అదనపు కట్నం కోసం పెళ్లైన ఆరు నెలలకు తన మనవరాలు షేక్ అమీరున్ను సయ్యద్ రఫీ, ఇబ్రహీం కుటుంబసభ్యులు దారుణంగా హతమార్చారని గుంటూరు జిల్లా తాడికొండ మండలం రావెల గ్రామానికి చెందిన షేక్ మౌలాలి వాపోయారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ పోలీసుస్టేషన్ చుట్టూ తిరిగినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన 'ప్రజావేదిక కార్యక్రమంలో ఫిర్యాదు చేశారు. ఏపీఎస్ఆర్టీసీ ఛైర్మన్ కొనకళ్ల నారాయణ, పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ ప్రజల నుంచి వినతులు స్వీకరించారు.
• దళిత కులానికి చెందిన తనపై మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు అనుచరులు సామాజిక మాధ్యమంలో కించపరిచేలా పోస్టులు పెట్టి, మళ్లీ తనపైనే తప్పుడు కేసు పెట్టించారని పల్నాడు జిల్లా వినుకొండకు చెందిన గంటిపోగు స్టీఫెన్బాబు ఫిర్యాదు చేశారు.
• ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన సతీమణిపై అసభ్యకర పోస్టులు పెడుతున్న శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కోవూరుకు చెందిన మునగాల హరీష్రెడ్డిపై చర్యలు తీసుకోవాలని నంద్యాల జిల్లా గోస్పాడు మండల తెదేపా కన్వీనర్ కె. తులసీశ్వరరెడ్డి ఫిర్యాదు చేశారు.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
ప్రధాని మోదీ ప్రయాణించాల్సిన విమానంలో సాంకేతిక లోపం! ఏమి జరిగింది అంటే!
"ప్రజా వేదిక" కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రులు మరియు నాయకుల షెడ్యూల్! ఎవరో తెలుసా?
నామినేటెడ్ పోస్టుల 5వ లిస్ట్ విడుదల! మరో నాలుగు కార్పొరేషన్లకు... పూర్తి వివరాలు!
ప్రధాని మోదీతో చంద్రబాబు కీలక మంత్రాంగం - ఆహ్వానం! ఎందుకు? ఎప్పుడు అంటే?
నటి శ్రీరెడ్డి రాసిన లేఖకు వెన్నపూసలా కరిగిపోయిన లోకేష్! ఆమెకు బంపర్ ఆఫర్!
గుడ్ న్యూస్ చెప్పిన చంద్రబాబు - కేబినెట్ భేటీ! మహిళలకు ఫ్రీ బస్, రైతుల ఖాతాల్లో రూ 20 వేలు!
వైసీపీకి భారీ షాక్.. టీడీపీలో చేరిన వైసీపీ మాజీ కీలక నేత! 50 మంది వరకు వైసీపీ నేతలు టీడీపీలో!
"ప్రజా వేదిక" కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రులు మరియు నాయకుల షెడ్యూల్! ఎవరు అంటే!
ఏపీ ప్రజలకు మరో గుడ్ న్యూస్! ఆడబిడ్డ నిధి పథకం.. నెల నెలా మహిళల అకౌంట్లో రూ.1,500!
మందుబాబులకు కిక్కే కిక్కు.. మరో కొత్త రకం మందు వచ్చేసింది! అతి తక్కువ ధరకే!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: