సర్పంచుల డిమాండ్లలో కీలకమైనవి గుర్తించి పూర్తి చేశామని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తెలిపారు. కేరళ నుంచి ఐఏఎస్ అధికారి కృష్ణతేజను డిప్యుటేషన్పై తీసుకొచ్చామని.. ఆయన సహకారంతోనే గ్రామాల అభివృద్ధికి ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు పవన్ చెప్పారు. ఈ మేరకు మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో సర్పంచుల సంఘాల ప్రతినిధులతో పవన్ సమావేశమయ్యారు. "ప్రజలకు మేలు చేద్దామనే ఆలోచన ఉన్న అధికారులు నా పేషీలో ఉండటం నా అదృష్టం. ఎంపీ నిధుల ద్వారా కమ్యూనిటీ హాళ్ల నిర్మాణాలు పూర్తి చేస్తాం. 2014-19 కాలానికి సంబంధించిన పనులకు గత ప్రభుత్వం నిధులు విడుదల చేయలేదు. పెండింగ్ నిధుల విడుదలకు కేబినెట్లో చర్చించి ఆమోదం తెలిపాం. సర్పంచులకు ప్రథమ పౌరుల స్థానం ఇవ్వాలి.
ఇంకా చదవండి: ఏపీకి అదిరిపోయే శుభవార్త.. మన సీఎం ఐడియా వారెవ్వా! కేంద్రం మరో ప్రాజెక్ట్ కు గ్రీన్ సిగ్నల్! ఆ జిల్లా ప్రజలు ఎగిరి గంతేయాల్సిందే!
పంచాయతీలకు నిధులు ఎక్కువ కావాలి. స్వయం పోషక పంచాయతీలుగా ఎదగాలి. 12,900 పంచాయతీల్లో నిధులను గత ప్రభుత్వం వాడుకుంది. ఇతర అవసరాలకు రూ.8,629 కోట్లు మళ్లించేశారు. ఈ అంశాలను సీఎం, ఆర్థిక శాఖ దృష్టికి తీసుకెళ్తా. మరో నెలలో రూ.750 కోట్లు పంచాయతీల ఖాతాలకే రాబోతున్నాయి. ప్రధాని మోదీ కూడా గ్రామీణాభివృద్ధికి ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నారు. గత ప్రభుత్వం బాధ్యత లేకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరించింది. సరిచేయడానికి చంద్రబాబు అనుభవం కీలకంగా మారింది. పంచాయతీలను బలోపేతం చేసేందుకు చంద్రబాబు నాయకత్వంలో పనిచేస్తున్నాం. గ్రామ వాలంటీర్లను జగన్ ప్రభుత్వం మోసం చేసి పెట్టుకుంది. ప్రభుత్వ రికార్డుల్లో ఎక్కడా గ్రామ వాలంటీర్ల అంశమే లేదు. అసలు ఉద్యోగాల్లోనే లేరంటే.. రద్దు అనే అంశం ఎక్కడుంది? జల్ జీవన్ మిషన్ ద్వారా ప్రతి గ్రామానికి తాగునీరు అందిస్తాం. చెరువుల్లో పూడికలు తీసి, నీరు కలుషితం కాకుండా చూడాలి. పంచాయతీరాజ్ వ్యవస్థలో అవినీతిని నిర్మూలించేలా చర్యలు తీసుకుంటాం” అని పవన్ వెల్లడించారు.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
నేడు ఢిల్లీలో అమిత్ షాను కలవనున్న పవన్ కల్యాణ్! ఎందుకో తెలుసా! కేబినెట్ భేటీ ముగిసిన వెంటనే!
విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పిన సీఎం! విద్యావిధానంలో మరియు ఆ విషయంలో కీలక మార్పులు.. ఇక పండగే!
మీరు స్కూటీ కొనాలనుకుంటున్నారా..? అదిరిపోయే ఫీచర్లతో - అతి తక్కువ ధరకే ఎలక్ట్రిక్ స్కూటీ!
గత ఐదేళ్లలో తప్పులు జరిగిన మాట నిజమే! సంచలన వ్యాఖ్యలు చేసిన డీజీపీ! ఇక వారికి మోతే!
బీఎస్ఎన్ఎల్ స్పెషల్ రీఛార్జ్ ఆఫర్! అన్లిమిటెడ్ కాల్స్... 600 జీబీ డేటా!
ఆ న్యూస్ వెబ్సైట్ కి భారీ షాక్! కేంద్ర ప్రభుత్వం నోటీసులు జారీ! ఎందుకంటే..
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: