వైకాపా నాయకులు అటవీ ప్రాంతంలో ఉన్న ఆలయంలో కార్తిక పౌర్ణమి నాడు గుట్టుగా క్షుద్ర పూజలు చేస్తున్న ఉదంతాన్ని పోలీసులు బయటపెట్టారు. ఈ ఘటన అన్నమయ్య జిల్లా బి.కొత్తకోట మండలంలో శుక్రవారం అర్ధరాత్రి జరిగింది. డీఎస్పీ కొండయ్యనాయుడి కథనం మేరకు.. మదనపల్లెకు చెందిన వైకాపా నాయకుడు డాక్టర్ ఏవీ సుబ్బారెడ్డి, కదిరికి చెందిన వైకాపా నాయకుడు వజ్రభాస్కర్రెడ్డి బి. కొత్తకోట మండలంలోని బయప్పగారిపల్లె పంచాయతీ పప్పిరెడ్డిపల్లె సమీపంలోని విరుద నారాయణి ఆలయంలో అర్ధరాత్రి పూజలు చేస్తుండగా స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు అక్కడికి చేరుకుని క్షుద్రపూజలు చేస్తున్నట్లు గుర్తించి వారిని అదుపులోకి తీసుకుని విచారించగా తాము కార్తిక పౌర్ణమి పూజలు చేస్తున్నామని బుకాయించారు. గుప్త నిధులు తవ్వేందుకు ఈ పూజలు చేస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తూ వారిని స్టేషన్కు తీసుకొచ్చి కేసు నమోదుచేశారు. వారికి నోటీసు ఇచ్చి పంపినట్లు డీఎస్పీ తెలిపారు. వైకాపా నాయకుడు డాక్టర్ ఏవీ సుబ్బారెడ్డి ఏపీ మెడికల్ కౌన్సిల్ సభ్యుడిగా, ఆంధ్రప్రదేశ్ ప్రైవేటు ఆసుపత్రులు, నర్సింగ్హామ్స్ అసోసియేషన్ (ఏపీఎన్ఏ) రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నారు. శ్రీసత్యసాయి జిల్లా కదిరికి చెందిన వజ్రభాస్కర్రెడ్డి గతంలో భాజపా జిల్లా అధ్యక్షుడిగా పనిచేశారు. ప్రస్తుతం వైకాపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
వైసీపీకి మరో షాక్! మాజీ మంత్రి సహచరుడు పై కేసు నమోదు! లైవ్ లో చూస్తూ వైసీపీ నేత పైశాచికానందం!
భారీ శుభవార్త.. ఏపీలో కొత్త పెన్షన్లు జారీ.. దరఖాస్తు తేదీ ఇదే! అస్సలు మిస్ అవకండి!
ప్రధాని మోదీ ప్రయాణించాల్సిన విమానంలో సాంకేతిక లోపం! ఏమి జరిగింది అంటే!
"ప్రజా వేదిక" కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రులు మరియు నాయకుల షెడ్యూల్! ఎవరో తెలుసా?
నామినేటెడ్ పోస్టుల 5వ లిస్ట్ విడుదల! మరో నాలుగు కార్పొరేషన్లకు... పూర్తి వివరాలు!
ప్రధాని మోదీతో చంద్రబాబు కీలక మంత్రాంగం - ఆహ్వానం! ఎందుకు? ఎప్పుడు అంటే?
నటి శ్రీరెడ్డి రాసిన లేఖకు వెన్నపూసలా కరిగిపోయిన లోకేష్! ఆమెకు బంపర్ ఆఫర్!
గుడ్ న్యూస్ చెప్పిన చంద్రబాబు - కేబినెట్ భేటీ! మహిళలకు ఫ్రీ బస్, రైతుల ఖాతాల్లో రూ 20 వేలు!
వైసీపీకి భారీ షాక్.. టీడీపీలో చేరిన వైసీపీ మాజీ కీలక నేత! 50 మంది వరకు వైసీపీ నేతలు టీడీపీలో!
"ప్రజా వేదిక" కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రులు మరియు నాయకుల షెడ్యూల్! ఎవరు అంటే!
ఏపీ ప్రజలకు మరో గుడ్ న్యూస్! ఆడబిడ్డ నిధి పథకం.. నెల నెలా మహిళల అకౌంట్లో రూ.1,500!
మందుబాబులకు కిక్కే కిక్కు.. మరో కొత్త రకం మందు వచ్చేసింది! అతి తక్కువ ధరకే!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: