Agriculture News: అన్నదాతలకు సర్కార్ కానుక.. రెండో విడత రైతు భరోసా డేట్ ఫిక్స్. AP Government Schemes: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. అంగన్‌వాడీల్లో ఇక ఇండక్షన్ స్టవ్‌లతోనే వంట.! Jagan Plan: విట్, ఎస్ఆర్ఎం పేర్లు మార్పించిన జగన్! అసలు కారణం ఇదేనా.... Google Data Center: ప్రపంచంలోనే మొదటిసారిగా... మూడు చోట్ల హైపర్‌స్కేల్ డేటా సెంటర్లు! ఏప్రిల్ 28న ముహూర్తం ఫిక్స్! Amaravati Bill: అమరావతికి కేంద్రం గ్రీన్ సిగ్నల్: ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అధికారిక గెజిట్ విడుదల! Praja Vedika: నేడు (07/04) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! Green Field Highway: ఇక ట్రాఫిక్ టెన్షన్ గుడ్‌బై! హైదరాబాద్–వైజాగ్ కొత్త గ్రీన్‌ఫీల్డ్ హైవే... కేవలం 2 గంటల్లోనే! Amaravati Capital: అమరావతే ఆంధ్రుల రాజధాని... కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ విడుదల! Praja Vedika: అదృశ్యమవుతున్న భూములు.. తెరవెనుక అసలు సూత్రధారులు ఎవరు? గ్రీవెన్స్‌లో వెలుగుచూసిన విస్తుపోయే నిజాలు! రేపు ప్రజా వేదికలో పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! Amrit Bharat Station Scheme: అమృత్ భారత్ పథకంలో పిఠాపురం.. కార్పొరేట్ లుక్‌లో మెరిసిపోనున్న స్టేషన్! Agriculture News: అన్నదాతలకు సర్కార్ కానుక.. రెండో విడత రైతు భరోసా డేట్ ఫిక్స్. AP Government Schemes: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. అంగన్‌వాడీల్లో ఇక ఇండక్షన్ స్టవ్‌లతోనే వంట.! Jagan Plan: విట్, ఎస్ఆర్ఎం పేర్లు మార్పించిన జగన్! అసలు కారణం ఇదేనా.... Google Data Center: ప్రపంచంలోనే మొదటిసారిగా... మూడు చోట్ల హైపర్‌స్కేల్ డేటా సెంటర్లు! ఏప్రిల్ 28న ముహూర్తం ఫిక్స్! Amaravati Bill: అమరావతికి కేంద్రం గ్రీన్ సిగ్నల్: ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అధికారిక గెజిట్ విడుదల! Praja Vedika: నేడు (07/04) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! Green Field Highway: ఇక ట్రాఫిక్ టెన్షన్ గుడ్‌బై! హైదరాబాద్–వైజాగ్ కొత్త గ్రీన్‌ఫీల్డ్ హైవే... కేవలం 2 గంటల్లోనే! Amaravati Capital: అమరావతే ఆంధ్రుల రాజధాని... కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ విడుదల! Praja Vedika: అదృశ్యమవుతున్న భూములు.. తెరవెనుక అసలు సూత్రధారులు ఎవరు? గ్రీవెన్స్‌లో వెలుగుచూసిన విస్తుపోయే నిజాలు! రేపు ప్రజా వేదికలో పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! Amrit Bharat Station Scheme: అమృత్ భారత్ పథకంలో పిఠాపురం.. కార్పొరేట్ లుక్‌లో మెరిసిపోనున్న స్టేషన్!

Visakapatnam: రైల్వే చరిత్రలో నూతన అధ్యాయం... విశాఖ డివిజన్‌లోకి ఏడు కీలక స్టేషన్లు!

Visakapatnam: శ్రీకాకుళం జిల్లాలోని పలాస - ఇచ్ఛాపురం సెక్షన్‌ పరిధిలో ఉన్న 7 రైల్వే స్టేషన్లు (పలాస, సుమ్మా దేవి, మందస రోడ్, బారువ, సోంపేట, జాడుపూడి, ఇచ్ఛాపురం) కుర్దా రోడ్ డివిజన్ నుండి విశాఖపట్నం డివిజన్‌కు మారాయి. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు చొరవతో రైల్వే బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది. దీనివల్ల ఈ ప్రాంతంలో రైల్వే సేవలు మెరుగుపడి, పరిపాలన సులభతరం అవుతుంది.

Published : 2026-04-03 08:33:00

శ్రీకాకుళం చిరకాల వాంఛ నెరవేరింది…

విశాఖ డివిజన్‌లోకి పలాస - ఇచ్ఛాపురం సెక్షన్…

కుర్దా రోడ్ నుంచి విశాఖకు 7 రైల్వే స్టేషన్ల బదిలీ…

Visakapatnam: ఉత్తరాంధ్ర రైల్వే ప్రయాణికుల దశాబ్దాల కల ఎట్టకేలకు సాకారమైంది. శ్రీకాకుళం జిల్లాలోని పలాస - ఇచ్ఛాపురం సెక్షన్‌ పరిధిలో ఉన్న ఏడు ప్రధాన రైల్వే స్టేషన్లను ఒడిశాలోని ఖుర్దా రోడ్ డివిజన్ నుండి విశాఖపట్నం డివిజన్‌కు బదిలీ చేస్తూ రైల్వే బోర్డు చారిత్రక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు అధికారిక ఉత్తర్వులు వెలువడటంతో జిల్లా వ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ఈ కీలక పరిణామాన్ని ధృవీకరిస్తూ, ఇది జిల్లా ప్రజల చిరకాల వాంఛ అని పేర్కొన్నారు.

గతంలో ఈ ఏడు స్టేషన్లు ఈస్ట్ కోస్ట్ రైల్వేలోని కుర్దా రోడ్ డివిజన్ పరిధిలో ఉండేవి. దీనివల్ల స్థానిక ప్రయాణికులు, వ్యాపారవేత్తలు అనేక పరిపాలనాపరమైన ఇబ్బందులు ఎదుర్కొనేవారు. ఏదైనా ఫిర్యాదు ఉన్నా లేదా సౌకర్యాల మెరుగుదల కోరాలన్నా పొరుగు రాష్ట్రంలోని అధికారులపై ఆధారపడాల్సి వచ్చేది. ఇప్పుడు ఇవి దక్షిణ కోస్తా రైల్వే జోన్‌లోని విశాఖపట్నం డివిజన్ పరిధిలోకి రావడంతో, స్థానిక సమస్యల పరిష్కారం వేగవంతం కానుంది. అంతేకాకుండా, పరిపాలనా సామర్థ్యం పెరిగి ప్రయాణికులకు మెరుగైన సేవలు అందుతాయని అధికారులు భావిస్తున్నారు.

విశాఖ డివిజన్‌లోకి చేరిన ఆ ఏడు స్టేషన్ల జాబితాలో పలాస, సుమ్మా దేవి, మందస రోడ్, బారువ, సోంపేట, జాడుపూడి మరియు ఇచ్ఛాపురం ఉన్నాయి. ఈ మార్పు వల్ల ఈ ప్రాంతంలోని రైల్వే మౌలిక సదుపాయాల అభివృద్ధికి అధిక నిధులు కేటాయించే అవకాశం ఉంటుంది. అలాగే, స్థానిక రైళ్ల వేళల సర్దుబాటు, కొత్త రైళ్ల నిలుపుదల (హాల్టింగ్) వంటి నిర్ణయాలు తీసుకోవడం విశాఖ అధికారులకు సులభతరం అవుతుంది. ఇది కేవలం భౌగోళిక మార్పు మాత్రమే కాదు, ఈ ప్రాంత ఆర్థికాభివృద్ధికి కూడా దోహదపడనుంది.

ఈ విజయం వెనుక కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు నిరంతర కృషి దాగి ఉంది. 2019లో దక్షిణ కోస్తా రైల్వే జోన్ ప్రకటించినప్పటి నుండి ఆయన ఈ డిమాండ్‌ను కేంద్ర ప్రభుత్వం ముందు ఉంచుతూ వచ్చారు. ఎట్టకేలకు ప్రధాని నరేంద్ర మోదీ మరియు రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ సానుకూలంగా స్పందించి ఈ ఉత్తర్వులు జారీ చేయడం పట్ల రామ్మోహన్ నాయుడు కృతజ్ఞతలు తెలిపారు. ఈ నిర్ణయం వల్ల శ్రీకాకుళం జిల్లాకు రైల్వే పరంగా మరింత ప్రాధాన్యత పెరిగిందని ఆయన అభిప్రాయపడ్డారు.

రైల్వే పరంగానే కాకుండా, జిల్లాకు మరో తీపి కబురుగా వంశధార నదిపై నేరడి బ్యారేజి నిర్మాణానికి అడ్డంకులు తొలిగాయి. ట్రిబ్యునల్ తీర్పునకు అనుగుణంగా కేంద్ర జలశక్తి శాఖ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయడంతో జిల్లా సస్యశ్యామలం కానుంది. అటు రైల్వే స్టేషన్ల బదిలీ, ఇటు సాగునీటి ప్రాజెక్టు గెజిట్ విడుదల వంటి రెండు భారీ విజయాలు ఒకేసారి దక్కడంతో శ్రీకాకుళం జిల్లాలో పండుగ వాతావరణం నెలకొంది. ఈ మార్పులు భవిష్యత్తులో జిల్లా రూపురేఖలను మార్చనున్నాయి.

Spotlight

Read More →