తెలంగాణ ఐ అండ్ పీఆర్, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ వల్లే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని వ్యాఖ్యానించారు. ఖమ్మం జిల్లా టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో పాల్గొన్నారు పొంగులేటి. అందుకు గాను... తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు, ఆయన కుమారుడు నారా లోకేష్కు, టీడీపీ శ్రేణులకు కృతజ్ఞతలు తెలిపారు.
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
తెలంగాణలో మార్పు కావాలని కోరుకున్న ప్రజల కోసం అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి టీడీపీ మద్దతు పలికిందన్నారు మంత్రి పొంగులేటి. టీడీపీ కృషి మరువలేనిదని, కాంగ్రెస్ గెలుపు కోసం నిద్ర పోకుండా పనిచేశారన్నారు. నియంతృత్వ, అహంకారపూరిత ప్రభుత్వాన్ని ఓడించేందుకు టీడీపీ తమతో కలిసి పనిచేసిందని చెప్పారాయన. తమకు సహకరించినవారిని ఎప్పుడూ మర్చిపోనని చెప్పారు పొంగులేటి శ్రీనివాస రెడ్డి. టీడీపీకి ఎలాంటి ప్రయోజనం లేకపోయినా.... తమ ప్రయోజనాన్ని కూడా పక్కనబెట్టి.. 119 నియోకవర్గాల్లో కాంగ్రెస్కు మద్దతు ప్రకటించారని చెప్పారు. పొంగులేటి వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు.
తెలుగు ప్రవాసులకు ఉపయోగ పడే వార్తలు, వారికి సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒక చోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి