గద్వాల్ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. జగన్ ట్రావెల్స్కు చెందిన ఓ బస్సు ప్రయాణికులతో వెళ్తూ బోల్తా పడింది. బీచుపల్లి పదో బెటాలియన్ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. వేకువజాము మూడు గంటల ప్రాంతంలో యాక్సిడెంట్ అయింది.
ప్రయాణికులు అప్రమత్తం అవ్వడంతో పెను ముప్పు తప్పిందని చెబుతున్నారు. ప్రమాదంలో బస్సు బోల్తా పడిన వెంటనే మంటల్లో చెలరేగాయి. ప్రయాణికులు స్పందించి త్వరగా బయటపడ్డారు. అయితే ఒక మహిళ మాత్రం ఈ దుర్ఘటనలో మృతి చెందారు. మరో ఐదుగురికి గాయాలు అయ్యాయి. వారిని కర్నూలు ఆసుపత్రికి తరలించారు.
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
ప్రమాదం జరిగిన టైంలో బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ బస్సు హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్తోంది. బస్సు ప్రమాదానికి గురి కావడంతో ప్రయాణికులను ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి గమన్య స్థానాలకు చేర్చారు.
తెలుగు ప్రవాసులకు ఉపయోగ పడే వార్తలు, వారికి సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒక చోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి