AP Sadarem Slots: ఏపీ దివ్యాంగులకు తీపి కబురు సదరం సర్టిఫికెట్ స్లాట్లు ఓపెన్.. ఇలా బుక్ చేసుకోండిలా! Ration Cards: ఏపీలో వారికి ప్రత్యేక గుర్తింపు కార్డులు, సింగిల్ రేషన్ కార్డులు! రాయితీపై సీఎన్‌జీ ఆటోలు పంపిణీ... Amaravathi: సీడ్ యాక్సెస్ రోడ్‌కు రాజమార్గం.. స్టీల్ బ్రిడ్జ్ పనుల్లో భారీ మార్పులు! Kuppam: ఏపీలో ఆ ప్రాంతానికి మహర్దశ... రూ. 7,121 కోట్ల పెట్టుబడులతో 17 పరిశ్రమలు! Prajavedhika: లక్షకు పదివేల ఆశ.. కట్ చేస్తే రూ. 47 లక్షలు మాయం! 16 గజాల కోసం... 14 నెలలుగా పోలీసులకు చిక్కని ఆ 'గోడ' రహస్యం! AndhraPradesh: ఏపీ సరిహద్దుల్లో కట్టుదిట్టమైన నిఘా... ఎందుకంటే! Ayush Centers: ఏపీలో ఆ ప్రాంతాల ప్రజలకు శుభవార్త! రూ.44 కోట్లతో 150 కేంద్రాలు... రెండు నెలల్లో అందుబాటులోకి... YCP: పార్లమెంటులో ఇంట్రెస్టింగ్ సీన్! చేదు జ్ఞాపకాలు వద్దు.. 11వ రూమ్ తాళం వద్దన్న వైసీపీ నేతలు! Jal Jeevan Mission 2.0: 2028 నాటికి ప్రతి ఇంటికీ కుళాయి.. జేజేఎం 2.0పై కేంద్ర, ఏపీ సర్కార్ ఒప్పందం! PMAY Scheme: ఏపీలో పేదల ఇళ్లకు లైన్ క్లియర్.... పీఎంఏవై లబ్ధిదారుల తుది జాబితా! AP Sadarem Slots: ఏపీ దివ్యాంగులకు తీపి కబురు సదరం సర్టిఫికెట్ స్లాట్లు ఓపెన్.. ఇలా బుక్ చేసుకోండిలా! Ration Cards: ఏపీలో వారికి ప్రత్యేక గుర్తింపు కార్డులు, సింగిల్ రేషన్ కార్డులు! రాయితీపై సీఎన్‌జీ ఆటోలు పంపిణీ... Amaravathi: సీడ్ యాక్సెస్ రోడ్‌కు రాజమార్గం.. స్టీల్ బ్రిడ్జ్ పనుల్లో భారీ మార్పులు! Kuppam: ఏపీలో ఆ ప్రాంతానికి మహర్దశ... రూ. 7,121 కోట్ల పెట్టుబడులతో 17 పరిశ్రమలు! Prajavedhika: లక్షకు పదివేల ఆశ.. కట్ చేస్తే రూ. 47 లక్షలు మాయం! 16 గజాల కోసం... 14 నెలలుగా పోలీసులకు చిక్కని ఆ 'గోడ' రహస్యం! AndhraPradesh: ఏపీ సరిహద్దుల్లో కట్టుదిట్టమైన నిఘా... ఎందుకంటే! Ayush Centers: ఏపీలో ఆ ప్రాంతాల ప్రజలకు శుభవార్త! రూ.44 కోట్లతో 150 కేంద్రాలు... రెండు నెలల్లో అందుబాటులోకి... YCP: పార్లమెంటులో ఇంట్రెస్టింగ్ సీన్! చేదు జ్ఞాపకాలు వద్దు.. 11వ రూమ్ తాళం వద్దన్న వైసీపీ నేతలు! Jal Jeevan Mission 2.0: 2028 నాటికి ప్రతి ఇంటికీ కుళాయి.. జేజేఎం 2.0పై కేంద్ర, ఏపీ సర్కార్ ఒప్పందం! PMAY Scheme: ఏపీలో పేదల ఇళ్లకు లైన్ క్లియర్.... పీఎంఏవై లబ్ధిదారుల తుది జాబితా!

Omkareshwara Temple: ఆధ్యాత్మిక శోభ: రూ. 700 కోట్లతో 'ఓంకారేశ్వర' ఆలయం.. శంకుస్థాపన చేయనున్న సీఎం..!!

Manchirevula Temple: తెలంగాణ ప్రభుత్వం మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టులో భాగంగా మంచిరేవుల వద్ద రూ. 700 కోట్లతో భారీ ఓంకారేశ్వర ఆలయాన్ని నిర్మించనుంది. నదిలో 100 అడుగుల ఎత్తైన శివుడి విగ్రహం, పార్కులు బోటింగ్ సౌకర్యాలతో అంతర్జాతీయ స్థాయి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దే ఈ ప్రాజెక్టుకు సీఎం రేవంత్ రెడ్డి మార్చి 28న శంకుస్థాపన చేయనున్నారు.

Published : 2026-03-25 09:46:00

political: శృంగేరి పీఠం సూచనలతో ఆలయ నిర్మాణం

నది మధ్యలో 100 అడుగుల శివయ్య

మత సామరస్యానికి ప్రతీకగా మూసీ తీరం

Musi Riverfront Development: తెలంగాణ గుండెకాయ లాంటి మూసీ నదికి పూర్వ వైభవం తెచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. మూసీ నదిని కేవలం పర్యాటక ప్రాంతంగానే కాకుండా, ఆధ్యాత్మిక కేంద్రంగా  మత సామరస్యానికి వేదికగా మార్చాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించారు. ఇందులో భాగంగా గండిపేట మండలం మంచిరేవుల వద్ద ప్రతిష్టాత్మకమైన 'ఓంకారేశ్వర మందిర' నిర్మాణానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నెల 28వ తేదీన ముఖ్యమంత్రి స్వయంగా ఈ ఆలయ పనులకు శంకుస్థాపన చేయబోతున్నారు.

మంచిరేవులలో ఇప్పటికే 800 ఏళ్ల చరిత్ర కలిగిన వీరభద్రస్వామి ఆలయం, 1400 ఏళ్ల నాటి మచిలేశ్వర ఆలయాలు ఉన్నాయి. వీటికి సమీపంలోనే సుమారు 700 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో కొత్తగా ఓంకారేశ్వర ఆలయాన్ని నిర్మించనున్నారు. ఈ ఆలయ డిజైన్  నిర్మాణ శైలిని కర్ణాటకలోని ప్రముఖ శృంగేరి శారదా పీఠం జగద్గురువుల సూచనల మేరకు ఖరారు చేశారు. 64 అడుగుల ఎత్తుతో గర్భాలయ గోపురం, విశాలమైన మండపాలు, ఎత్తైన గాలి గోపురంతో ఈ క్షేత్రం చూపరులను ఆకట్టుకోనుంది.

ఈ ప్రాజెక్టులో ప్రధాన ఆకర్షణ మూసీ నది మధ్యలో ఏర్పాటు చేయనున్న 100 అడుగుల ఎత్తైన శివుని విగ్రహం. నదిపై ఒక చిన్నపాటి ఆనకట్ట కట్టి నీటిని నిల్వ చేసి, ఆ నీటి మధ్యలో శివుడు కొలువుదీరినట్లుగా ఈ విగ్రహాన్ని ప్రతిష్టించనున్నారు. దీని చుట్టూ అందమైన పార్కులు, బోటింగ్ సౌకర్యాలు కల్పించి అంతర్జాతీయ స్థాయి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. భక్తుల సౌకర్యార్థం ఔటర్ రింగ్ రోడ్డు (ORR) నుంచి ఈ ఆలయానికి నేరుగా విశాలమైన రహదారులను కూడా నిర్మించనున్నారు.

ప్రభుత్వం కేవలం ఆలయాలనే కాకుండా, మూసీ పరివాహక ప్రాంతాన్ని అన్ని మతాల కలయికగా మార్చాలని భావిస్తోంది. దీనికోసం పురానాపూల్ వద్ద భారీ మసీదు, గౌలిగూడలో గురుద్వారా, నాగోల్ ప్రాంతంలో చర్చి నిర్మాణాలను కూడా చేపట్టబోతున్నారు. లండన్‌లోని థేమ్స్ నది తరహాలో మూసీ తీరాన్ని అభివృద్ధి చేయాలన్న లక్ష్యంలో భాగంగా.. తొలిదశ పనులను ఈ ఓంకారేశ్వరాలయ శంకుస్థాపనతోనే ప్రారంభించనున్నారు. 2026-27 బడ్జెట్‌లో ఇందుకోసం ఇప్పటికే రూ. 1500 కోట్లు కేటాయించడం విశేషం.

బాపూఘాట్ వద్ద నిర్మించనున్న గాంధీ సరోవర్, 150 మీటర్ల ఎత్తున్న మహాత్మా గాంధీ విగ్రహంతో పాటు ఈ ఓంకారేశ్వర ఆలయం కూడా తోడైతే, హైదరాబాద్ పర్యాటక రంగం మరో స్థాయికి చేరుతుందని ప్రభుత్వం నమ్ముతోంది. ఈ ప్రాజెక్టు కోసం ప్రభుత్వం నుండి నిధులే కాకుండా, ప్రముఖ దాతలు  ప్రైవేటు సంస్థల భాగస్వామ్యాన్ని కూడా తీసుకోనున్నారు. రాబోయే రోజుల్లో మూసీ ఒడ్డున ఆధ్యాత్మికతతో పాటు ఆహ్లాదకరమైన వాతావరణం భక్తులకు, పర్యాటకులకు అందుబాటులోకి రానుంది.

Spotlight

Read More →