వైద్య విభాగంలో కీలకమైన ఆవిష్కరణలు చేసిన ప్రపంచ ప్రఖ్యాత శాస్త్రవేత్త డాక్టర్ ఎల్లాప్రగడ సుబ్బారావుకు సముచిత గౌరవం లభించింది. ఏలూరు ప్రభుత్వ వైద్యకళాశాలకు ఆయన పేరు పెడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏదైనా ప్రభుత్వ వైద్య కళాశాలకు ఎల్లాప్రగడ సుబ్బారావు పెట్టాలనే ప్రతిపాదనను పరిశీలించాలని వైద్య ఆరోగ్యశాఖను ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించిన విషయం తెలిసిందే. తాను చేసిన ప్రతిపాదనపై సానుకూలంగా స్పందించినందుకు ఉప ముఖ్యమంత్రి పవన్కల్యాణ్ సీఎంకు ఓ ప్రకటనలో కృతజ్ఞతలు తెలిపారు. ‘ప్రపంచానికి పలు ఔషధాలు అందించిన శాస్త్రవేత్త సుబ్బారావు స్వస్థలం భీమవరం. ఆయన రాజమహేంద్రవరంలో చదువుకున్నారు. కాబట్టి కొత్తగా ఏర్పాటు చేసిన ఏలూరు, రాజమహేంద్రవరం ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ఒక దానికి ఆయన పేరు పెడితే సముచితంగా ఉంటుంది. తొలి టెట్రాసైక్లిన్ యాంటీ బయోటిక్ ‘అరియోమైసిన్'ను సుబ్బారావు కనుగొన్నారు. బోద, క్షయ వ్యాధుల కట్టడికి ఔషధాలు రూపొందించారు. క్యాన్సర్ చికిత్సలో కీమోథెరపీకి వాడే తొలితరం డ్రగ్ను అభివృద్ధి చేశారు' అని పేర్కొన్నారు.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
నామినేటెడ్ పోస్టుల రెండో జాబితా! ఈసారి వారికి అవకాశం పక్కా! చంద్రబాబు కీలక వ్యాఖ్యలు!
నేడు సీ ప్లేన్లో శ్రీశైలంకు సీఎం చంద్రబాబు! మీరు ఎప్పుడు ప్లాన్ చేసుకుంటున్నారు?
రౌడీషీటర్ బోరుగడ్డ అనిల్పై మరో కేసు! వైసీపీకి ఊహించని షాక్ - ఈ కేసులో మాజీ ఎంపీ!
వైసీపీకి మరో షాక్.. బీజేపీలోకి మాజీ మంత్రి? జగన్ పై గాటు విమర్శలు!
ఏపీ ప్రజలకు గుడ్ చెప్పిన ఆరోగ్య శాఖ మంత్రి! ఇకపై ఆరోగ్య శ్రీ ద్వారా...
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: