బెంగళూరు: కర్ణాటక మాజీ మంత్రి, కల్యాణ రాజ్య ప్రగతి పక్ష పార్టీ వ్యవస్థాపకుడు గాలి జనార్దనరెడ్డి బీజేపీ గూటికి చేరారు. బెంగళూరులో సోమవారం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు విజయేంద్ర, సీనియర్ నేత బీఎస్ యడియూరప్ప సమక్షంలో జనార్దనరెడ్డి, ఆయన సతీమణి అరుణ లక్ష్మి కాషాయ కండువా వేసుకున్నారు. తన పార్టీని కూడా భాజపాలో విలీనం చేశారు.
మరిన్ని పొలిటికల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ప్రధాని మోదీని మూడోసారి అధికారంలో నిలబెట్టేందుకు బీజేపీ కార్యకర్తగా పనిచేస్తా. ఎలాంటి షరతులు లేకుండా నేను పార్టీలో చేరా. నాకు ఏ పదవులూ వద్దు... అని అన్నారు. గాలి జనార్దనరెడ్డి చేరికను యడియూరప్ప స్వాగతించారు. ఇది మంచి నిర్ణయమని, వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ కర్ణాటకలోని 28 స్థానాల్లో విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అయితే, లోక్సభ ఎన్నికల్లో గాలికి టికెట్ దక్కే అవకాశాలు లేవు. బీజేపీ అభ్యర్థిగా బరిలో దిగిన తన స్నేహితుడు బి. శ్రీరాములుకు మద్దతుగా ఆయన ప్రచారం చేయనున్నట్లు తెలుస్తోంది.
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
ఇవి కూడా చదవండి:
తెలుగుదేశం పార్టీతో మాదిగలది శాశ్వత బంధం!! చంద్రబాబుతో మందకృష్ణ మాదిగ, ఎంఆర్పిఎస్ నేతలు భేటీ!!
ఈనెల 27 నుంచి 31 వరకు చంద్రబాబు పర్యటన ఖరారు!! రేపు, ఎల్లుండి సొంత నియోజకవర్గం..
18 అసెంబ్లీ స్థానాల జనసేన అభ్యర్థుల ప్రకటన!! నియోజకవర్గల అభ్యర్థులు వీరే!!
బిజెపి ఆంధ్ర తో సహా 111 అభ్యర్థుల ప్రకటన!! RRR కు మొండి చెయ్యి!
కమ్మ నేతల ఒత్తిడితోనే కార్పొరేషన్ ఏర్పాటు! నేడు ముఖ్యమంత్రిని కలిసి కృతజ్ఞతలు!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి