పర్చూరు నియోజకవర్గం ఇంకొల్లులో జరిగిన రా కదలిరా సభలో చంద్రబాబు సీఎం జగన్ మోహన్ రెడ్డీ పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తన సభను అడ్డుకునేందుకు ప్రయత్నించడం పట్ల చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నా రాజకీయాల ముందు నువ్వొక బచ్చా అంటూ సీఎం జగన్ మోహన్ రెడ్డీ పై ఘాటు వ్యాఖ్యలు చేశారు.
నీ పులివెందుల కూడా మేం గెలవబోతున్నాం... కాస్కో జగన్ మోహన్ రెడ్డీ అంటూ సవాల్ విసిరారు. "మేం మీటింగ్ పెడితే అడ్డుకుంటావా పిచ్చి జగన్ రెడ్డీ! ఈ మీటింగ్ చూసి జగన్ మోహన్ రెడ్డి ప్యాంట్ తడిసిపోయింది. గెలుపు మనదే... ఎవరికైనా అనుమానం ఉందా?
వచ్చే ఎన్నికల్లో టీడీపీ-జనసేన కూటమి సునామీ సృష్టించడం ఖాయం. అడ్డం వస్తే తొక్కుకుంటూ వెళతామే తప్ప నిలిచేదే లేదు. మీరు జగన్ మోహన్ రెడ్డిని ఓడించడానికి సిద్ధం... వైసీపీని భూస్థాపితం చేయడానికి మీరు సిద్ధం!" అంటూ చంద్రబాబు ఆవేశపూరితంగా ప్రసంగించారు.
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
ప్రపంచంలోనే అత్యంత ధనవంతులు అయిన దేశాలు! భారత్ ర్యాంక్ ఎంతో తెలుసా?
తెలుగు ప్రవాసులకు ఉపయోగ పడే వార్తలు, వారికి సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒక చోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి