TamilNadu Elections 2026: విజయ్ సంచలన నిర్ణయం... సీఎం పదవి ఆఫర్‌ను కాదన్న టీవీకే! North Korea: ఉత్తర కొరియాలో కిమ్ జోంగ్ ఉన్ అఖండ విజయం..! ఏకంగా 99.93 శాతం ఓట్లతో రికార్డు! Gudivada: మాజీ మంత్రి కఠారి ఇంట్లో భారీ చోరీ! సీన్ చూసి పోలీసులు షాక్...! National Highway: ఏపీలో కొత్తగా నేషనల్ హైవే! రూ.1,670 కోట్లతో నాలుగు లైన్లుగా.. ఘాట్ రోడ్డుకు కొత్త కళ! Corporation Scam: గుంటూరు కార్పొరేషన్‌లో టెండర్ల కుంభకోణం..! మాయమైన 200 కీలక ఫైళ్లు..! AP Politics: ముగిసిన ప్రజాప్రతినిధుల పదవీ కాలం...! నేటి నుంచి ప్రత్యేకాధికారుల చేతుల్లోకి అధికారం! Petrol Diesel Price: వాహనదారులకు గుడ్ న్యూస్.. పెట్రోల్, డీజిల్ ధరలపై కేంద్రం బిగ్ అప్డేట్! Praja Vedika: నేడు (18/03) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! AP Government: ఏపీ సర్కార్ కీలక నిర్ణయం! ఇక నుండి అది తప్పనిసరి... ఆదేశాలు జారీ! AP Secretariat: స్వర్ణ గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు అలర్ట్… కొత్త నిబంధనలు! TamilNadu Elections 2026: విజయ్ సంచలన నిర్ణయం... సీఎం పదవి ఆఫర్‌ను కాదన్న టీవీకే! North Korea: ఉత్తర కొరియాలో కిమ్ జోంగ్ ఉన్ అఖండ విజయం..! ఏకంగా 99.93 శాతం ఓట్లతో రికార్డు! Gudivada: మాజీ మంత్రి కఠారి ఇంట్లో భారీ చోరీ! సీన్ చూసి పోలీసులు షాక్...! National Highway: ఏపీలో కొత్తగా నేషనల్ హైవే! రూ.1,670 కోట్లతో నాలుగు లైన్లుగా.. ఘాట్ రోడ్డుకు కొత్త కళ! Corporation Scam: గుంటూరు కార్పొరేషన్‌లో టెండర్ల కుంభకోణం..! మాయమైన 200 కీలక ఫైళ్లు..! AP Politics: ముగిసిన ప్రజాప్రతినిధుల పదవీ కాలం...! నేటి నుంచి ప్రత్యేకాధికారుల చేతుల్లోకి అధికారం! Petrol Diesel Price: వాహనదారులకు గుడ్ న్యూస్.. పెట్రోల్, డీజిల్ ధరలపై కేంద్రం బిగ్ అప్డేట్! Praja Vedika: నేడు (18/03) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! AP Government: ఏపీ సర్కార్ కీలక నిర్ణయం! ఇక నుండి అది తప్పనిసరి... ఆదేశాలు జారీ! AP Secretariat: స్వర్ణ గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు అలర్ట్… కొత్త నిబంధనలు!

అమరావతికి చట్టబద్ధమైన హోదా.. 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా బంద్ అఖిలపక్ష భేటీలో ఏపీ ఎంపీల డిమాండ్!

అమరావతికి చట్టపరమైన హోదా కల్పించేలా పార్లమెంటులో బిల్లు తేవాలని టీడీపీ నేత లావు శ్రీకృష్ణ దేవరాయలు డిమాండ్ చేశారు.

Published : 2026-01-27 16:54:00

కేంద్ర బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో దేశ రాజధానిలో రాజకీయ సందడి మొదలైంది. బుధవారం నుంచి ప్రారంభం కానున్న పార్లమెంటు సమావేశాలకు ముందు కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో తెలుగుదేశం పార్టీ (TDP) కీలక డిమాండ్లను తెరపైకి తెచ్చింది. ఆంధ్రప్రదేశ్ జీవనాడి, రాష్ట్ర రాజధాని అమరావతికి పూర్తిస్థాయి చట్టపరమైన హోదా కల్పించేలా పార్లమెంటులో ప్రత్యేక బిల్లును ప్రవేశపెట్టాలని టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేత లావు శ్రీకృష్ణ దేవరాయలు కేంద్రాన్ని కోరారు.

రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో ఏపీ ప్రయోజనాలతో పాటు జాతీయ స్థాయి సమస్యలపై కూడా చర్చించాలని టీడీపీ విజ్ఞప్తి చేసింది. సమావేశం అనంతరం శ్రీకృష్ణ దేవరాయలు మీడియాతో మాట్లాడుతూ అఖిలపక్ష భేటీ వివరాలను వెల్లడించారు.

రాజధాని అమరావతికి రక్షణ కవచం రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాలు రాజధాని నిర్మాణం. అమరావతికి కేవలం ప్రకటనల ద్వారా కాకుండా చట్టపరమైన భరోసా ఉండాలని టీడీపీ స్పష్టం చేసింది. అమరావతికి చట్టబద్ధమైన హోదా ఇవ్వాలి. దీనివల్ల భవిష్యత్తులో ఎలాంటి రాజకీయ మార్పులు వచ్చినా రాజధాని నిర్మాణానికి ఆటంకం కలగదు. దీనిపై కేంద్రం తక్షణమే బిల్లు తీసుకురావాలి అని లావు పేర్కొన్నారు. 

ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని హామీల అమలుతో పాటు, రాజధాని అభివృద్ధికి అవసరమైన మద్దతును చట్టబద్ధం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్ర అంశాలతో పాటు మూడు ప్రధాన జాతీయ అంశాలను పార్లమెంటులో చర్చకు పెట్టాలని టీడీపీ సూచించింది

ఎఫ్టీఏల సమీక్ష: భారత్-యూరోపియన్ యూనియన్ (EU) సహా ఇతర దేశాలతో కుదుర్చుకున్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాల (FTA) వల్ల కలిగే లాభనష్టాలపై సమగ్ర చర్చ జరగాలి.

సోషల్ మీడియాపై నియంత్రణ: 16 ఏళ్లలోపు పిల్లలు సోషల్ మీడియా వాడకుండా ఆస్ట్రేలియా ప్రభుత్వం మాదిరిగా భారత్ కూడా కఠినమైన నిషేధ చట్టాన్ని తీసుకురావాలి.

ప్రజాప్రతినిధుల అనర్హత: ప్రధాని, ముఖ్యమంత్రులు సహా ఎవరైనా ప్రజాప్రతినిధులు 30 రోజుల పాటు జైలు శిక్ష అనుభవిస్తే, వారి పదవిని కోల్పోయేలా చట్టాల్లో మార్పులు తేవాలని కోరారు.

ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి పూర్వోదయ పథకం కింద అత్యధిక నిధులు కేటాయించాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలోని కరువు పరిస్థితులను అధిగమించేందుకు నదుల అనుసంధాన ప్రక్రియకు కేంద్రం పూర్తి సహకారం అందించాలని కోరారు. పోలవరం ప్రాజెక్టు నిధులతో పాటు ఉత్తరాంధ్ర, రాయలసీమ అభివృద్ధి ప్యాకేజీల పైనా టీడీపీ దృష్టి పెట్టనుంది..

Spotlight

Read More →