గతంలో మహిళలపై అత్యాచారాలు జరిగితే జగన్ ప్రభుత్వం పట్టించుకోలేదని హోం మంత్రి అనిత (Anitha) విమర్శించారు. ఐదో రోజు శాసనమండలి సమావేశాల్లో ఆమె మాట్లాడారు. ప్రశ్నోత్తరాల సమయంలో పలువురు ఎమ్మెల్సీలు అడిగిన ప్రశ్నలకు ఆమె సమాధానమిచ్చారు. “వైకాపా హయాంలో పరామర్శకు వెళ్లిన మాపైనే కేసులు పెట్టారు. దిశ చట్టం గురించి గొప్పగా చెబుతున్నారు.. అసలు ఆ చట్టం ఉందా? దిశ యాప్, చట్టం పని చేస్తే మహిళలపై అఘాయిత్యాలు ఎందుకు పెరిగాయి. ఉన్న నిర్భయ చట్టాన్ని వదిలేసి.. లేని దిశ చట్టాన్ని తీసుకొచ్చారు. కూటమి ప్రభుత్వ హయాంలో మహిళలపై అసభ్యంగా ప్రవర్తించిన వారిని అరెస్టు చేస్తున్నాం. ముచ్చుమర్రి ఘటనలో బాలికను గుర్తించడానికి సమయం పట్టింది. పోలీసుల వైఫల్యం ఇప్పటిది కాదు.. వైకాపా హయాం నాటిది. కూటమి ప్రభుత్వంలో పోలీసులు 24 నుంచి 48 గంటల్లో నేరస్థుల్ని పట్టుకుంటున్నారు. గత ఐదేళ్లలో పోలీసులు పరదాలు కట్టడానికి, చెట్లు నరకడానికి, రోడ్ల మీద కాపలా కాయడానికి పని చేశారు. ఒక్క మహిళనైనా వారు రక్షించారా? దిశ చట్టానికి చట్టబద్ధత లేకుండా దిశ పోలీసు స్టేషన్లు ఏర్పాటు చేశారు. రాజమహేంద్రవరంలో దిశ పోలీసు స్టేషన్ ప్రారంభించారు. అదే రోజు దళిత మహిళపై సామూహిక అత్యాచారం చేసి పోలీసు స్టేషన్ ముందు వదిలేసి వెళ్లారు. దిశ యాప్తో నేరాలు తగ్గింది నిజమైతే.. రికార్డుల్లో ఎందుకు నేరాలు పెరుగుతున్నాయి. అమరావతిలో ఫోరెన్సిక్ ల్యాబ్ కట్టడానికి వైకాపా హయాంలో కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. అది పూర్తయి ఉంటే నేరాలు జరిగిన వెంటనే శిక్షలు పడేందుకు అవకాశం ఉండేది.
ఇంకా చదవండి: వాట్సాప్ లో సీక్రెట్గా చాటింగ్ చేయాలి అనుకుంటున్నారా? ఈ అదిరిపోయే ఫీచర్ మీ కోసమే!
మహిళల భద్రతకు కూటమి ప్రభుత్వం పెద్దపీట
2014-19 మధ్య ఏపీలో 83,202 కేసులు నమోదయ్యాయి. 2019-24 మధ్య 1,00,508 కేసులు నమోదయ్యాయి. గడిచిన ఐదేళ్లలో మహిళలపై అఘాయిత్యాలు 20.8 శాతం పెరిగాయి. గత ప్రభుత్వం దిశ చట్టాన్ని తెచ్చి అమలు చేయడంలో విఫలమైంది. జగన్ పాలనలో అనేక అఘాయిత్యాలు జరిగినా కనీస చర్యల్లేవు. మహిళా పోలీసు స్టేషన్ల బోర్డులను దిశ పీఎస్లుగా మార్చారు. గంజాయి నియంత్రణపై జగన్ ఒక్కసారి కూడా సమీక్షించలేదు. మహిళల భద్రతకు కూటమి ప్రభుత్వం పెద్దపీట వేసింది. ప్రత్యేక కోర్టులతో నిందితులకు త్వరితగతిన శిక్షలు పడేలా చేస్తున్నాం. జగన్ తల్లి, చెల్లికి అన్యాయం జరిగినా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. మహిళల జోలికొచ్చినా, సోషల్మీడియాలో అసభ్యకరంగా మాట్లాడినా కఠిన చర్యలు తీసుకుంటాం. మహిళా పీఎస్లు, హెల్ప్ డెస్క్ లు ఏర్పాటు చేసి నివారణ చర్యలు తీసుకుంటున్నాం. 5 నెలల కాలంలో 24 గంటల్లోనే నిందితులను పట్టుకుని రిమాండ్కు పంపించాం. మహిళలపై అఘాయిత్యాలు జరగకుండా కఠిన చట్టాలు, ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేస్తాం" అని అనిత (Anitha) .
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
ప్రయాణికులకు గుడ్ న్యూస్.. హైదరాబాద్, విజయవాడ, వైజాగ్.. భారీగా విమానాల సర్వీసులు పెంపు!
గుడ్ న్యూస్: భారీగా పడిపోయిన బంగారం ధర! ఎంత తగ్గిందో తెలిస్తే కొనకుండా ఉండలేరు!Don't Miss
వైసీపీకి మరో బిగ్ షాక్: విద్యార్థిని ఫిర్యాదు.. మాజీ మంత్రిపై కేసు నమోదు! ఎందుకో తెలుసా?
వైసీపీకి మరో షాక్! మాజీ మంత్రి సహచరుడు పై కేసు నమోదు! లైవ్ లో చూస్తూ వైసీపీ నేత పైశాచికానందం!
భారీ శుభవార్త.. ఏపీలో కొత్త పెన్షన్లు జారీ.. దరఖాస్తు తేదీ ఇదే! అస్సలు మిస్ అవకండి!
ప్రధాని మోదీ ప్రయాణించాల్సిన విమానంలో సాంకేతిక లోపం! ఏమి జరిగింది అంటే!
"ప్రజా వేదిక" కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రులు మరియు నాయకుల షెడ్యూల్! ఎవరో తెలుసా?
నామినేటెడ్ పోస్టుల 5వ లిస్ట్ విడుదల! మరో నాలుగు కార్పొరేషన్లకు... పూర్తి వివరాలు!
ప్రధాని మోదీతో చంద్రబాబు కీలక మంత్రాంగం - ఆహ్వానం! ఎందుకు? ఎప్పుడు అంటే?
నటి శ్రీరెడ్డి రాసిన లేఖకు వెన్నపూసలా కరిగిపోయిన లోకేష్! ఆమెకు బంపర్ ఆఫర్!
గుడ్ న్యూస్ చెప్పిన చంద్రబాబు - కేబినెట్ భేటీ! మహిళలకు ఫ్రీ బస్, రైతుల ఖాతాల్లో రూ 20 వేలు!
వైసీపీకి భారీ షాక్.. టీడీపీలో చేరిన వైసీపీ మాజీ కీలక నేత! 50 మంది వరకు వైసీపీ నేతలు టీడీపీలో!
"ప్రజా వేదిక" కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రులు మరియు నాయకుల షెడ్యూల్! ఎవరు అంటే!
ఏపీ ప్రజలకు మరో గుడ్ న్యూస్! ఆడబిడ్డ నిధి పథకం.. నెల నెలా మహిళల అకౌంట్లో రూ.1,500!
మందుబాబులకు కిక్కే కిక్కు.. మరో కొత్త రకం మందు వచ్చేసింది! అతి తక్కువ ధరకే!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: