టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి "నిజం గెలవాలి" యాత్ర శుక్రవారం నిడదవోలులో కొసాగింది. నిడదవోలు మండలం, కలవచర్ల గ్రామంలో చంద్రబాబు అక్రమ అరెస్టుతో మనస్తాపానికి గురై గుండెపోటుతో మరణించిన టీడీపీ కార్యకర్త మన్నెం శ్రీనివాసరావు కుటుంబాన్ని పరామర్శించారు. నాటి ఘటనను వివరిస్తూ భావోద్వేగానికి గురైన కుటుంబ సభ్యులను టీడీపీ అండగా ఉంటుంది అని ఓదార్చి, రూ.3 లక్షల ఆర్థికసాయం అందించారు.
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
నిడదవోలు నియోజకవర్గం, నిడదవోలు మండలం, తిమ్మరాజుపాలెం గ్రామంలో గుండెపోటుతో మరణించిన టీడీపీ కార్యకర్త కుసుమె వెంకటలక్ష్మి కుటుంబ సభ్యులను పరామర్శించి, రూ.3లక్షల ఆర్థికసాయం అందించి వారికి టీడీపీ అండగా ఉంటుంది అని భరోసా ఇచ్చారు.
తెలుగు ప్రవాసులకు ఉపయోగ పడే వార్తలు, వారికి సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒక చోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి