గడచిన ఐదేళ్లలో 227 ఎంవోయూలు జరిగినా రాష్ట్రానికి పైసా పెట్టుబడి రాలేదని ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) అన్నారు. శాసనసభ బడ్జెట్ సమావేశాల సందర్భంగా అసెంబ్లీలో సీఎం మాట్లాడారు. గత ఐదేళ్లలో పన్నులు, కరెంటు ఛార్జీలు పెంచటం వల్ల పరిశ్రమలు మనుగడ సాధించలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. పరిశ్రమలకు ప్రోత్సాహకాలు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టారని గుర్తు చేశారు. “1995 కంటే ముందు లైసెన్స్ రాజ్ కారణంగా పెట్టుబడులు రాలేదు. ఆ తర్వాత ఆర్థిక సంస్కరణల కారణంగా ఏపీలోనూ ఐటీని ప్రోత్సహించగలిగాం. ప్రతి నలుగురు ఐటీ నిపుణుల్లో ఒకరు తెలుగువారే ఉన్నారంటే అప్పటి విధానపరమైన నిర్ణయమే కారణం. 2047 నాటికి భారత్ నంబర్ వన్ దేశంగా తయారైతే ఏపీ కూడా దేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా ఉండాలనే ఈ పాలసీలు తీసుకొచ్చాం. యువతకు 20లక్షల ఉద్యోగాలు కల్పించాలన్నదే మా ప్రాధాన్యత. ఈజ్ ఆఫ్ డూయింగ్ నుంచి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానం మార్చుకున్నాం. ఉత్పత్తి వ్యయం తగ్గించటం, బ్రాండ్.. ఇలా అన్ని అంశాల్లోనూ దృష్టి పెట్టాం.
ఇంకా చదవండి: ఆమెకు ఆ అరబి కుటుంబం దేవుడుతో సమానం! పొగడ్తల తో ముంచేత్తుతున్న తెలుగు ఆడ పడుచు! ఇంతకీ ఆమెకు ఏమి జరిగిందంటే! 14
ప్రతి కుటుంబంలో ఒక పారిశ్రామిక వేత్త..
ప్రతి కుటుంబంలోనూ ఒక పారిశ్రామికవేత్త అనే నినాదాన్ని సాధ్యం చేసి చూపుతాం. పెట్టుబడి ప్రాజెక్టులు అనుకున్న సమయానికే మొదలయ్యేలా ఓ ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేశాం. రియల్ టైమ్లోనే అనుమతుల జారీ, సెల్ఫ్ సర్టిఫికేషన్ అంశాన్ని కూడా తీసుకురావాలని భావిస్తున్నాం. సూక్ష్మ, చిన్న మధ్యతరహా పరిశ్రమలు కూడా పెద్ద ఎత్తున ఏర్పాటు చేయాలన్నది మా లక్ష్యం. ఉత్పత్తిలో ఏపీని గ్లోబల్ డెస్టినేషన్గా మార్చాలన్నది మా విధానం. ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ పాలసీని.. అన్ని రాష్ట్రాల విధానాల్ని అధ్యయనం చేసి రూపొందించాం. ఏ విధానమైనా 2024-29 వరకూ అమల్లో ఉండేలా చర్యలు తీసుకుంటాం. 175 నియోజకవర్గాల్లో ప్రతీ చోటా పారిశ్రామిక పార్కు ఏర్పాటుకు ప్రణాళిక రూపొందించాం. పోర్టు ఆధారిత పరిశ్రమలు తీసుకువచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నిలుపుతాం" అని సీఎం తెలిపారు.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
ఏపీ ప్రజలకు మరో గుడ్ న్యూస్! ఆడబిడ్డ నిధి పథకం.. నెల నెలా మహిళల అకౌంట్లో రూ.1,500!
మందుబాబులకు కిక్కే కిక్కు.. మరో కొత్త రకం మందు వచ్చేసింది! అతి తక్కువ ధరకే!
ఏపీలో బీచ్ కు వెళ్లాలంటే ఛార్జీ కట్టాల్సిందే! ఈ 5 చోట్ల ఎప్పటి నుంచి అంటే? - ఎంత అంటే!
వైసీపీకి మరో షాక్.. మాజీ మంత్రిపై కేసు నమోదు చేసిన ఐ-టీడీపీ నేత! ఎందుకో తెలుసా?
గుడ్న్యూస్ చెప్పిన ఏపీ ప్రభుత్వం.. నవంబర్ 22న ప్రారంభం! అస్సలు మిస్ అవకండి - డబ్బులే డబ్బులు!
మూడవ విడత నామి నేటెడ్ పోస్టులు విడుదల! ఆ లిస్ట్ మీకోసం! ఒక్కో కార్పొరేషన్కు 15 మంది!
అసెంబ్లీ భోజనంపై స్పీకర్ అయ్యన్నపాత్రుడి తీవ్ర ఆగ్రహం! పద్ధతి మార్చుకోవాలంటూ హెచ్చరిక!
"ప్రజా వేదిక" కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రులు మరియు నాయకుల షెడ్యూల్! ఎవరో తెలుసా.?
APSRTC మరో శుభవార్త.. నిరుద్యోగులకు అదిరిపోయే అవకాశం ఇది! ఎలాంటి రాత పరీక్ష లేకుండానే!
లెక్క తేలుస్తాం.. పవన్ కళ్యాణ్ సీరియస్ వార్నింగ్! మామూలుగా లేదు!
రూ.2.94 లక్షల కోట్లతో ఏపీ వార్షిక బడ్జెట్! రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం!
ఏపీలో రూ.40వేల కోట్లతో టాటాపవర్ ప్రాజెక్టులు! 10వేల ఉద్యోగాలతో ఐటీ డెవలప్మెంట్ సెంటర్!
మూడవ నామినేటెడ్ పోస్టుల లిస్ట్ విడుదల? ఏ ఏ పదవులు అంటే!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: