Retirement age: ఏపీలో ఆ ఉద్యోగులకు గుడ్ న్యూస్... 62 ఏళ్లకు రిటైర్మెంట్ వయస్సు పెంపు! AP Government: భూ రిజిస్ట్రేషన్లపై ఏపీ సర్కార్ కీలక స్పష్టత - ఆ భూములకు నో పర్మిషన్! Amaravati Works: అమరావతిలో ముస్తాబైన మంత్రి, ఎమ్మెల్యేల విల్లాలు! 2027 నాటికి... Chandrababu Schedule: నేడు టీడీపీ కేంద్ర కార్యాలయానికి ముఖ్యమంత్రి చంద్రబాబు! ఫుల్ షెడ్యూల్... Chandrababu New House: అమరావతి నడిబొడ్డున చంద్రబాబు కలల సౌధం! త్వరలోనే గృహప్రవేశం! Amaravati RevenueCity: మళ్లీ చిగురిస్తున్న అమరావతి కల... ఏపీని రెవెన్యూ హబ్‌గా మార్చబోతున్న చంద్రబాబు! Prajavedhika: భూ సర్వే జరిగినా సరిహద్దుల లొల్లి... ఇసుక మాఫియా వేధింపులు.. మంత్రి భరోసా!! Pawan Kalyan: అమరావతి నుంచి ఫోన్.. సహచర మంత్రికి అండగా ఉంటామని పవన్ భరోసా.. Minister Savitha: వైసీపీ అంటే హంతకులను తయారుచేసే ఫ్యాక్టరీ.. మంత్రి సవిత సంచలన వ్యాఖ్యలు! Chandrababu: ఏపీ ఇక గ్రీన్ ఎనర్జీ హబ్.. రూ. 5.95 లక్షల కోట్ల పెట్టుబడులే లక్ష్యం.. అభివృద్ధిపై సీఎం దార్శనికత.. Retirement age: ఏపీలో ఆ ఉద్యోగులకు గుడ్ న్యూస్... 62 ఏళ్లకు రిటైర్మెంట్ వయస్సు పెంపు! AP Government: భూ రిజిస్ట్రేషన్లపై ఏపీ సర్కార్ కీలక స్పష్టత - ఆ భూములకు నో పర్మిషన్! Amaravati Works: అమరావతిలో ముస్తాబైన మంత్రి, ఎమ్మెల్యేల విల్లాలు! 2027 నాటికి... Chandrababu Schedule: నేడు టీడీపీ కేంద్ర కార్యాలయానికి ముఖ్యమంత్రి చంద్రబాబు! ఫుల్ షెడ్యూల్... Chandrababu New House: అమరావతి నడిబొడ్డున చంద్రబాబు కలల సౌధం! త్వరలోనే గృహప్రవేశం! Amaravati RevenueCity: మళ్లీ చిగురిస్తున్న అమరావతి కల... ఏపీని రెవెన్యూ హబ్‌గా మార్చబోతున్న చంద్రబాబు! Prajavedhika: భూ సర్వే జరిగినా సరిహద్దుల లొల్లి... ఇసుక మాఫియా వేధింపులు.. మంత్రి భరోసా!! Pawan Kalyan: అమరావతి నుంచి ఫోన్.. సహచర మంత్రికి అండగా ఉంటామని పవన్ భరోసా.. Minister Savitha: వైసీపీ అంటే హంతకులను తయారుచేసే ఫ్యాక్టరీ.. మంత్రి సవిత సంచలన వ్యాఖ్యలు! Chandrababu: ఏపీ ఇక గ్రీన్ ఎనర్జీ హబ్.. రూ. 5.95 లక్షల కోట్ల పెట్టుబడులే లక్ష్యం.. అభివృద్ధిపై సీఎం దార్శనికత..

Gummadi Sandhya Rani: ఉత్తరాంధ్ర అభివృద్ధిపై మంత్రి సంధ్యారాణి వ్యాఖ్యలు! వైసీపీపై తీవ్ర విమర్శలు!

Gummadi Sandhya Rani: ఉత్తరాంధ్ర ప్రాంత అభివృద్ధిపై కూటమి ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని మంత్రి సంధ్యారాణి తెలిపారు. ఈ సందర్భంగా ఆమె ప్రతిపక్ష వైసీపీపై తీవ్ర విమర్శలు గుప్పించారు.

Published : 2026-04-24 10:12:00

అమ్మ, అమరావతి, ఆంధ్రప్రదేశ్ ఇష్టం లేనివారిని పట్టించుకోము..

సొంత చెల్లి బయటపెడుతున్న విషయాలకు ధైర్యం ఉంటే సమాధానం చెప్పాలి..

ఉత్తరాంధ్ర ప్రాంత అభివృద్ధిపై కూటమి ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని మంత్రి సంధ్యారాణి తెలిపారు. ఈ సందర్భంగా ఆమె ప్రతిపక్ష వైసీపీపై తీవ్ర విమర్శలు గుప్పించారు.

“అమ్మ, అమరావతి, ఆంధ్రప్రదేశ్ ఇష్టం లేని వారిని పట్టించుకోము” అంటూ స్పష్టం చేసిన మంత్రి, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాజకీయాలపై విమర్శించారు. “జగన్ రాజకీయాలు చేయాలనుకుంటే ముందు తన ఇంటిని చక్కబెట్టుకోవాలి. సొంత చెల్లి బయటపెడుతున్న విషయాలకు ధైర్యం ఉంటే సమాధానం చెప్పాలి” అని అన్నారు.

ఉత్తరాంధ్రలో జరుగుతున్న అభివృద్ధిని చూసి వైసీపీ నాయకులు ఓర్వలేకపోతున్నారని ఆమె పేర్కొన్నారు. “వారికి ఒక్క అవకాశం దొరికితే కబ్జాలు చేసి, ప్రజల ఆస్తులను లాక్కొని ఎవరూ బతకలేని పరిస్థితి తీసుకొచ్చారు. విశాఖ వాసుల మంచితనాన్ని దౌర్జన్యంగా దోచుకున్నారు” అని తీవ్రంగా ఆరోపించారు.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కీలకమైన నిర్ణయాలు తీసుకున్నామని మంత్రి వివరించారు. “విశాఖ స్టీల్ ప్లాంట్‌ను తిరిగి ప్రారంభించాం. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ కృషితో ప్రపంచ ప్రఖ్యాత గూగుల్ సంస్థ రాష్ట్రానికి వచ్చింది” అని చెప్పారు.

ఇంకా ఆర్సిలర్ మిట్టల్ సహా పలు పెద్ద సంస్థలు ఉత్తరాంధ్రలో పెట్టుబడులకు ఆసక్తి చూపుతున్నాయని, ఈ ప్రాంతం త్వరలోనే పారిశ్రామికంగా మరింత అభివృద్ధి చెందుతుందని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని, ప్రజల సహకారంతో మరింత పురోగతి సాధిస్తామని మంత్రి సంధ్యారాణి తెలిపారు.

Spotlight

Read More →