Atchennaidu: 2024లో వైసీపీ రాజకీయాలకు ప్రజలు చరమగీతం పాడారు.. మంత్రి అచ్చెన్నాయుడు ఘాటు వ్యాఖ్యలు! AP Cabinet: ఏపీ మంత్రివర్గం కీలక నిర్ణయం... నూతన పెన్షన్లు, ‘తల్లికి వందనం’కు క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్! Amaravathi: అమరావతిలో అభివృద్ధి పనులు శరవేగంగా.. మంత్రి నారాయణ వెల్లడి! AP Development: ఏపీలో ఆ జిల్లాకు మహర్దశ... రూ.1,230 కోట్లతో జేఎస్డబ్ల్యూ ఐరన్ ఓర్ ప్లాంట్! Nara Lokesh: ప్రపంచంలోనే టాప్ -3 డేటా సెంటర్... లోకేష్ స్పీడ్... 24 గంటల్లో డీల్ ఓకే! AP Government: ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం.... స్వర్ణ గ్రామం - స్వర్ణ వార్డు ఉద్యోగులకు కీలక ఆదేశాలు! Praja Darbar: గత వైసీపీ హయాంలో భూదందాలు పీక్స్.. విజయనగరంలో రూ. 700 కోట్ల అక్రమ లేఅవుట్‌పై మంత్రికి ఫిర్యాదు! Pawan Kalyan: తెలంగాణ ఎవరి జాగీరు కాదు.. అక్కడి రాజకీయాలపై పవన్ కల్యాణ్ పవర్‌ఫుల్ కామెంట్స్! Farmers: తోతపూరి మామిడి రైతులకు ప్రభుత్వం భరోసా.. న్యాయమైన ధర కోసం ప్రత్యేక చర్యలు! Pawan Kalyan: తమ ఇద్దరి మధ్య మంచి సోదర సంబంధం ఉందని వెల్లడి.. కేటీఆర్ గారు ఏమన్నారో.! Atchennaidu: 2024లో వైసీపీ రాజకీయాలకు ప్రజలు చరమగీతం పాడారు.. మంత్రి అచ్చెన్నాయుడు ఘాటు వ్యాఖ్యలు! AP Cabinet: ఏపీ మంత్రివర్గం కీలక నిర్ణయం... నూతన పెన్షన్లు, ‘తల్లికి వందనం’కు క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్! Amaravathi: అమరావతిలో అభివృద్ధి పనులు శరవేగంగా.. మంత్రి నారాయణ వెల్లడి! AP Development: ఏపీలో ఆ జిల్లాకు మహర్దశ... రూ.1,230 కోట్లతో జేఎస్డబ్ల్యూ ఐరన్ ఓర్ ప్లాంట్! Nara Lokesh: ప్రపంచంలోనే టాప్ -3 డేటా సెంటర్... లోకేష్ స్పీడ్... 24 గంటల్లో డీల్ ఓకే! AP Government: ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం.... స్వర్ణ గ్రామం - స్వర్ణ వార్డు ఉద్యోగులకు కీలక ఆదేశాలు! Praja Darbar: గత వైసీపీ హయాంలో భూదందాలు పీక్స్.. విజయనగరంలో రూ. 700 కోట్ల అక్రమ లేఅవుట్‌పై మంత్రికి ఫిర్యాదు! Pawan Kalyan: తెలంగాణ ఎవరి జాగీరు కాదు.. అక్కడి రాజకీయాలపై పవన్ కల్యాణ్ పవర్‌ఫుల్ కామెంట్స్! Farmers: తోతపూరి మామిడి రైతులకు ప్రభుత్వం భరోసా.. న్యాయమైన ధర కోసం ప్రత్యేక చర్యలు! Pawan Kalyan: తమ ఇద్దరి మధ్య మంచి సోదర సంబంధం ఉందని వెల్లడి.. కేటీఆర్ గారు ఏమన్నారో.!

Atchennaidu: 2024లో వైసీపీ రాజకీయాలకు ప్రజలు చరమగీతం పాడారు.. మంత్రి అచ్చెన్నాయుడు ఘాటు వ్యాఖ్యలు!

Atchennaidu: 2024 అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పుతో వైసీపీ ప్రభుత్వ పాలనకు ముగింపు పలికారని, రాష్ట్రాన్ని రాక్షస పాలన నుంచి విముక్తి చేసిన చారిత్రక తీర్పు అదే అని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు.

Published : 2026-06-04 10:56:00

స్వర్ణాంధ్ర దిశగా కూటమి ప్రభుత్వం వేగంగా అడుగులు: అచ్చెన్నాయుడు..

ప్రజల తీర్పుతో వైసీపీ అహంకారానికి ముగింపు.. స్వర్ణాంధ్ర దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు: మంత్రి అచ్చెన్నాయుడు..

అమరావతి: 2024 అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పుతో వైసీపీ ప్రభుత్వ పాలనకు ముగింపు పలికారని, రాష్ట్రాన్ని రాక్షస పాలన నుంచి విముక్తి చేసిన చారిత్రక తీర్పు అదే అని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. ప్రజల తీర్పును గౌరవించకుండా వైసీపీ చేపడుతున్న నిరసనలు ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని ఆయన విమర్శించారు.

మీడియాతో మాట్లాడుతూ అచ్చెన్నాయుడు, గత ఎన్నికల్లో ప్రజలు వైసీపీ రాజకీయాలకు చరమగీతం పాడారని పేర్కొన్నారు. ప్రజల సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధిని పక్కనపెట్టి అధికార అహంకారంతో వ్యవహరించిన నాయకత్వానికి ప్రజలు గట్టి గుణపాఠం చెప్పారని అన్నారు.

జగన్ పాలనలో ప్రజాస్వామ్య వ్యవస్థలకు తీవ్ర నష్టం జరిగిందని ఆరోపించిన మంత్రి, ఆ కాలంలో ప్రజాస్వామ్య విలువలకు తూట్లు పొడిచారని విమర్శించారు. అధికారంలో ఉన్నప్పుడు ప్రజల మధ్యకు రాని నాయకులు ఇప్పుడు ప్రజల గురించి మాట్లాడటం ఆశ్చర్యంగా ఉందన్నారు. పరదాల చాటున పాలన చేసిన రోజులను ప్రజలు ఇప్పటికీ మరచిపోలేదని వ్యాఖ్యానించారు.

రాష్ట్రానికి పెట్టుబడులు, పరిశ్రమలు తీసుకురావాల్సిన సమయంలో అనేక పరిశ్రమలను తరిమివేసి, అభివృద్ధిని దెబ్బతీశారని అచ్చెన్నాయుడు ఆరోపించారు. ఆర్థిక క్రమశిక్షణను విస్మరించి రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టారని అన్నారు. దాని ప్రభావం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై తీవ్రంగా పడిందని పేర్కొన్నారు.

అయితే ప్రజలు 2024 ఎన్నికల్లో ఇచ్చిన స్పష్టమైన తీర్పుతో వైసీపీ అహంకారానికి ముగింపు పలికారని ఆయన అన్నారు. ప్రజల ఆశయాలకు అనుగుణంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని, రాష్ట్ర పునర్నిర్మాణం లక్ష్యంగా ముందుకు సాగుతోందని చెప్పారు.

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తూ "స్వర్ణాంధ్ర-2047" లక్ష్య సాధన దిశగా ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోందని అచ్చెన్నాయుడు తెలిపారు. ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టేలా పారదర్శక పాలన, అభివృద్ధి కార్యక్రమాలకు ప్రాధాన్యం ఇస్తూ ప్రభుత్వం పనిచేస్తోందని ఆయన స్పష్టం చేశారు.

Spotlight

Read More →