Krishna District Jagananna Colonies: ప్రకృతిని తుడిచిపెట్టారు.. ప్రభుత్వ ఖజానాను ఖాళీ చేశారు.. బయటపడ్డ 'మడ' కుంభకోణం! Chandrababu Naidu: శ్రీకాకుళం–విజయనగరం–విశాఖకు మెగా ప్రాజెక్ట్..! సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం! Irrigation Projects 2026: సీమకు జగన్ చేసిన అన్యాయం అంతా ఇంతా కాదు.. మంత్రి నిమ్మల ఘాటు విమర్శలు! New Pensions: పెన్షన్ దారులకు గుడ్ న్యూస్! కొత్త పెన్షన్ల దరఖాస్తులకు రంగం సిద్ధం! Fee Reimbursement: రమ్మంటే పారిపోతారా? వైసీపీ వాకౌట్‌పై మంత్రి లోకేష్ ఫైర్! Horticultural Hub: ఏపీలో ఆ ప్రాంతానికి మహర్దశ... రూ. 1 లక్ష కోట్లతో ఉద్యానవన హబ్‌! Budget meetings: ఏప్రిల్ 1 నుంచి ఉచిత విద్యుత్.. ఏపీలో చేనేత రంగం సరికొత్త ప్రస్థానం! Ambati dialogue viral: అంబటి సైగలు చూసి అల్లు అర్జున్ కూడా సిగ్గుపడాలి.. టీడీపీ ఎమ్మెల్సీ నేత ఫైర్.! Trump–Modi: మోదీపై ట్రంప్ కామెంట్స్..! విదేశాంగ శాఖ స్పందనతో కొత్త మలుపు! Telangana Municipal Election: నల్గొండలో కాంగ్రెస్ క్లీన్ స్వీప్.. గడ్డిపోతారంలో గులాబీ జెండా రెపరెపలు! Krishna District Jagananna Colonies: ప్రకృతిని తుడిచిపెట్టారు.. ప్రభుత్వ ఖజానాను ఖాళీ చేశారు.. బయటపడ్డ 'మడ' కుంభకోణం! Chandrababu Naidu: శ్రీకాకుళం–విజయనగరం–విశాఖకు మెగా ప్రాజెక్ట్..! సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం! Irrigation Projects 2026: సీమకు జగన్ చేసిన అన్యాయం అంతా ఇంతా కాదు.. మంత్రి నిమ్మల ఘాటు విమర్శలు! New Pensions: పెన్షన్ దారులకు గుడ్ న్యూస్! కొత్త పెన్షన్ల దరఖాస్తులకు రంగం సిద్ధం! Fee Reimbursement: రమ్మంటే పారిపోతారా? వైసీపీ వాకౌట్‌పై మంత్రి లోకేష్ ఫైర్! Horticultural Hub: ఏపీలో ఆ ప్రాంతానికి మహర్దశ... రూ. 1 లక్ష కోట్లతో ఉద్యానవన హబ్‌! Budget meetings: ఏప్రిల్ 1 నుంచి ఉచిత విద్యుత్.. ఏపీలో చేనేత రంగం సరికొత్త ప్రస్థానం! Ambati dialogue viral: అంబటి సైగలు చూసి అల్లు అర్జున్ కూడా సిగ్గుపడాలి.. టీడీపీ ఎమ్మెల్సీ నేత ఫైర్.! Trump–Modi: మోదీపై ట్రంప్ కామెంట్స్..! విదేశాంగ శాఖ స్పందనతో కొత్త మలుపు! Telangana Municipal Election: నల్గొండలో కాంగ్రెస్ క్లీన్ స్వీప్.. గడ్డిపోతారంలో గులాబీ జెండా రెపరెపలు!

Bangladesh Elections: బంగ్లాదేశ్ ఎన్నికల్లో సంచలనం..! జిహాదీ శక్తులకు చెక్, బిఎన్పీకి ఘన విజయం!

Bangladesh Elections: బంగ్లాదేశ్ లో జరిగిన జాతీయ ఎన్నికల్లో సంచలన ఫలితాలు వెలువడ్డాయి. Bangladesh Nationalist Party ఘన విజయం సాధించి అధికారంలోకి రానుంది. మత రాజకీయాలకు చెక్ పడగా, ప్రజాస్వామ్యబద్ధ పాలనకు ప్రజలు మద్దతు ఇచ్చినట్లు ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి. Jamaat-e-Islami Bangladesh మరియు ఇతర శక్తులకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కొత్త ప్రభుత్వం ఏర్పాటుతో దేశ రాజకీయాల్లో కొత్త అధ్యాయం ప్రారంభమవుతోంది.

Published : 2026-02-13 16:39:00

ప్రజాస్వామ్యానికి పట్టం కట్టిన బంగ్లాదేశ్ ఓటర్లు…

212+ సీట్లు బిఎన్పీ ఖాతాలో.. కొత్త ప్రభుత్వం దిశగా బంగ్లాదేశ్…

బంగ్లాదేశ్ రాజకీయాల్లో మెగా ట్విస్ట్.. బిఎన్పీ అధికారంలోకి…

బంగ్లాదేశ్‌లో ఇటీవల జరిగిన జాతీయ ఎన్నికల ఫలితాలు ఆ దేశ రాజకీయాల్లో పెద్ద మార్పును తీసుకొచ్చాయి. గతంలో షేక్ హసీనా ప్రభుత్వంపై తిరుగుబాటు చేసి ఆమెను దేశం విడిచి వెళ్లేలా చేసిన ఉద్రిక్త పరిస్థితుల తర్వాత ఈ ఎన్నికలు జరిగాయి. ఈ ఫలితాలు ప్రజలు అరాచకత్వాన్ని, మతోన్మాదాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నారని స్పష్టం చేశాయి. ఎన్నికల ఫలితాలను గమనిస్తే, అక్కడ ప్రజాస్వామ్యాన్ని నమ్మే శక్తులకు ప్రజలు పట్టం కట్టినట్లు కనిపిస్తోంది.

నిరసనల్లో కీలక పాత్ర పోషించి, తామే దేశాన్ని నడిపిస్తామని చెప్పుకున్న జన్-జీ (Gen Z) విద్యార్థులు ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయారు. మొత్తం 300 సీట్లలో వీరు కేవలం రెండు స్థానాల్లో మాత్రమే విజయం సాధించారు. రోడ్ల మీద గొడవలు చేయడం వేరు, దేశాన్ని పాలించడం వేరని అక్కడి ప్రజలు తమ ఓటు ద్వారా వీరికి ఒక పాఠం చెప్పారు. ప్రజలు వీరిని అల్లరి చిల్లరగా చూశారు తప్పితే, పరిపాలనకు సరిపోయే వ్యక్తులుగా భావించలేదు.

మతం పేరుతో రాజకీయం చేయాలని చూసిన జమాతే ఇస్లామీ పార్టీని కూడా ప్రజలు తిరస్కరించారు. ఈ పార్టీ బంగ్లాదేశ్‌ను మరో పాకిస్తాన్‌లా మార్చాలని, మతోన్మాదాన్ని పెంచాలని చూసింది. అయితే 299 స్థానాలకు జరిగిన పోటీలో వీరికి కేవలం 70 సీట్లు మాత్రమే దక్కాయి. హిందువులపై దాడులు చేయడం, తాలిబన్ తరహా పాలన తీసుకురావాలనుకున్న వారి పద్ధతులను ప్రజలు అంగీకరించలేదు. ఈ పార్టీ గతంలో పాకిస్తాన్ సైన్యానికి సహకరించి, స్వాతంత్ర సమరయోధులపై దాడులు చేసిన చరిత్ర కలిగి ఉండటం కూడా ఒక కారణం.

ఎన్నికల్లో బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (BNP) ఘనవిజయం సాధించి అధికారంలోకి రాబోతోంది. తారిక్ రహ్మాన్ నాయకత్వంలోని ఈ పార్టీ దాదాపు 212 నుండి 220 స్థానాల్లో ఆధిక్యాన్ని సాధించింది. ప్రజలు జిహాదీ ఉన్మాదాన్ని కాకుండా ప్రజాస్వామ్యబద్ధమైన పాలనను కోరుకుంటూ బిఎన్పీకి పట్టం కట్టారు. షేక్ హసీనా పార్టీ అయిన అవామీ లీగ్‌కు చెందిన సగం మంది ఓటర్లు కూడా ఈసారి జమాతే ఇస్లామీని ఓడించడం కోసం బిఎన్పీకి ఓటు వేయడం గమనార్హం.

కొత్త ప్రభుత్వం ఏర్పడుతున్న తరుణంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ బిఎన్పీకి అభినందనలు తెలిపారు. బంగ్లాదేశ్ అభివృద్ధి చెందాలన్నా, అక్కడి ప్రజలకు కరెంటు, నీరు వంటి కనీస సదుపాయాలు అందాలన్నా భారతదేశంతో స్నేహం చాలా అవసరమని కొత్త ప్రభుత్వం గుర్తించింది. మతోన్మాద శక్తులను పక్కన పెట్టి ప్రజాస్వామ్యాన్ని ఎంచుకోవడం ఆ దేశ భవిష్యత్తుకు ఒక శుభ సంకేతం అని చెప్పవచ్చు.
 

Spotlight

Read More →