Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఆర్టీసీ ఎలక్ట్రిక్ ఏసీ బస్సులు... మూడు నగరాల నుండి నేరుగా సర్వీసులు! Anna Canteens: ఏపీలో పేదలకు గుడ్ న్యూస్... ఈ నెల 15 నుంచి మరో 62 అన్న క్యాంటీన్లు ప్రారంభం! AP Development: ఏపీ సీఆర్డీఏ కీలక నిర్ణయం! అమరావతి "ట్రై సిటీ" ప్లాన్... Praja Vedika: నేడు (14/04) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! Palavagu: అమరావతిలో 'పాలవాగు' పరవళ్లు... ఎంత అద్భుతంగా ఉందో... పెనుమాక నుండి దొండపాడు వరకు.... Chandrababu: ధరణికోటలో అన్న క్యాంటీన్ ప్రారంభించనున్న చంద్రబాబు.. సీఎం రాకతో పండగ వాతావరణం.! Hyderabad: ఏప్రిల్ నెలలోనే ఇంత వాడకమా? గ్రిడ్ స్థిరత్వంపై టీజీఎస్పీడీసీఎల్ కీలక ప్రకటన.. Ram Mohan Naidu: 75 ఏళ్ల నిరీక్షణకు తెర.. తిరుపతి రైలును ప్రారంభించిన మంత్రి! కేవలం రైలు మాత్రమే కాదు.. జిల్లా ఆకాంక్ష! AP Govt: ఇంటిపై జేసీబీలతో దాడి.. రాజకీయ కక్షతో రికార్డులు తారుమారు చేసి భూమి ఆక్రమణ.. వైసీపీ నేతలపై గ్రీవెన్స్ లో ఫిర్యాదు! Revanth Reddy: 46 ఏళ్లలో ఒక్క మహిళా అధ్యక్షురాలు లేకపోవడంపై రేవంత్ రెడ్డి ఫైర్! 15 మంది అధ్యక్షులు మారారు కానీ.. Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఆర్టీసీ ఎలక్ట్రిక్ ఏసీ బస్సులు... మూడు నగరాల నుండి నేరుగా సర్వీసులు! Anna Canteens: ఏపీలో పేదలకు గుడ్ న్యూస్... ఈ నెల 15 నుంచి మరో 62 అన్న క్యాంటీన్లు ప్రారంభం! AP Development: ఏపీ సీఆర్డీఏ కీలక నిర్ణయం! అమరావతి "ట్రై సిటీ" ప్లాన్... Praja Vedika: నేడు (14/04) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! Palavagu: అమరావతిలో 'పాలవాగు' పరవళ్లు... ఎంత అద్భుతంగా ఉందో... పెనుమాక నుండి దొండపాడు వరకు.... Chandrababu: ధరణికోటలో అన్న క్యాంటీన్ ప్రారంభించనున్న చంద్రబాబు.. సీఎం రాకతో పండగ వాతావరణం.! Hyderabad: ఏప్రిల్ నెలలోనే ఇంత వాడకమా? గ్రిడ్ స్థిరత్వంపై టీజీఎస్పీడీసీఎల్ కీలక ప్రకటన.. Ram Mohan Naidu: 75 ఏళ్ల నిరీక్షణకు తెర.. తిరుపతి రైలును ప్రారంభించిన మంత్రి! కేవలం రైలు మాత్రమే కాదు.. జిల్లా ఆకాంక్ష! AP Govt: ఇంటిపై జేసీబీలతో దాడి.. రాజకీయ కక్షతో రికార్డులు తారుమారు చేసి భూమి ఆక్రమణ.. వైసీపీ నేతలపై గ్రీవెన్స్ లో ఫిర్యాదు! Revanth Reddy: 46 ఏళ్లలో ఒక్క మహిళా అధ్యక్షురాలు లేకపోవడంపై రేవంత్ రెడ్డి ఫైర్! 15 మంది అధ్యక్షులు మారారు కానీ..

APCPDCL: గుణదలలో విద్యుత్ సౌరభం: ఏపీసీపీడీసీఎల్ నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి గొట్టిపాటి!

APCPDCL: విజయవాడలో ఏపీసీపీడీసీఎల్ నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి గొట్టిపాటి రవికుమార్, రైతులకు అంతరాయం లేని విద్యుత్ అందించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. విద్యుత్ ఛార్జీలు పెంచకుండా, నాణ్యమైన సరఫరా కోసం అధికారులు కృషి చేయాలని ఆయన సూచించారు.

Published : 2026-04-08 13:01:00

రైతులకు 'విద్యుత్' కష్టాలు ఉండొద్దు…

సీఎం చంద్రబాబు ఆదేశాలే మాకు శిరోధార్యం…

ఛార్జీల పెంపు ఉండదు.. అంతరాయం అస్సలు వద్దు…

APCPDCL: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ నేడు విజయవాడలోని గుణదల విద్యుత్ సౌధలో ఏపీ సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ లిమిటెడ్ (APCPDCL) నూతన కార్యాలయాన్ని ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, విద్యుత్ శాఖ అధికారులు, సిబ్బంది సమష్టి కృషి వల్లనే నేడు ఈ రంగానికి ప్రజల్లో మంచి పేరు వచ్చిందని అభినందించారు. అత్యాధునిక సదుపాయాలతో కూడిన ఈ నూతన కార్యాలయం ద్వారా వినియోగదారులకు మరింత వేగంగా, పారదర్శకమైన సేవలు అందుతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు రాష్ట్రంలో విద్యుత్ సరఫరాపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని మంత్రి స్పష్టం చేశారు. ముఖ్యంగా రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయడమే తమ మొదటి ప్రాధాన్యత అని ఆయన పేర్కొన్నారు. విద్యుత్ ఛార్జీలు పెంచకుండానే, సరఫరాలో ఎక్కడా అంతరాయం లేకుండా చూడాలనేది ముఖ్యమంత్రి ఆకాంక్ష అని, ఆ దిశగా తాము నిరంతరం శ్రమిస్తున్నామని మంత్రి తెలిపారు. ప్రజలపై భార పడకుండా నాణ్యమైన సేవలు అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఆయన పునరుద్ఘాటించారు.

రాష్ట్రంలో విపత్తులు సంభవించినప్పుడు విద్యుత్ శాఖ అధికారులు ప్రాణాలకు తెగించి పనిచేస్తున్న తీరును మంత్రి గొట్టిపాటి ప్రత్యేకంగా ప్రశంసించారు. తుపాన్లు, భారీ వర్షాల సమయంలో అతి తక్కువ సమయంలోనే విద్యుత్ పునరుద్ధరణ పనులు చేపట్టి ప్రజల కష్టాలను తీర్చడంలో వారు చూపుతున్న చొరవ అభినందనీయమన్నారు. భవిష్యత్తులో కూడా విద్యుత్ శాఖను దేశంలోనే అగ్రగామిగా నిలబెట్టేందుకు అధికారులు తమ శక్తివంచన లేకుండా పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు.

Spotlight

Read More →