రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక కష్టాల్లో ఉన్నప్పటికీ బడ్జెట్ ప్రవేశపెట్టిందని రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పార్థసారథి అన్నారు. గత ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడిందని.. వ్యవస్థలను ధ్వంసం చేసి పరిపాలన అస్తవ్యస్తం చేసిందని మండిపడ్డారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను వైకాపా సర్కారు చిన్నాభిన్నం చేసిందన్నారు. గత వైకాపా సర్కారు రూ. 1.35 లక్షల కోట్ల మేర బకాయిలు పెట్టి వెళ్లిపోయిందన్నారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిన పెట్టేందుకు కూటమి ప్రభుత్వం కృష్టి చేస్తోందని చెప్పారు.
ఈ మేరకు బడ్జెట్కు సంబంధించిన అంశాలపై నిర్వహించిన మీడియా సమావేశంలో పార్థసారథి మాట్లాడారు. “సూపర్ సిక్స్ పథకాలను కూటమి ప్రభుత్వం అమలు చేస్తోంది. ఇచ్చిన హామీ మేరకు అన్ని పథకాలను అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. సూపర్ సిక్స్ హామీల్లో ఇప్పటికే రెండు ప్రధాన హామీలు అమలు చేస్తున్నాం. కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే పింఛన్లను రూ.3 వేల నుంచి రూ.4 వేలకు పెంచాం. ఉచిత గ్యాస్ హామీ అమలులో భాగంగా రూ.840 కోట్ల నిధులు మంజూరు చేశాం. మరో రెండు పథకాల అమలు కోసం ఈ బడ్జెట్లో నిధులు కేటాయించాం” అని మంత్రి తెలిపారు.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
గుడ్ న్యూస్ చెప్పిన చంద్రబాబు! మహిళల ఖాతాల్లో రూ 1500 జమ పై ప్రభుత్వం కీలక నిర్ణయం!
ముంబయి నటి కేసులో కీలక నిందితుడు వైకాపా నేత సీఐడీ కస్టడీకి! విచారణలో కొత్త మలుపు!
నామినేటెడ్ పోస్టుల రెండో జాబితా! ఈసారి వారికి అవకాశం పక్కా! చంద్రబాబు కీలక వ్యాఖ్యలు!
నేడు సీ ప్లేన్లో శ్రీశైలంకు సీఎం చంద్రబాబు! మీరు ఎప్పుడు ప్లాన్ చేసుకుంటున్నారు?
రౌడీషీటర్ బోరుగడ్డ అనిల్పై మరో కేసు! వైసీపీకి ఊహించని షాక్ - ఈ కేసులో మాజీ ఎంపీ!
వైసీపీకి మరో షాక్.. బీజేపీలోకి మాజీ మంత్రి? జగన్ పై గాటు విమర్శలు!
ఏపీ ప్రజలకు గుడ్ చెప్పిన ఆరోగ్య శాఖ మంత్రి! ఇకపై ఆరోగ్య శ్రీ ద్వారా...
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: