అమరావతి: అబద్ధాల్లో జగన్కి ఆస్కార్ అవార్డు ఇవ్వొచ్చని మంత్రి నిమ్మల రామానాయుడు 'ఎక్స్' వేదికగా కౌంటర్ ఇచ్చారు. పోలవరం ఎత్తుపై తప్పుడు ప్రచారం మానుకోవాలని హితవు పలికారు. కన్నతల్లిని, తోడబుట్టిన చెల్లిని మోసం చేసి.. జగన్ ఛీత్కారానికి గురయ్యారని ఎద్దేవా చేశారు. ప్రజా జీవనంలో ఉండడానికి అర్హత లేదన్న విషయం జగన్కు అర్థమైందని, అందుకే డైవర్షన్ పాలిటిక్సు తెరలేపారని ధ్వజమెత్తారు. పోలవరం ఎత్తుపై అతని మీడియాలో అబద్ధాలు అచ్చు వేసి గడిచిన రెండ్రోజులుగా దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తాను పూర్తి వివరాలతో జగన్ పోలవరం ప్రాజెక్టుకు చేసిన ద్రోహం గురించి వివరించానన్నారు. అయినా అతని బుద్ధి మారలేదని దుయ్యబట్టారు. రాష్ట్రానికి జల ద్రోహం చేసింది జగన్ కుటుంబమేనని ఆరోపించారు.
ఇంకా చదవండి: నాగ చైతన్య - శోభిత వివాహ ముహూర్తం ఖరారు! ఎప్పుడంటే..?
నాడు జల యజ్ఞంపేరిట ధనయజ్ఞం చేశారని, కృష్ణా మిగులు జలాల్లో హక్కు కోరబోమని బ్రిజేశ్ కుమార్ ట్రైబ్యునల్కు లేఖ రాసి ఇచ్చి ద్రోహం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలవరం రివర్స్ టెండరింగ్ పేరుతో 15 నెలలు ఆలస్యం చేసి డయాఫ్రమ్ వాల్ విధ్వంసానికి కారకులయ్యారన్నారు. ఇసుక మాఫియాతో అన్నమయ్య డ్యామ్ను కూలగొట్టి 38 మంది ప్రాణాలు బలిగొన్నారని మండిపడ్డారు. పులిచింతల, గుండ్లకమ్మ ప్రాజెక్టు గేట్లు కొట్టుకుపోవడం జగన్ పాపం కాదా? అని ప్రశ్నించారు. పోలవరానికి కేంద్రం ఇచ్చిన రూ.3,800 కోట్లు దారి మళ్లించి నదుల అనుసంధానానికి గండి కొట్టారని విమర్శించారు. పోలవరం ఎత్తు తగ్గించడానికి రెండు ఫేజ్లలుగా విభజించింది జగన్ కాదా అని నిలదీశారు. 41.15 మీటర్లకు తగ్గించాలని కేంద్రం అనుమతి కోరింది జగన్ కాదా? అని ప్రశ్నించారు. ఎన్డీయే ప్రభుత్వం పోలవరం ఎత్తు 45.72 మీటర్లకు పెంచి నదుల అనుసంధానం ద్వారా ఆంధ్రప్రదేశ్ను సస్యశ్యామలం చేస్తుందని తెలిపారు.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
చంద్రబాబు విజయనగరం జిల్లా పర్యటనలో మార్పు! ఎందుకో తెలుసా..?
ఈరోజే నామినేటెడ్ పోస్టుల రెండవ లిస్టు విడుదల? టీటీడీ చైర్మన్ ఆయనేనా?
పోలీసుల వేషంలో కిడ్నాప్ డ్రామా...చంపుతామని బెదిరింపు! వాహన తనిఖీలో నిందితులు అరెస్ట్!
మద్యంపై చేసే ఖర్చులో తెలుగు రాష్ట్రాలే టాప్! సంవత్సరానికి ఎంతో తెలుసా?
ఏపీలో మందుబాబులకు వెరైటీ ఆఫర్! ఒక బాటిల్ కొంటే అవి ఫ్రీ!
గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్ నియామక వివాదం! ఫోన్ సంభాషణ సోషల్ మీడియాలో హల్ చల్!
విభజన తర్వాత ఢిల్లీలో కొత్త ఏపీ భవన్ నిర్మాణానికి పచ్చ జెండా! నవంబర్ లోపు గుత్తేదారులకు ఆహ్వానం!
ఈ-చలాన్ పేరుతో కొత్త స్కామ్! ఒక్క క్లిక్ తో బ్యాంక్ అకౌంటు ఖాళీ! హెచ్చరికలు జారీ చేసిన కేంద్రం!
పార్లమెంట్ ఉభయసభలు ప్రత్యేక సమావేశం! ఎప్పుడు - ఎందుకు?
"ప్రజా వేదిక" కార్యక్రమంలో ఈరోజు పాల్గొననున్న మంత్రులు మరియు నాయకుల షెడ్యూల్! మీ కోసం!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: