టిడిపి కార్యకర్త చంద్రమోహన్ ను స్టేషన్ ఆవరణలో నగ్నంగా తిప్పిన పాల్తూరు పోలీసులు..
వైసిపి జెండా దించాలని అడిగినందుకు పాల్తూరు పోలీసులు దాస్టికం.
వైసీపీ నేతల ఫిర్యాదుతో కేసు నమోదు.. తెలుగుదేశం పార్టీ కార్యకర్తపై విచక్షణ దాడి..
పక్కటెముక విరిగిన వైద్యం చేయించకుండా నేరుగా జైలుకు పంపించిన పోలీసులు...
పోలీసులు తీరుపై మండిపడుతున్న తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు
టిడిపి కార్యకర్త చంద్రమోహన్ టార్గెట్ గా పోలీసుల అరాచకం..
పోలీసులు వైసీపీ కార్యకర్తలగా వ్యవహరిస్తున్నారంటూ టిడిపి శ్రేణుల ఆగ్రహం..
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
వైసీపీ ఆదేశాలతో కొందరు పోలీసులు వ్యవహరిస్తున్న తీరుతో ప్రజాస్వామ్యం సిగ్గుపడుతోందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విమర్శలు గుప్పించారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. రాక్షస రాజులు కూడా సైకో జగన్లాంటి దుర్మార్గ చర్యలకు పాల్పడలేదన్నారు. అనంతపురం జిల్లా విడపనకల్లు మండలం చీకలగురిలో వైసీపీ జెండాను కాల్చేశారనే ఆరోపణలపై టీడీపీ కార్యకర్త, బీసీ బోయ సామాజికవర్గానికి చెందిన చంద్రమోహన్ను అరెస్టు చేసిన పోలీసులు.. నగ్నంగా కొడుతూ ఊరేగించిన ఘోరం చూశాక తన గుండె చెదిరిపోయిందన్నారు.
‘‘సభ్య సమాజం తలదించుకునేలా వ్యవహరించిన మీరు ప్రజాధనం జీతంగా తీసుకునే పోలీసులా ?.. ఫ్యాక్షనిస్టు జగన్ కిరాయి సైన్యమా? ఒక కరడుగట్టిన నేరగాడు పెట్టిన పార్టీ జెండా అంత పవిత్రమైనదా!. జాతీయ జెండా పెడతామనడం నేరమా?’’ అని నిలదీశారు.
టీడీపీ సైనికుడు చంద్రమోహన్ను నగ్నంగా ఊరేగించారని, పక్కటెముకలు విరగ్గొట్టారని అన్నారు. నరరూప రాక్షస చర్యలకు చట్టబద్ధమైన శిక్ష అనుభవించేందుకు సిద్ధంగా ఉండాలని లోకేష్ హెచ్చరించారు.
తెలుగు ప్రవాసులకు ఉపయోగ పడే వార్తలు, వారికి సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒక చోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి