రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన బుధవారం ఉదయం 11 గంటలకు కేబినెట్ సమావేశం జరగనుంది. ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ 1982 బిల్లు ప్రతిపాదనపై మంత్రి వర్గం చర్చించనుంది. భూసేకరణ చట్టంలోని కొన్ని నిబంధనల కారణంగా భూ ఆక్రమణల్లో కేసుల నమోదుకు ఇబ్బందులు వస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. వైకాపా ప్రభుత్వ హయాంలో లక్షల ఎకరాలు అన్యాక్రాంతం అయినట్టు కూటమి ప్రభుత్వం దృష్టికి వచ్చింది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వానికి అందుతున్న ఫిర్యాదుల్లో 80 శాతం భూ ఆక్రమణలపైనే ఉన్నాయి. ప్రస్తుత చట్టంతో అక్రమార్కులపై చర్యలు తీసుకునేందుకు ఇబ్బందులు ఉన్నాయని.. దీని స్థానంలో కొత్త చట్టం తేవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగానే భూసేకరణ చట్టం 1982ను రద్దు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. కొత్తగా ల్యాండ్ గ్రాబింగ్ ప్రోహిబిషన్ బిల్లు 2024ను తీసుకువచ్చేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై మంత్రివర్గంలో చర్చించి ఆమోదం తెలిపే అవకాశం ఉంది.
ఇంకా చదవండి: ఆమెకు ఆ అరబి కుటుంబం దేవుడుతో సమానం! పొగడ్తల తో ముంచేత్తుతున్న తెలుగు ఆడ పడుచు! ఇంతకీ ఆమెకు ఏమి జరిగిందంటే! 14
నామినేటెడ్ పోస్టుల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్ కల్పించే అంశం కేబినెట్ భేటీలో చర్చకు రానుంది. వైకాపా హయాంలోని నామినేటెడ్ పదవుల కేటాయింపు చట్టం 2019ని రద్దు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనికి అనుబంధంగా ఇచ్చిన జీవో 77ను రద్దు చేస్తూ మంత్రివర్గంలో నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది. 2017లో చేసిన స్మార్ట్ పల్స్ సర్వే నివేదికనునామినేటెడ్ పోస్టుల నియామకానికి ప్రాతిపదికగా తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. కొత్త క్రీడా విధానం, డ్రోన్, సెమీకండక్టర్, డేటా సెంటర్ పాలసీల రూపకల్పనపై మంత్రివర్గ సమావేశంలో చర్చించి ఆమోదం తెలిపే అవకాశం ఉంది. ప్రభుత్వ ఉద్యోగాల్లో స్పోర్ట్స్ కోటాను 2 నుంచి 3 శాతానికి పెంపు, ఒలింపిక్స్ క్రీడల్లో బంగారు పతకం సాధించిన క్రీడాకారులకు ప్రోత్సాహకాన్ని రూ.7 కోట్లకు పెంపు అంశాలపై కేబినెట్లో చర్చించనున్నట్లు తెలుస్తోంది.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
మటన్తో కలిపి ఈ 3 పదార్థాలు తింటున్నారా? ఇక మీ ఆయుష్షు మూడినట్లే! దీని మాంసం మానవ శరీరానికి చాలా!
సొంత పార్టీ జూనియర్ మంత్రిపై చంద్రబాబు సీరియస్? ఆడియో కాల్ వైరల్! ఈ ఐదు నెలల్లో ప్రభుత్వ!
జగన్ కు భారీ షాక్! పార్టీకి మాజీ మంత్రి రాజీనామా!
11వ నెల 11వ తారీకు ఉదయం 11 గంటలకు ఆ 11 మంది వస్తారా? ఏపీ అసెంబ్లీ సమావేశాలు!
అమరావతి టవర్ల నిర్మాణానికి మళ్ళీ ఉపిరి! ఏడాదిలోనే పనులు పూర్తి చేయాలన్న కసరత్తు!
దేశంలోనే నెంబర్ వన్ గా ఏపీ నూతన క్రీడా పాలసీ! చంద్రబాబు కీలక ఆదేశాలు జారీ!
నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. రూ.5 లక్షల భారీ జీతం! పరీక్ష లేకుండా నేరుగా జాబ్, ఈ ఛాన్స్ వదలొద్దు!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: