విజయవాడ నగరంలోని స్వరాజ్య మైదానంలో ఏర్పాటు చేసిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని జగన్మోహన్ రెడ్డి ఆవిష్కరించారు. 206 అడుగుల అంబేద్కర్ కాంస్య విగ్రహ ఆవిష్కరణతోపాటు ఆయన జీవిత విశేషాలతో కూడిన మ్యూజియం, మినీ థియేటర్ ను ప్రారంభించారు.
56 నెలల్లో ప్రభుత్వం అడుగడుగునా అనుసరించిన సామాజిక న్యాయానికి నిలువెత్తు నిదర్శనమే అంబేద్కర్ విగ్రహం. స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ అంటే విజయవాడ గుర్తుకు వస్తుందని ఆ మహనీయుడి విగ్రహాన్ని విజయవాడలో ఏర్పాటు చేసుకున్నాం అని సీఎం జగన్మోహనరెడ్డి పేర్కొన్నారు.
సింగపూర్ లో తెలుగు వారికి శుభవార్త! హైదరాబాద్ లో పెట్టుబడి అవకాశం మీ ముంగిట్లోకే! ఈ నెల 20 - 21 తేదీలలో! మరిన్ని వివరాల కోసం Click Here
18 ఎకరాల్లో రూ.404 కోట్లతో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటుచేసినట్లు ఈ సందర్భంగా ప్రభుత్వం ప్రకటించింది. విగ్రహావిష్కరణ కార్యక్రమంలో భాగంగా ప్రదర్శించిన లేజర్ షో , డ్రోన్లతో ప్రత్యేక షోను సీఎం తిలకించారు. డ్రోన్ షో ప్రదర్శనలో భాగంగా భారత్, ఆంధ్రప్రదేశ్ చిత్రపటాలు, రాజమహేంద్రవరం రోడ్కమ్ రైలు వంతెన, కర్నూలు కొండారెడ్డి బురుజు సహా వివిధ ఆకృతులను ప్రదర్శించారు.
తెలుగు ప్రవాసులకు ఉపయోగ పడే వార్తలు, వారికి సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒక చోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి