీ హైకోర్టు కీలక తీర్పు.. సెలబ్రిటీల హక్కులకు రక్షణ!

డిసెంబర్ 17న విజయవాడ మాచవరం పోలీస్ స్టేషన్‌లో వంశీపై హత్యాయత్నం సహా పలు తీవ్రమైన సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. ఐపీసీ 307, 324తో పాటు ఇతర సెక్షన్లను పోలీసులు నమోదు చేశారు. ఈ కేసులో వంశీ ప్రధాన నిందితుడిగా ఉన్నారని పోలీసులు పేర్కొన్నారు. ఆయనతో పాటు మరికొందరు అనుచరులను కూడా నిందితుల జాబితాలో చేర్చారు. గత ఏడాది జూన్ నెలలో రాజకీయ విభేదాల నేపథ్యంలో ఓ వర్గంపై దాడికి వంశీ అనుచరులను రెచ్చగొట్టారని, కర్రలు మరియు మారణాయుధాలతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచారని ఎఫ్ఐఆర్‌లో స్పష్టంగా పేర్కొన్నారు.

New Airport: ఏపీలో ఆ జిల్లాలో కొత్తగా ఎయిర్‌పోర్ట్..రూ. 916 కోట్లతో తొలిదశ! భూసేకరణకు ఓకే!

ఈ కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ వంశీ హైకోర్టును ఆశ్రయించినప్పటికీ అక్కడ నుంచి ఆశించిన ఉపశమనం లభించలేదని సమాచారం. దాంతో అరెస్టు తప్పదన్న భావనతోనే ఆయన అజ్ఞాతంలోకి వెళ్లారని తెలుస్తోంది. అంతేకాదు, విజయవాడలోని ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక కోర్టులో మరో కేసుకు సంబంధించి హాజరు కావాల్సి ఉన్నప్పటికీ వంశీ కోర్టుకు రాలేదు. 

తీవ్ర విషాదం.. టీవీ సీరియల్ నటి ఆత్మహత్య! 20 ఏళ్లకే..

వంశీతో పాటు ఈ కేసులో నిందితులుగా ఉన్న కొందరు అనుచరులు కూడా కోర్టు వాయిదాలకు హాజరుకాకపోవడంతో, వారంతా పరారీలో ఉన్నారని పోలీసులు భావిస్తున్నారు. ఇప్పటికే పలు కేసుల్లో బెయిల్‌పై బయట ఉన్న వంశీ, తాజాగా నమోదైన హత్యాయత్నం కేసులో మాత్రం అరెస్టు కావాల్సి ఉండటంతో పరిస్థితి మరింత క్లిష్టంగా మారింది. ప్రస్తుతం ఆయన కోసం ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది.

యాదగిరిగుట్టలో టీటీడీ తరహా సేవలు.. భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతిని పంచేలా సరికొత్త నిర్ణయాలు! నేటి నుంచి ప్రతిరోజూ..

మరోవైపు వంశీకి న్యాయపరంగా ఎదురుదెబ్బ తగిలింది. హైకోర్టు ఇచ్చిన ముందస్తు బెయిల్ ఉత్తర్వులపై రాష్ట్ర ప్రభుత్వం అప్పీల్ చేయగా, సుప్రీంకోర్టు ఆ ఉత్తర్వులను పక్కన పెట్టింది. రాష్ట్ర ప్రభుత్వ వాదనలు వినకుండా ముందస్తు బెయిల్ ఇవ్వడాన్ని సర్వోన్నత న్యాయస్థానం తప్పుబట్టింది. ఈ అంశంపై ఇరు పక్షాల వాదనలు విని మెరిట్స్ ఆధారంగా నిర్ణయం తీసుకోవాలని కోర్టు ఆదేశించింది.

SBI account: SBI అకౌంట్ ఉంటే చాలు… ప్రమాదంలో ₹కోటి పరిహారం!

ఇదే సమయంలో గనుల అక్రమ తవ్వకాలకు సంబంధించిన మరో కేసు కూడా వంశీపై తీవ్ర ఆరోపణలు మోపుతోంది. గన్నవరం, బాపులపాడు, విజయవాడ గ్రామీణ మండలాల పరిధిలో అక్రమంగా గనులు తవ్వి ప్రభుత్వ ఖజానాకు కోట్ల రూపాయల నష్టం కలిగించారని జిల్లా గనులశాఖ అధికారుల ఫిర్యాదులో పేర్కొన్నారు. ఫోర్జరీ పత్రాలు సృష్టించి సహజ వనరులను దోచుకున్నారన్న ఆరోపణలపై విజిలెన్స్ విచారణలో వంశీ పాత్ర ఉన్నట్లు తేలిందని ప్రభుత్వం వాదిస్తోంది.

మందుబాబులకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం! రేపు తెల్లవారుజాము నుంచే - నిబంధనలు అతిక్రమిస్తే!

ఈ పరిణామాలన్నింటితో వైఎస్సార్సీపీలోనూ రాజకీయ వర్గాల్లోనూ ఉత్కంఠ నెలకొంది. అజ్ఞాతంలోకి వెళ్లిన వంశీ ఎప్పుడు బయటకు వస్తారు, పోలీసుల ముందు లొంగిపోతారా లేదా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. రాష్ట్ర రాజకీయాల్లో ఈ కేసు ఏ మలుపు తిరుగుతుందోనన్న ఉత్కంఠ కొనసాగుతోంది.

అబ్బాయిల కోసమే తయారు చేసే ఈ పచ్చడి వెనుక అసలు కథ ఇదే!!
Gandhi family : గాంధీ కుటుంబంలో శుభవార్త… రైహాన్ త్వరలో పెళ్లి పీటలు!
Raja Saab: ప్రభాస్‌పై నమ్మకంతోనే రాజాసాబ్… మారుతి ఎమోషనల్ కామెంట్!

Spotlight

Read More →