రోడ్లు అనేవి నాగరికతకు చిహ్నమని.. రహదారులు బాగుంటే పరిశ్రమలు వస్తాయని సీఎం చంద్రబాబు అన్నారు. అనకాపల్లి జిల్లాలో ఆయన పర్యటించారు. వెన్నెలపాలంలో రహదారిపై ఉన్న గుంతలు పూడ్చే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సీఎం వెంట మంత్రులు అనిత, కొల్లు రవీంద్ర తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో చంద్రబాబు మాట్లాడారు. "రాష్ట్రంలోని రోడ్లు నరకానికి రహదారిగా మారాయి. రహదారులు ఈ దుస్థితికి రావడానికి గత పాలకులే కారణం. గత సీఎం రోడ్లపై ఈత కొలనులు ఏర్పాటు చేశారు. రహదారులు అభివృద్ధికి చిహ్నం. గుంతలు లేని రోడ్లకు వెన్నలపాలెంలో శంకుస్థాపన చేశాం. రహదారులు బాగుంటే వ్యాపారాలు బాగా జరుగుతాయి. సంక్రాంతిలోపు రోడ్లపై ఉన్నటువంటి గుంతలన్నీ పూడ్చాలి. రౌడీ రాజకీయాలు వద్దు.. అభివృద్ధి రాజకీయాలు కావాలి. 2014-19లో రహదారులు ఎలా ఉండేవో గుర్తుకు తెచ్చుకోవాలి. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 24 వేల కి.మీ సిమెంట్ రోడ్లు వేశాం. రహదారులపై గుంతలు లేకుండా చూసే బాధ్యత మాది. రాష్ట్రంలో మళ్లీ భూతం రాకుండా చూసే బాధ్యత ప్రజలది"
ఇంకా చదవండి: పెన్షనర్లకు గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ ప్రభుత్వం! మూడు నెలల పెన్షన్ ఒకేసారి!
దోచుకోవడం తప్ప జగన్కు అభివృద్ధి తెలియదు..
“విశాఖపట్నంలో రైల్వే జోన్ ఏర్పాటుకు వైకాపా స్థలం ఇవ్వలేదు. దోచుకోవడం తప్ప అభివృద్ధి తెలియని జగన్ కేంద్ర ప్రభుత్వానికి సహకరించకుండా రాష్ట్ర అభివృద్ధిని గాలికొదిలేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే విశాఖ రైల్వే జోన్కు స్థలం కేటాయించాం. నక్కపల్లి వద్ద స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేస్తాం. ఇంటికొక ఐటీ ఉద్యోగి రావాలని గతంలో పిలుపు ఇచ్చాం. గ్రామాల్లో సూక్ష్మ, మధ్య తరహా పరిశ్రమల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నాం. దీపం పథకాన్ని గతంలో అవహేళన చేశారు. నేడు దీపం 2 కింద మూడు గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నాం. వ్యవసాయానికి, డ్వాక్రా మహిళలకు డ్రోన్లు అందించే కార్యక్రమాన్ని చేపట్టాం. 175 నియోజక వర్గాల్లో 175 పారిశ్రామిక హబ్ లు ఏర్పాటు చేస్తాం. రతన్ టాటా స్ఫూర్తితో ఇంటికొక పారిశ్రామికవేత్తను తయారు చేయాలన్నది కూటమి ప్రభుత్వ లక్ష్యం” “ఐదేళ్ల విధ్వంసంతో రాష్ట్రంలో అనేక సవాళ్లు ఎదురయ్యాయి. జరిగిన నష్టాన్ని ఐదు నెలల సమయంలో సరిదిద్దే చర్యలు చేపట్టాం. పోలవరం నీళ్లు విశాఖకు తరలిస్తాం. అనకాపల్లిని పేదరికం లేని జిల్లాగా మారుస్తాం” అని చంద్రబాబు అన్నారు.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
చంద్రబాబు విజయనగరం జిల్లా పర్యటనలో మార్పు! ఎందుకో తెలుసా..?
ఈరోజే నామినేటెడ్ పోస్టుల రెండవ లిస్టు విడుదల? టీటీడీ చైర్మన్ ఆయనేనా?
పోలీసుల వేషంలో కిడ్నాప్ డ్రామా...చంపుతామని బెదిరింపు! వాహన తనిఖీలో నిందితులు అరెస్ట్!
మద్యంపై చేసే ఖర్చులో తెలుగు రాష్ట్రాలే టాప్! సంవత్సరానికి ఎంతో తెలుసా?
ఏపీలో మందుబాబులకు వెరైటీ ఆఫర్! ఒక బాటిల్ కొంటే అవి ఫ్రీ!
గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్ నియామక వివాదం! ఫోన్ సంభాషణ సోషల్ మీడియాలో హల్ చల్!
విభజన తర్వాత ఢిల్లీలో కొత్త ఏపీ భవన్ నిర్మాణానికి పచ్చ జెండా! నవంబర్ లోపు గుత్తేదారులకు ఆహ్వానం!
ఈ-చలాన్ పేరుతో కొత్త స్కామ్! ఒక్క క్లిక్ తో బ్యాంక్ అకౌంటు ఖాళీ! హెచ్చరికలు జారీ చేసిన కేంద్రం!
పార్లమెంట్ ఉభయసభలు ప్రత్యేక సమావేశం! ఎప్పుడు - ఎందుకు?
"ప్రజా వేదిక" కార్యక్రమంలో ఈరోజు పాల్గొననున్న మంత్రులు మరియు నాయకుల షెడ్యూల్! మీ కోసం!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: