వైకాపా ప్రభుత్వ హయాంలో టిడ్కో ఇళ్లలో జరిగిన అవకతవకలపై రాష్ట్ర ప్రభుత్వం విచారణ కమిటీని నియమించింది. ముగ్గురు ఉన్నతాధికారులతో కూడిన కమిటీని నియమించి 2019-24 మధ్య టిడ్కో ఇళ్ల లబ్దిదారుల జాబితా మార్చివేత ఆరోపణలపై విచారణ చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. 2017-19లో ఎంపిక చేసిన లబ్దిదారులను మార్చేసి 2019-24లో కొత్తవారిని జాబితాలో చేర్చటంపై తీవ్ర ఆరోపణలు వచ్చాయి. దీంతో పాటు ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ కింద లబ్దిదారుల డీడీలను బ్యాంకుల్లో సమర్పించకపోవటంపై కూడా విచారణ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. 2019-24లో టిడ్కో ఇళ్ల వ్యవహారంలో జరిగిన అవకతవకలపై విచారణ చేయిస్తామని పురపాలక శాఖ మంత్రి నారాయణ అసెంబ్లీలోనూ ప్రకటన చేశారు. ఈనేపథ్యంలోనే ప్రభుత్వం పురపాలక పట్టణాభివృద్ధిశాఖ డైరెక్టర్, మెప్మా మిషన్ డైరెక్టర్, ఏపీ టిడ్కో ఎండీల ఆధ్వర్యంలో విచారణ కమిటీ ఏర్పాటు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. నెలరోజుల్లోగా ఈ వ్యవహారాలపై నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం కమిటీని ఆదేశించింది.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం.. వారికి సంక్షేమ పథకాలు రద్దు! 10 మందితో ఈగల్ కమిటీలు ఏర్పాటు!
వైసీపీకి వరుస ఎదురుదెబ్బలు.. వారంతా జైలుకు వెళ్లడం ఖాయం - గుట్టును రట్టు చేసిన RRR!
ఈ నెల 30 నుంచి '6 అబద్ధాలు 66 మోసాలు' పేరుతో బీజేపీ నిరసన! కాంగ్రెస్ ప్రజాపాలన విజయోత్సవాలకు!
గుడ్ న్యూస్: 30 శాతం సబ్సిడీతో మహిళకు రూ. 5 లక్షలు! నెలకు ఎంత కట్టాలంటే? అసలు విషయం ఇదే!
శుభవార్త చెప్పిన చంద్రబాబు.. 10,000 మందికి ఉద్యోగాలు! ఆ జిల్లాలో ఇండస్ట్రియల్ హబ్ ఏర్పాటు!
ఏపీలో ఖాళీగా ఉన్న మూడు రాజ్యసభ సీట్లకు నోటిఫికేషన్ జారీ! ఎప్పటినుంచి అంటే!
కేంద్ర మంత్రి గజేంద్ర షెకావత్తో పవన్ కల్యాణ్ భేటీ! పర్యాటక ప్రాజెక్టులు, వర్సిటీపై కీలక చర్చలు!
శుభవార్త చెప్పేసిన సీఎం.. ఇక రాష్ట్రంలో అందరికీ ఉచిత విద్యుత్! 100 శాతం సౌర విద్యుత్ వినియోగం!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: