మంగళగిరిలో వైకాపా కనుమరుగైందని ఇప్పుడు నియోజకవర్గం తెదేపా కంచుకోటగా మారిందని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. ఇన్ని రోజులు అధికార పార్టీ మంగళగిరిని పట్టించుకోకుండా, ఇప్పుడు మాత్రం ఇళ్ల పట్టాలిస్తామని చెప్పి హడావుడి చేస్తోందని మండిపడ్డారు.
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
72 రోజుల్లో రాష్ట్రమంతా పసుపుమయం కాబోతుందని ధీమా వ్యక్తం చేశారు. నియోజకవర్గానికి చెందిన పలువురు వైకాపా నేతలు ఆయన సమక్షంలో టీడీపీ లో చేరారు. ఈ సందర్భంగా లోకేశ్ మాట్లాడుతూ.. తాను మంగళగిరిలో ఓడిపోయినా 29 సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తున్నానని వివరించారు. అధికారంలోకి రాగానే రాష్ట్రమంతా ఈ నియోజకవర్గం వైపు చూసేలా అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు.
తెలుగు ప్రవాసులకు ఉపయోగ పడే వార్తలు, వారికి సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒక చోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి