- తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ ఆధ్వర్యంలో థాంక్యు లోకేష్ కార్యక్రమం నిర్వహించారు..
- మంత్రి లోకేష్ సారధ్యంలో విద్యావ్యవస్థ బలోపేతానికి కృషి…
APStudents palabhishekam nara Lokesh: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పేద, మధ్య, దిగువ తరగతి వర్గాల విద్యార్థుల చదువులకు గత ప్రభుత్వం ఎన్నో ఆటంకాలు కలిగిస్తే ఇప్పుడు మన రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను చెల్లించేందుకు జీవో జారీ చేయడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ విద్యార్థులు, ప్రైవేటు విద్యాసంస్థల యాజమాన్యాలతో కలిసి సోమవారం తణుకులో మంత్రి శ్రీ నారా లోకేష్ (Nara Lokesh) గారి చిత్రపటానికి పాలాభిషేకం చేయటం జరిగింది.
మన కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే 20 నెలల కాలంలో రూ. 2800 కోట్లు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించగా, ఈ నెలలోనే రూ. 1200 కోట్లు చెల్లించడానికి జీవో ఇవ్వటం జరిగింది. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో విద్యార్థులతో పాటు ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలు, అధ్యాపకులు కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.