న్యూజిలాండ్ ప్రధాన మంత్రి క్రిస్టోఫర్ లక్సన్తో పర్చూరు, బాపట్ల తెదేపా ఎమ్మెల్యేలు ఏలూరి సాంబశివరావు, నరేంద్ర వర్మ భేటీ అయ్యారు. మన ఆంధ్ర తెలుగు అసోసియేషన్, న్యూజిలాండ్ ఎన్నారై తెదేపా ఆహ్వానం మేరకు న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లిన ఎమ్మెల్యేలు ఆ దేశ ప్రధానిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ప్రధానితో మాట్లాడారు. రాష్ట్రాభివృద్ధి కోసం ఏపీ సీఎం చంద్రబాబు చేపట్టిన వివిధ కార్యక్రమాలను ప్రధానికి వివరించారు. చంద్రబాబు తనకు తెలుసని, మంచి విజనరీ నాయకుడుని క్రిస్టోఫర్ కితాబిచ్చారు. చంద్రబాబు సారథ్యంలో నెలకొల్పిన కియా కార్లు ఆంధ్రప్రదేశ్ నుంచి న్యూజిలాండ్కు వస్తున్నాయని ఎమ్మెల్యేలు ఆయనకు చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యటనకు రావాలని న్యూజిలాండ్ ప్రధానిని ఎమ్మెల్యేలు ఆహ్వానించారు. ఏపీలో భారీ పరిశ్రమలను నెలకొల్పాలని కోరారు. ఈ మేరకు మార్చిలో అమరావతి పర్యటనకు వస్తానని ప్రధాన మంత్రి క్రిస్టోఫర్ లక్సన్ చెప్పారు. ఎమ్మెల్యేలతో పాటు న్యూజిలాండ్ నేషనల్ పార్టీ ప్రతినిధులు శివ కిలారి, బాల వేణుగోపాల్ వీరం, తెదేపా న్యూజిలాండ్ కో-ఆర్డినేటర్ జితేందర్ నిమ్మగడ్డ, మన ఆంధ్ర తెలుగు అసోసియేషన్ నేతలు మద్దుకూరి దిలీప్, అశోక్ గోరంట్ల, న్యూజిలాండ్ ఎన్నారై తెదేపా అసోసియేషన్ నాయకులు పాల్గొన్నారు.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
నేడు ఢిల్లీలో అమిత్ షాను కలవనున్న పవన్ కల్యాణ్! ఎందుకో తెలుసా! కేబినెట్ భేటీ ముగిసిన వెంటనే!
విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పిన సీఎం! విద్యావిధానంలో మరియు ఆ విషయంలో కీలక మార్పులు.. ఇక పండగే!
మీరు స్కూటీ కొనాలనుకుంటున్నారా..? అదిరిపోయే ఫీచర్లతో - అతి తక్కువ ధరకే ఎలక్ట్రిక్ స్కూటీ!
గత ఐదేళ్లలో తప్పులు జరిగిన మాట నిజమే! సంచలన వ్యాఖ్యలు చేసిన డీజీపీ! ఇక వారికి మోతే!
బీఎస్ఎన్ఎల్ స్పెషల్ రీఛార్జ్ ఆఫర్! అన్లిమిటెడ్ కాల్స్... 600 జీబీ డేటా!
ఆ న్యూస్ వెబ్సైట్ కి భారీ షాక్! కేంద్ర ప్రభుత్వం నోటీసులు జారీ! ఎందుకంటే..
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: