ఖతార్ ఎన్ఆర్ఐ టీడీపీ నాయకులు ఈ వేడుకను విజయవంతం చేయడంలో కీలక పాత్ర పోషించారు. ఉపాధ్యక్షుడు మద్దిపోటీ నరేష్ నాయకత్వంలో, జనరల్ సెక్రటరీ రవి పొనుగుమాటి సమన్వయంతో కార్యక్రమం క్రమశిక్షణతో సాగింది. కోశాధికారి విక్రమ్ సుఖవాసి, సోషల్ మీడియా ఇంచార్జి గోవర్ధన్ రెడ్డి మరియు జీసీసీ కౌన్సిల్ మెంబర్ మల్లిరెడ్డి సత్యనారాయణ తదితర సీనియర్ నాయకులు తమ వంతు సహకారాన్ని అందించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కేక్ను నాయకులు మరియు కార్యకర్తలు కలిసి కట్ చేసి, ఒకరికొకరు స్వీట్లు తినిపించుకుంటూ సంతోషాన్ని పంచుకున్నారు.
సమావేశంలో ప్రసంగించిన నాయకులు చంద్రబాబు నాయుడు గారి అభివృద్ధి విజన్ మరియు వారు చేపట్టిన ప్రజా సేవా కార్యక్రమాలను గుర్తు చేసుకున్నారు. "లాంగ్ లివ్ బాబు గారు" అనే నినాదాలతో ప్రాంగణం మారుమోగింది. ప్రవాసాంధ్రులు ఎక్కడ ఉన్నా, రాష్ట్ర అభివృద్ధి కోసం చంద్రబాబు గారు తీసుకునే ప్రతి నిర్ణయానికి మరియు చేపట్టే ప్రతి కార్యక్రమానికి తమ పూర్తి మద్దతు ఉంటుందని వారు ప్రకటించారు. ఎన్ఆర్ఐల సంక్షేమం కోసం చంద్రబాబు నాయుడు గారు ఎల్లప్పుడూ కృషి చేస్తారని, ఆయన నాయకత్వం రాష్ట్రానికి ఎంతో అవసరమని ఈ సందర్భంగా నాయకులు పేర్కొన్నారు.