రెడ్బుక్లో రెండు చాప్టర్లు ఓపెన్ అయ్యాయని ఏపీ మంత్రి నారా లోకేశ్ అన్నారు. అమెరికా పర్యటనలో భాగంగా అట్లాంటాలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించి మాట్లాడారు. "చట్టాన్ని ఉల్లంఘించిన వారికి కచ్చితంగా సినిమా చూపిస్తాం. సందేహం లేదు.. త్వరలోనే రెడ్బుక్ మూడో చాప్టర్ కూడా తెరుస్తాం. యువగళం పాదయాత్రలో నన్ను తీవ్ర ఇబ్బందులకు గురి చేశారు. రెడబ్బుక్కు భయపడుతున్న జగన్.. గుడ్బుక్ తీసుకొస్తానంటున్నారు. బుక్లో ఏమి రాయాలో ఆయనకు అర్థం కావట్లేదు. గతంలో సోషల్మీడియాలో పోస్టు పెడితే కేసులు పెట్టి లుకౌట్ నోటీసులు ఇచ్చేవారు. నోటీసులకు భయపడకుండా ఎన్ఆర్ఎలు నిలబడ్డారు. రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్తాం. రాష్ట్రానికి పెట్టుబడులు కూడా తీసుకెళ్లాలి. సంక్షేమం అంటే ఏమిటో ఎన్టీఆర్ చూపించారు. ప్రపంచంలో తెలుగువారు తలెత్తుకొని తిరిగే పరిస్థితి తీసుకొచ్చారు. ఎన్టీఆర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లడంలో ఎప్పుడూ ముందుంటాం. మీరు ఎన్ఆస్ఐలు కాదు.. ఎంఆస్ఐలు అని పిలుస్తా. ఎంఆర్ఎ అంటే 'మోస్ట్ రిలయబుల్ ఇండియన్' అని అర్థం. ఏపీలో కూటమి గెలుపు ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క తెలుగువారిది” అని లోకేశ్ తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు వెనిగండ్ల రాము, యార్లగడ్డ వెంకట్రావు, ఎన్ఆర్ఎ తెదేపా నేత కోమటి జయరాం పాల్గొన్నారు. ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ సమయంలో అభిమానులు హెలికాప్టర్ నుంచి పూలవర్షం కురిపించారు.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
చంద్రబాబు విజయనగరం జిల్లా పర్యటనలో మార్పు! ఎందుకో తెలుసా..?
ఈరోజే నామినేటెడ్ పోస్టుల రెండవ లిస్టు విడుదల? టీటీడీ చైర్మన్ ఆయనేనా?
పోలీసుల వేషంలో కిడ్నాప్ డ్రామా...చంపుతామని బెదిరింపు! వాహన తనిఖీలో నిందితులు అరెస్ట్!
మద్యంపై చేసే ఖర్చులో తెలుగు రాష్ట్రాలే టాప్! సంవత్సరానికి ఎంతో తెలుసా?
ఏపీలో మందుబాబులకు వెరైటీ ఆఫర్! ఒక బాటిల్ కొంటే అవి ఫ్రీ!
గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్ నియామక వివాదం! ఫోన్ సంభాషణ సోషల్ మీడియాలో హల్ చల్!
విభజన తర్వాత ఢిల్లీలో కొత్త ఏపీ భవన్ నిర్మాణానికి పచ్చ జెండా! నవంబర్ లోపు గుత్తేదారులకు ఆహ్వానం!
ఈ-చలాన్ పేరుతో కొత్త స్కామ్! ఒక్క క్లిక్ తో బ్యాంక్ అకౌంటు ఖాళీ! హెచ్చరికలు జారీ చేసిన కేంద్రం!
పార్లమెంట్ ఉభయసభలు ప్రత్యేక సమావేశం! ఎప్పుడు - ఎందుకు?
"ప్రజా వేదిక" కార్యక్రమంలో ఈరోజు పాల్గొననున్న మంత్రులు మరియు నాయకుల షెడ్యూల్! మీ కోసం!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: