అనకాపల్లి జిల్లాలో ఆర్సెలార్ మిత్తల్ సంస్థ రూ.1.61 లక్షల కోట్లతో భారీ ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు ఆసక్తి కనబర్చగా.. తాజాగా ఎన్టీపీసీ అచ్యుతాపురం మండలం పూడిమడకలో గ్రీన్ హైడ్రోజన్ హబ్ ఏర్పాటుకు సన్నద్ధమవుతోంది. గత ఐదేళ్లు ఈ ప్రాజెక్టును నిర్లక్ష్యం చేసిన వైకాపా ఎన్నికల ముందు హడావుడి చేసినా కార్యరూపంలోకి తేలేకపోయింది. కూటమి ప్రభుత్వం వచ్చాక సీఎం చంద్రబాబు చొరవ తీసుకుని మరుగునపడిన ప్రాజెక్టును పట్టాలెక్కిస్తున్నారు. రూ.85 వేల కోట్ల పెట్టుబడితో నెలకొల్పనున్న ఈ పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టుకు ఈ నెల 29న ప్రధాని మోదీతో శంకుస్థాపన చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏయూ ఇంజినీరింగ్ కళాశాల మైదానంలో బహిరంగ సభకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇదే పర్యటనలో విశాఖ రైల్వేజోన్తో పాటు, ఇతర అభివృద్ధి ప్రాజెక్టులకు మోదీ శంకుస్థాపన చేస్తారని తెలిసింది.
ఇంకా చదవండి: వైసీపీకి మరో బిగ్ షాక్: విద్యార్థిని ఫిర్యాదు.. మాజీ మంత్రిపై కేసు నమోదు! ఎందుకో తెలుసా?
భూములు లాక్కోవాలని వైకాపా నేతల యత్నం
పూడిమడకలో సెజ్ను ఆనుకుని థర్మల్ విద్యుత్తు కేంద్రం ఏర్పాటు కోసం గతంలో ఎన్టీపీసీకి 1200 ఎకరాలు కేటాయించారు. సుమారు రూ.25వేల కోట్లతో 4వేల మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తి చేయాలనుకున్నారు. అయితే బొగ్గు గనుల కేటాయింపుల్లో ఇబ్బందులతో ఈ ప్రాజెక్టు పట్టాలెక్కకుండా నిలిచిపోయింది. వైకాపా ప్రభుత్వంలో ఈ భూములను ఎన్టీపీసీ నుంచి వెనక్కి తీసుకుని ప్లాట్లుగా చేసి ఫార్మా కంపెనీలకు అమ్మేయాలని చూశారు. దీనిపై ఎన్టీపీసీ హైకోర్టును ఆశ్రయించడంతో వైకాపా చర్యలకు అడ్డుపడింది. చేసేది లేక సాధారణ ఎన్నికలకు కొద్ది నెలల ముందు మళ్లీ ఇదే సంస్థతో గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ ఏర్పాటుకు ఒప్పందాలు చేసుకున్నారు.
వేల కుటుంబాల్లో ఉపాధి వెలుగులు..
ఈ ప్రాజెక్టు ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా 25వేల మందికి ఉపాధి దొరకనుంది. 2032 నాటికి ఈ ప్లాంట్ నుంచి 60 గిగావాట్ల విద్యుత్తు ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. ప్రాజెక్టు నుంచి ఉత్పత్తయ్యే విద్యుత్తులో సింహభాగం ఏపీ అవసరాలకు వినియోగించుకోవాలనే ఉద్దేశంతో సీఎం చంద్రబాబు ఇందులో 50% వాటాను ఏపీ జెన్కోతో పెట్టించాలని నిర్ణయం తీసుకున్నారు.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
వైసీపీకి మరో షాక్! మాజీ మంత్రి సహచరుడు పై కేసు నమోదు! లైవ్ లో చూస్తూ వైసీపీ నేత పైశాచికానందం!
భారీ శుభవార్త.. ఏపీలో కొత్త పెన్షన్లు జారీ.. దరఖాస్తు తేదీ ఇదే! అస్సలు మిస్ అవకండి!
ప్రధాని మోదీ ప్రయాణించాల్సిన విమానంలో సాంకేతిక లోపం! ఏమి జరిగింది అంటే!
"ప్రజా వేదిక" కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రులు మరియు నాయకుల షెడ్యూల్! ఎవరో తెలుసా?
నామినేటెడ్ పోస్టుల 5వ లిస్ట్ విడుదల! మరో నాలుగు కార్పొరేషన్లకు... పూర్తి వివరాలు!
ప్రధాని మోదీతో చంద్రబాబు కీలక మంత్రాంగం - ఆహ్వానం! ఎందుకు? ఎప్పుడు అంటే?
నటి శ్రీరెడ్డి రాసిన లేఖకు వెన్నపూసలా కరిగిపోయిన లోకేష్! ఆమెకు బంపర్ ఆఫర్!
గుడ్ న్యూస్ చెప్పిన చంద్రబాబు - కేబినెట్ భేటీ! మహిళలకు ఫ్రీ బస్, రైతుల ఖాతాల్లో రూ 20 వేలు!
వైసీపీకి భారీ షాక్.. టీడీపీలో చేరిన వైసీపీ మాజీ కీలక నేత! 50 మంది వరకు వైసీపీ నేతలు టీడీపీలో!
"ప్రజా వేదిక" కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రులు మరియు నాయకుల షెడ్యూల్! ఎవరు అంటే!
ఏపీ ప్రజలకు మరో గుడ్ న్యూస్! ఆడబిడ్డ నిధి పథకం.. నెల నెలా మహిళల అకౌంట్లో రూ.1,500!
మందుబాబులకు కిక్కే కిక్కు.. మరో కొత్త రకం మందు వచ్చేసింది! అతి తక్కువ ధరకే!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: