ఏపీలో తూర్పుగోదావరి-పశ్చిమ గోదావరి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానంలో ఉప ఎన్నికకు రంగం సిద్ధమైంది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం (ECI) సోమవారం మధ్యాహ్నం షెడ్యూల్ విడుదల చేసింది. తూర్పుగోదావరి- పశ్చిమ గోదావరి ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా ఉన్న షేక్ సాబ్లీ రోడ్డు ప్రమాదంలో మరణించడంతో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. దీంతో ఇక్కడ ఉప ఎన్నిక కోసం ఈ నెల 11న నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు ఈసీ తెలిపింది. నవంబర్ 18వరకు నామినేషన్లు స్వీకరించి.. 19న నామినేషన్లను పరిశీలన చేపడతారు. నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువు నవంబర్ 21గా పేర్కొన్నారు. డిసెంబర్ 5 (గురువారం) న ఉదయం 8గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు పోలింగ్ నిర్వహించి.. డిసెంబర్ 9న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు ప్రకటించనున్నట్లు ప్రకటనలో తెలిపారు. గతంలో తూర్పుగోదావరి- పశ్చిమ గోదావరి ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి పీడీఎఫ్ తరఫున గెలిచిన యూటీఎఫ్ నేత షేక్ సాబ్లీ గతేడాది డిసెంబర్ 15న రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన విషయం తెలిసిందే. ఆయన పదవీ కాలం 2027 మార్చి 29 వరకు ఉండటంతో ఇక్కడ ఉప ఎన్నిక నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. మూడు రాష్ట్రాల్లో 14 అసెంబ్లీ సీట్లకు ఉప ఎన్నిక తేదీ మార్పు దేశంలోని మూడు రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న 14 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉప ఎన్నికల పోలింగ్ తేదీ మారింది.
ఇంకా చదవండి: ఆమెకు ఆ అరబి కుటుంబం దేవుడుతో సమానం! పొగడ్తల తో ముంచేత్తుతున్న తెలుగు ఆడ పడుచు! ఇంతకీ ఆమెకు ఏమి జరిగిందంటే! 14
ఇటీవల ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం.. దేశ వ్యాప్తంగా 15 రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న 48 అసెంబ్లీ, రెండు లోక్సభ స్థానాలకు ఉప ఎన్నికకు గత నెలలో షెడ్యూల్ విడుదల చేసిన విషయం తెలిసిందే. దీని ప్రకారం కేరళ, పంజాబ్, యూపీలలో 14 అసెంబ్లీ సీట్లలో నవంబర్ 13న ఉప ఎన్నిక జరగాల్సి ఉంది. కానీ, భాజపా, కాంగ్రెస్, బీఎస్పీ, ఆర్ఎల్డీతో పాటు పలు సామాజిక సంస్థలు పోలింగ్ తేదీని మార్చాలని ఈసీకి విజ్ఞప్తి చేశాయి. పలు సామాజిక, సాంస్కృతిక, మత సంబంధమైన కార్యక్రమాలు ఉన్నందున ఓటర్ల భాగస్వామ్యం తగ్గే అవకాశం ఉందంటూ ఆయా పార్టీలు చేసిన సూచనను పరిగణనలోకి తీసుకున్న కేంద్ర ఎన్నికల సంఘం కేరళ, పంజాబ్, ఉత్తరప్రదేశ్ పరిధిలో 14 అసెంబ్లీ సీట్లలో పోలింగ్ తేదీని నవంబర్ 20కి మార్పు చేసింది. కేరళలో ఒకటి, పంజాబ్లో 4, యూపీలో 9 నియోజకవర్గాల్లో నవంబర్ 20న పోలింగ్ జరగనుండగా.. మిగతా స్థానాల్లో మాత్రం తొలుత ప్రకటించిన షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయని ఈసీ పేర్కొంది.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
కొత్త సంవత్సరం నుంచి ఈ రేషన్ కార్డులు చెల్లవు! వెంటనే ఇలా చేయండి - వారి కార్డులు రద్దు!
అన్నీ శుభవార్తలే... ఏపీకి అదృష్టంగా మారిన కేంద్రమంత్రి! ఆ జిల్లాల్లో పెరగనున్న స్థలాల రేట్లు!
ఆ మహిళ చేసిన పనికి బిత్తర పోయిన చంద్రబాబు! మరీ అంత దారుణంగానా!
రాష్ట్రంలో బెల్ట్ షాపులు.. సీఎం చంద్రబాబు సంచలన నిర్ణయం? వారిలో ఇద్దరు, ముగ్గురిని నడి రోడ్డుపై ఉరి!
ఈ కారణంతో ఉచిత గ్యాస్ సిలిండర్ కోల్పోకండి.. కావాల్సినవి ఇవే! ఈ పథకం కింద మొదటసారి!
వైసిపికి షాక్! మాజీ ఎంపీ పై కేసు నమోదు! రాజకీయాలను వీడనున్న వాసిరెడ్డి పద్మ? కారణమిదే!
వాలంటీర్లకు సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు! ఇకపై ఆ బాధ్యతలు వారివే! రాజీనామా చేసిన వారి సంగతేంటి?
ఏ సమయంలో వాకింగ్ చేస్తే ఆరోగ్యానికి మంచిది! ఉదయమా? సాయంత్రమా?
పెన్షన్ డబ్బులతో ఉద్యోగి పరార్! సస్పెండ్ చేసిన జిల్లా కలెక్టర్!
చంద్రబాబు విజయనగరం జిల్లా పర్యటనలో మార్పు! ఎందుకో తెలుసా..?
ఈరోజే నామినేటెడ్ పోస్టుల రెండవ లిస్టు విడుదల? టీటీడీ చైర్మన్ ఆయనేనా?
పోలీసుల వేషంలో కిడ్నాప్ డ్రామా...చంపుతామని బెదిరింపు! వాహన తనిఖీలో నిందితులు అరెస్ట్!
మద్యంపై చేసే ఖర్చులో తెలుగు రాష్ట్రాలే టాప్! సంవత్సరానికి ఎంతో తెలుసా?
ఏపీలో మందుబాబులకు వెరైటీ ఆఫర్! ఒక బాటిల్ కొంటే అవి ఫ్రీ!
గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్ నియామక వివాదం! ఫోన్ సంభాషణ సోషల్ మీడియాలో హల్ చల్!
విభజన తర్వాత ఢిల్లీలో కొత్త ఏపీ భవన్ నిర్మాణానికి పచ్చ జెండా! నవంబర్ లోపు గుత్తేదారులకు ఆహ్వానం!
ఈ-చలాన్ పేరుతో కొత్త స్కామ్! ఒక్క క్లిక్ తో బ్యాంక్ అకౌంటు ఖాళీ! హెచ్చరికలు జారీ చేసిన కేంద్రం!
పార్లమెంట్ ఉభయసభలు ప్రత్యేక సమావేశం! ఎప్పుడు - ఎందుకు?
"ప్రజా వేదిక" కార్యక్రమంలో ఈరోజు పాల్గొననున్న మంత్రులు మరియు నాయకుల షెడ్యూల్! మీ కోసం!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: