పాపులేషన్ మేనేజ్మెంట్పై చేపట్టాల్సిన చర్యలపై చర్చ..
జిల్లాల వారీగా ఫెర్టిలిటీ రేట్ వివరాలను వివరించిన అధికారులు..
అమరావతిలో రాష్ట్ర జనాభా నిర్వహణ (పాపులేషన్ మేనేజ్మెంట్) విధానంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో జనాభా నియంత్రణ, భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా చేపట్టాల్సిన చర్యలపై విస్తృతంగా చర్చ జరిగింది.
సమీక్షలో అధికారులు జిల్లాల వారీగా టోటల్ ఫెర్టిలిటీ రేట్ వివరాలను సీఎంకు వివరించారు. రాష్ట్రంలో అత్యధిక ఫెర్టిలిటీ రేట్ కడప జిల్లాలో 1.99గా ఉండగా, అత్యల్పంగా విశాఖపట్నంలో 1.32గా నమోదైనట్లు తెలిపారు. మొత్తం రాష్ట్ర సగటు ఫెర్టిలిటీ రేట్ ప్రస్తుతం 1.5గా ఉందని వెల్లడించారు.
ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ, రాష్ట్ర అభివృద్ధి దృష్ట్యా ఈ రేటును 2.1 వరకు పెంచాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఇందుకోసం సమగ్ర కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసి అమలు చేయాలని అధికారులను ఆదేశించారు.
ఈ సమీక్ష సమావేశానికి వైద్యారోగ్య శాఖ, ఆర్థిక శాఖ, స్వర్ణవార్డు గ్రామ శాఖ, కార్మిక శాఖ, మహిళా శిశు సంక్షేమ శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు. రాష్ట్ర భవిష్యత్ జనాభా సమతుల్యతను దృష్టిలో పెట్టుకుని తీసుకునే నిర్ణయాలు కీలకమని అధికారులు అభిప్రాయపడ్డారు. జనాభా నిర్వహణపై ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు రాష్ట్ర అభివృద్ధికి దోహదం చేయనున్నాయని భావిస్తున్నారు.