పాత్రకు ప్రాణం పోసిన ఏకైక నటుడు ఎన్టీఆర్ అని సీఎం చంద్రబాబు కొనియాడారు. విజయవాడలోని పోరంకిలో శనివారం నిర్వహించిన ఎన్టీఆర్ సినీ వజోత్సవాల్లో చంద్రబాబు ముఖ్యఅతిథిగా పాల్గొని 'తారక రామం- అన్నగారి అంతరంగం' పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... "ఎన్టీఆర్ 300 చిత్రాల్లో నటించారు. ప్రతి పాత్రలో జీవించారు. ఆయనలా వైవిధ్యమైన పాత్రలు పోషించిన నటుడు మరొకరు లేరు. ఎన్టీఆర్ రూపంలో మనం దేవుడిని చూస్తున్నాం. అన్ని రకాల పాత్రలు పోషించి ప్రజలను మెప్పించారు. పరిశోధన చేసి మరీ వీరబ్రహ్మేంద్రస్వామి, శ్రీనాథుడు పాత్రలు పోషించారు” అని గుర్తు చేశారు. తెలుగుజాతి ఉన్నంత వరకు ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీ చిరస్థాయిగా ఉంటుందని తెలిపారు.
ఇంకా చదవండి: వైసీపీకి వరుస షాక్ లు.. పార్టీకి రాజీనామా చేయనున్న మాజీ మంత్రి! దానికి కారణం అదేనా?
"తెలుగు జాతి ఆత్మగౌరవం, పౌరుషం అంటే గుర్తొచ్చేది ఎన్టీఆర్. తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు ప్రారంభిస్తే ఇప్పటి వరకు 73లక్షల మంది సభ్యత్వం తీసుకున్నారు. జాతీయ భావాలతో ప్రాంతీయ పార్టీని నడిపిన ఏకైక నాయకుడు ఎన్టీఆర్. రాయలసీమలో కరువు, దివిసీమలో తుపాను వచ్చినప్పుడు.. జోలిపట్టి విరాళాలు సేకరించారు. సమాజమే దేవాలయం.. పేదలే దేవుళ్లని చెప్పారు. ఎన్టీఆర్ స్ఫూర్తితో.. పేదరికం లేని సమాజం కోసం కృషి చేస్తున్నాం. స్వర్ణాంధ్ర-2047 విజన్ డాక్యుమెంట్ విడుదల చేశాం. స్వర్ణాంధ్రప్రదేశ్ మన కల. అది సాధించే శక్తి మనదగ్గర ఉంది. ఎన్టీఆర్కు భారతరత్న ఇవ్వడమంటే తెలుగు జాతిని గౌరవించడం. ఆయనకు భారతరత్న ఇచ్చే వరకు పోరాడుతాం.. సాధిస్తాం” అని చంద్రబాబు స్పష్టం చేశారు. కార్యక్రమంలో మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, సినీనటి జయప్రద, నిర్మాతలు సురేష్బాబు, ఆదిశేషగిరిరావు, పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
రఘురామకృష్ణ చిత్రహింసల కేసులో కిలక మలుపు! గుంటూరు జీజీహెచ్లో...!
వైకాపా మాజీ ఎంపీ హౌస్ అరెస్ట్ సంచలనం! పులివెందులలో పోలీసుల ప్రత్యేక నిఘా!
18 వేల మందికి అమెరికా డీపోర్టేషన్! ఆందోళనలో భారతీయులు! టాప్ కేటగిరి తెలుగు వారే!
మోహన్ బాబుకు హైకోర్టులో చుక్కెదురు! అరెస్ట్ చేసేందుకు పోలీసులు రంగం సిద్ధం!
ఏపీ ప్రజలకు అలర్ట్.. ఇక వారికే పెన్షన్లు - అలా కట్ చేయండి! కలెక్టర్లకు చంద్రబాబు కీలక ఆదేశాలు!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: