అనకాపల్లి జిల్లా పరవాడ జవహర్లాల్ నెహ్రూ ఫార్మాసిటీలోని మరో పరిశ్రమ నుంచి విషవాయువు లీకై కార్మికుడు మృతి చెందిన విషయం ఆలస్యంగా వెలుగు చూసింది. ఠాగూర్ ల్యాబొరేటరీస్ కంపెనీలో మంగళవారం విషవాయువు లీకై 9 మంది కార్మికులు అస్వస్థతకు గురయ్యారు. వారిని గాజువాకలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఒడిశాకు చెందిన కార్మికుడు అమిత్(22) మృతి చెందాడని, మరొకరి పరిస్థితి విషమంగా ఉందని కార్మిక సంఘాలు తెలిపాయి.
బాధితులకు మెరుగైన వైద్యం అందించాలి: సీఎం చంద్రబాబు
మరో వైపు ఠాగూర్ ల్యాబొరేటరీస్ ప్రమాద ఘటనపై సీఎం చంద్రబాబు ఆరా తీశారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించి ప్రాణాపాయం లేకుండా చూడాలని ఆదేశించారు. ప్రభుత్వ పరంగా అన్ని రకాలుగా వారికి సాయం చేయాలన్న ముఖ్యమంత్రి... బాధితులకు అందుతున్న సాయంపై జిల్లా యంత్రాంగం, సంబంధిత మంత్రులు స్వయంగా పర్యవేక్షించాలని సూచించారు.
ఇంకా చదవండి: ఆంధ్రప్రదేశ్ రాజ్యసభ ఉప ఎన్నికల షెడ్యూల్ విడుదల! కూటమి కీలక స్థాయికి చేరిక!
ప్రమాద స్థలంలో సీసీ టీవీ ఫుటేజ్ సేకరిస్తున్నాం: కలెక్టర్
ఠాగూర్ ల్యాబ్స్ ప్రమాదంపై దర్యాప్తు జరుగుతోందని కలెక్టర్ విజయ్కృష్ణన్ తెలిపారు. రియాక్టర్ కమ్ రిసీవర్ ట్యాంక్ నుంచి లిక్విడ్ హెచ్సీఎల్ లీకైందని వెల్లడించారు. తొమ్మిది మంది కార్మికులకు శ్వాస, దగ్గు సమస్యలు వచ్చాయని తెలిపారు. అస్వస్థతకు గురైన వారిని గాజువాకలోని పవన్నాయి ఆసుపత్రికి, ముగ్గురిని విశాఖ షీలానగర్లోని కిమ్స్ ఆసుపత్రికి తరలించినట్టు చెప్పారు. చికిత్స పొందుతూ అమిత్ అనే కార్మికుడు మృతి చెందాడని, మరో ఇద్దరు కార్మికులకు వెంటిలేటర్పై చికిత్స అందిస్తున్నారని పేర్కొన్నారు. ఆరుగురి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందన్నారు. ఘటనా స్థలాన్ని పరిశీలించాలని ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ను ఆదేశించామని కలెక్టర్ వివరించారు. ప్రమాద స్థలంలో సీసీ టీవీ ఫుటేజ్ సేకరిస్తున్నామన్నారు.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
గుడ్ న్యూస్: 30 శాతం సబ్సిడీతో మహిళకు రూ. 5 లక్షలు! నెలకు ఎంత కట్టాలంటే? అసలు విషయం ఇదే!
శుభవార్త చెప్పిన చంద్రబాబు.. 10,000 మందికి ఉద్యోగాలు! ఆ జిల్లాలో ఇండస్ట్రియల్ హబ్ ఏర్పాటు!
ఏపీలో ఖాళీగా ఉన్న మూడు రాజ్యసభ సీట్లకు నోటిఫికేషన్ జారీ! ఎప్పటినుంచి అంటే!
కేంద్ర మంత్రి గజేంద్ర షెకావత్తో పవన్ కల్యాణ్ భేటీ! పర్యాటక ప్రాజెక్టులు, వర్సిటీపై కీలక చర్చలు!
శుభవార్త చెప్పేసిన సీఎం.. ఇక రాష్ట్రంలో అందరికీ ఉచిత విద్యుత్! 100 శాతం సౌర విద్యుత్ వినియోగం!
మాజీ సీఎం జగన్ కు కేంద్రం ఊహించని షాక్! అసలు ఏం జరిగిందంటే!
అమెరికా జైలుకి జగన్ - జీవితాంతం ఏపీకి తిరిగిరాడు! నీకు ఇప్పుడు దమ్ము ఉంటే..?
26/11 తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!
సుప్రీంకోర్టులో విజయపాల్కు గట్టి ఎదురుదెబ్బ! ఈ కేసులో ఇప్పటికే!
ట్రంప్ రాక ముందే వచ్చేయండి! విదేశీ విద్యార్థులకు అమెరికా వర్సిటీలు అలర్ట్!
అకౌంట్లోకి రూ.2.5 లక్షలు - ఈ పథకం ద్వారా పేదలకు వరం! మరో శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం!
ఏపీకి వస్తున్న మోదీ - అభివృద్ధికి పలు కీలక ప్రాజెక్టులతో కృషి! 25 వేల మందికి ఉపాధి లభించే అవకాశం!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: