Nara Lokesh: మైలవరం స్కూల్‌లో లోకేష్ తనిఖీ! ప్రధానోపాధ్యాయుడు జాన్ సస్పెన్షన్... Chandrababu: చంద్రబాబు భద్రతా బృందానికి అరుదైన సత్కారం! సీఎస్ఓ కు ‘మహోన్నత సేవా పతకం’!కాన్వాయ్ డ్రైవర్ కు ఉత్తమ సేవా పతకం. Chandrababu: ఏపీలో 14 వేల మెట్రిక్ టన్నుల గ్యాస్ నిల్వలు... ముఖ్యమంత్రి కీలక ప్రకటన..! YSRCP: రేపల్లెలో వైసీపీ ఇన్ ఛార్జ్ హల్ చల్... సీఐ అంతు చూస్తానంటూ వార్నింగ్! Land Irregularities: పల్నాడు జిల్లాలో భూ అక్రమాలపై సర్కార్ వేటు.. కీలక ఆదేశాలు జారీ! Revanth Reddy: నేడు ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి.. కేంద్ర మంత్రులతో కీలక భేటీ! AP Government: ఏపీ ప్రజలకు బంపర్ ఆఫర్... వడ్డీలో 50% రాయితీ! త్వరపడండి... Chandrababu: ఇమామ్, మౌజమ్‌లకు గుడ్ న్యూస్! నేటి రాత్రి లోపే బకాయిల విడుదల... సీఎం ఆదేశాలు! Minister Savitha: భావి తరాలకు అమరజీవి చరిత్రే స్ఫూర్తి- మంత్రి సవిత! Speed Post: ప్రైవేట్ కొరియర్లకు షాక్..! తపాలా శాఖ నుంచి సూపర్ ఫాస్ట్ సర్వీస్ ప్రారంభం! Nara Lokesh: మైలవరం స్కూల్‌లో లోకేష్ తనిఖీ! ప్రధానోపాధ్యాయుడు జాన్ సస్పెన్షన్... Chandrababu: చంద్రబాబు భద్రతా బృందానికి అరుదైన సత్కారం! సీఎస్ఓ కు ‘మహోన్నత సేవా పతకం’!కాన్వాయ్ డ్రైవర్ కు ఉత్తమ సేవా పతకం. Chandrababu: ఏపీలో 14 వేల మెట్రిక్ టన్నుల గ్యాస్ నిల్వలు... ముఖ్యమంత్రి కీలక ప్రకటన..! YSRCP: రేపల్లెలో వైసీపీ ఇన్ ఛార్జ్ హల్ చల్... సీఐ అంతు చూస్తానంటూ వార్నింగ్! Land Irregularities: పల్నాడు జిల్లాలో భూ అక్రమాలపై సర్కార్ వేటు.. కీలక ఆదేశాలు జారీ! Revanth Reddy: నేడు ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి.. కేంద్ర మంత్రులతో కీలక భేటీ! AP Government: ఏపీ ప్రజలకు బంపర్ ఆఫర్... వడ్డీలో 50% రాయితీ! త్వరపడండి... Chandrababu: ఇమామ్, మౌజమ్‌లకు గుడ్ న్యూస్! నేటి రాత్రి లోపే బకాయిల విడుదల... సీఎం ఆదేశాలు! Minister Savitha: భావి తరాలకు అమరజీవి చరిత్రే స్ఫూర్తి- మంత్రి సవిత! Speed Post: ప్రైవేట్ కొరియర్లకు షాక్..! తపాలా శాఖ నుంచి సూపర్ ఫాస్ట్ సర్వీస్ ప్రారంభం!

Vivekananda case: సినిమాలను మించిన స్థాయిలో బాబాయ్ హత్య పై కథలు.. 4 ఏళ్లుగా నిందితులు రోజుకో మాట!

Vivekananda case: ఇవాళ చెప్పింది రేపు చెప్పరు...ఈ కోర్టులో చెప్పింది ఇంకో కోర్టులో చెప్పరు. కరుడుగట్టిన హంతకులు మాత్రమే ఇలా చేయగలరు. నాలుగేళ్లలో వివేకా హత్యపై నిందితులు ఏఏ కారణాలు చెప్పారో చూద్దాం.

Published : 2026-03-17 14:26:00
  • మాజీ మంత్రి వివేకా హత్య కేసులో సీబీఐ కోర్టు కీలక ఆదేశం..
     
  • ఆస్తి వ్యవహారాల్లో సొంత అల్లుడితో…

Vivekananda case: వైఎస్ వివేకానంద రెడ్డి హత్య జరిగిన 2019 మార్చి 15వ తేదీ ఉదయం నుంచి నేటి వరకు ఈ కేసులో చోటుచేసుకున్న పరిణామాలు, వ్యక్తం చేయబడిన విభిన్న వాదనలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. హత్య జరిగిన తొలి గంటల్లో అది కేవలం గుండెపోటు అని సాక్షి ఛానల్‌లో ప్రచారం జరగడం నుంచి ప్రారంభమైన ఈ గందరగోళం, ఆ తర్వాత రక్తపు వాంతులుగా మారి, చివరికి గొడ్డలితో జరిగిన దారుణ హత్యగా నిర్ధారణ అయింది. అయితే, ఎన్నికల ముందు ఈ ఘటనను 'నారాసుర రక్త చరిత్ర' అంటూ నాటి ప్రతిపక్షం నాపై నెట్టేసి రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం చేసింది. విచారణ క్రమంలో బెంగళూరులోని ఆస్తి సెటిల్మెంట్ వివాదాలే ఈ హత్యకు మూలమని ఒక దశలో పేర్కొన్నారు. విచిత్రమేమిటంటే, నాటి ప్రభుత్వం విచారణ జరుపుతుంటే ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్ కోర్టుకు వెళ్లి గ్యాగ్ ఆర్డర్ తీసుకురావడం చూస్తే, నిందితులు ఎవరో వారికి ముందే తెలుసనే అనుమానాలు బలపడ్డాయి.

ఎన్నికలకు ముందు ఏపీ పోలీసులపై నమ్మకం లేదని, సిబిఐ విచారణ కావాలని డిమాండ్ చేసిన జగన్, ముఖ్యమంత్రి పీఠం అధిష్టించిన తర్వాత మాత్రం సిబిఐ విచారణ వద్దని మాట మార్చడం అనేక సందేహాలకు తావిచ్చింది. ఈ కేసును తప్పుదోవ పట్టించే క్రమంలో వివేకా రెండో వివాహమే హత్యకు కారణమని, ఆస్తి వ్యవహారాల్లో సొంత అల్లుడితో వివాదాలు ఉన్నాయని రకరకాల కథనాలను ప్రచారంలోకి తెచ్చారు. అంతటితో ఆగకుండా, న్యాయం కోసం పోరాడుతున్న వివేకా కుమార్తె సునీత రెడ్డిపై కూడా నిందలు వేస్తూ, టీడీపీ నేత బిటెక్ రవితో ఆమెకు, ఆమె భర్తకు సంబంధాలు ఉన్నాయని ఆరోపించడం అత్యంత దారుణం. నిందితుడైన సునీల్ యాదవ్ తల్లిని వివేకా లైంగికంగా వేధించారని, అలాగే ఉమా శంకర్ రెడ్డి భార్యతోనూ ఆయనకు సంబంధం ఉందని బెయిల్ పిటిషన్లలో పేర్కొంటూ చనిపోయిన వ్యక్తి క్యారెక్టర్ అస్సాసినేషన్ చేయడానికి ప్రయత్నించారు.

నాడు వివేకానంద రెడ్డి అత్యంత సౌమ్యుడని స్వయంగా జగన్ రెడ్డి కొనియాడగా, నేడు అదే వర్గం వారు రెండో భార్య కోసం, డబ్బుల కోసం సెటిల్మెంట్లు చేసే వ్యక్తిగా ఆయనను చిత్రికరించడం వారి ద్వంద్వ నీతికి అద్దం పడుతోంది. కేసు విచారణను అడ్డుకోవడానికి, నిందితులను కాపాడడానికి మొదటి రోజు నుంచే పక్కా స్క్రిప్ట్ ప్రకారం అబద్ధాలను ప్రచారం చేశారని స్పష్టమవుతోంది. ఇలాంటి నీచపు ఆరోపణలు చేయడం ద్వారా బాధితులనే నిందితులుగా మార్చే ప్రయత్నం జరిగిందని, ఇది కేవలం రాజకీయం కోసం ఒక మహనీయుడి ప్రతిష్ఠను మంటగలిపే చర్య అని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సత్యం నిలకడగా తెలుస్తుందని, సిబిఐ విచారణ ద్వారా అసలైన సూత్రధారులు బయటకు వస్తారని ప్రజలు ఆశిస్తున్నారు.

Spotlight

Read More →