తిరుమల లడ్డూ కల్తీ కేసులో కీలక మలుపు..! అసలు ఆట ఇప్పుడే మొదలు..! అమరావతికి రెండు దారుల బుల్లెట్ రైళ్లు..! ఏపీకి గేమ్ ఛేంజర్ ప్రాజెక్ట్! Land Survey News: భూవివాదాలకు చెక్.. జస్ట్ స్కాన్ చేస్తే మీ ఆస్తి వివరాలన్నీ ప్రత్యక్షం..!! Sheikh Hasina: రెండు కేసులు, రెండు తీర్పులు.. షేక్ హసీనాకు మొత్తం 10 ఏళ్ల జైలు! Jana Sena Party meeting: ఆ ఒక్క మాటతో అందరిలో వణుకు .. జనసేన ఎమ్మెల్యేలకు పవన్ కళ్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్. ఏపీ సర్కార్ కీలక నిర్ణయం! ఇక వాటి కోసం ఆఫీసుల చుట్టూ తిరగక్కర్లేదు.. ఏపీ మీదుగా సూపర్ కనెక్టివిటీ..! కోల్‌కతా–చెన్నై హైస్పీడ్ గ్రీన్‌ఫీల్డ్ కారిడార్! సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ భేటీ..! రాష్ట్ర భవిష్యత్తుపై కీలక చర్చ! ఏపీలో ఆ రైతులకు బంపర్ ఆఫర్! 18% ఎక్సైజ్ సుంకం రద్దు చేసిన కేంద్రం! నేడు ఢిల్లీకి నారా లోకేష్! ఫుల్ షెడ్యూల్... తిరుమల లడ్డూ కల్తీ కేసులో కీలక మలుపు..! అసలు ఆట ఇప్పుడే మొదలు..! అమరావతికి రెండు దారుల బుల్లెట్ రైళ్లు..! ఏపీకి గేమ్ ఛేంజర్ ప్రాజెక్ట్! Land Survey News: భూవివాదాలకు చెక్.. జస్ట్ స్కాన్ చేస్తే మీ ఆస్తి వివరాలన్నీ ప్రత్యక్షం..!! Sheikh Hasina: రెండు కేసులు, రెండు తీర్పులు.. షేక్ హసీనాకు మొత్తం 10 ఏళ్ల జైలు! Jana Sena Party meeting: ఆ ఒక్క మాటతో అందరిలో వణుకు .. జనసేన ఎమ్మెల్యేలకు పవన్ కళ్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్. ఏపీ సర్కార్ కీలక నిర్ణయం! ఇక వాటి కోసం ఆఫీసుల చుట్టూ తిరగక్కర్లేదు.. ఏపీ మీదుగా సూపర్ కనెక్టివిటీ..! కోల్‌కతా–చెన్నై హైస్పీడ్ గ్రీన్‌ఫీల్డ్ కారిడార్! సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ భేటీ..! రాష్ట్ర భవిష్యత్తుపై కీలక చర్చ! ఏపీలో ఆ రైతులకు బంపర్ ఆఫర్! 18% ఎక్సైజ్ సుంకం రద్దు చేసిన కేంద్రం! నేడు ఢిల్లీకి నారా లోకేష్! ఫుల్ షెడ్యూల్...

Land Survey News: భూవివాదాలకు చెక్.. జస్ట్ స్కాన్ చేస్తే మీ ఆస్తి వివరాలన్నీ ప్రత్యక్షం..!!

ఏపీలో 'నక్ష' భూసర్వే ప్రారంభం. మంగళగిరి-తాడేపల్లిలో పైలట్ ప్రాజెక్టుగా చేపట్టిన ఈ సర్వే ద్వారా ఆస్తుల వివరాలు క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి తెలుసుకోవచ్చు. దీనివల్ల కలిగే ప్రయోజనాలు మరియు పూర్తి వివరాలు

Published : 2026-02-03 14:07:00

మారుతున్న కాలానికి అనుగుణంగా రెవెన్యూ రికార్డులను ఆధునీకరించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. కేంద్ర ప్రభుత్వ 'డిజిటల్ ఇండియా ల్యాండ్ రికార్డ్స్ మోడరైజేషన్ ప్రోగ్రామ్' (DILRMP)లో భాగంగా నక్ష (National Geospatial Knowledge Based Land Survey of Urban Habitation) అనే భూసర్వే ప్రాజెక్టును పైలట్ ప్రాతిపదికన ప్రారంభించారు. ఆస్తుల వివరాలు తెలుసుకోవడం నుంచి రిజిస్ట్రేషన్ల వరకు ఎదురవుతున్న ఇబ్బందులను తొలగించడమే ఈ ప్రాజెక్టు ప్రధాన ఉద్దేశ్యం.

ఈ ప్రతిష్టాత్మక పథకానికి వేదికగా మంగళగిరి-తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్‌ను ప్రభుత్వం ఎంపిక చేసింది. ఈ కార్పొరేషన్ పరిధిలోని సుమారు 91,728 ఇళ్లను సర్వే చేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పటికే ఆంధ్రరత్న కట్ట, కొప్పురావు కాలనీ వంటి ప్రాంతాల్లో సర్వే ప్రక్రియ వేగంగా సాగుతోంది. సర్వేకు ముందుగా ఇళ్ల యజమానులకు నోటీసులు ఇచ్చి, వారి వద్ద ఉన్న డాక్యుమెంట్లు, భూ విస్తీర్ణం వంటి సమాచారాన్ని అధికారులు సేకరిస్తున్నారు.

క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే చాలు.. పూర్తి సమాచారం!

ఈ సర్వే పూర్తయిన తర్వాత ప్రతి ఆస్తికి ఒక యూనిక్ నంబర్ (Unique Number) మరియు క్యూఆర్ కోడ్ (QR Code) కేటాయిస్తారు. భవిష్యత్తులో ఏదైనా స్థలం లేదా ఇంటి గురించి తెలుసుకోవాలంటే సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదు. 

కేవలం ఆ క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేస్తే చాలు..

 ఆస్తి ప్రస్తుత యజమాని ఎవరు?

 స్థలం యొక్క మొత్తం విస్తీర్ణం ఎంత?

 అందులో నిర్మాణం (భవనం) ఎంత మేర ఉంది?

 గతంలో జరిగిన రిజిస్ట్రేషన్ల వివరాలు ఏమిటి?

 అనే అంశాలు డిజిటల్ స్క్రీన్‌పై ప్రత్యక్షమవుతాయి.

నక్ష సర్వే వల్ల భూమి కొనుగోలుదారులకు మోసపోయే అవకాశం ఉండదు. డిజిటల్ రికార్డులు పక్కాగా ఉండటం వల్ల ఆస్తుల ఆక్రమణలు, డబుల్ రిజిస్ట్రేషన్ల వంటి అక్రమాలకు చెక్ పడుతుంది. ప్రభుత్వమే స్వయంగా ఈ జియో-స్పేషియల్ సర్వే నిర్వహిస్తుండటంతో ఆస్తి సరిహద్దుల విషయంలో కూడా స్పష్టత వస్తుంది. పైలట్ ప్రాజెక్ట్ విజయవంతం కాగానే, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మున్సిపాలిటీలు మరియు గ్రామాల్లో ఈ సర్వేను విస్తరించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.

Spotlight

Read More →