రాష్ట్రంలో 15 శాతం వృద్ధి రేటు సాధించడమే లక్ష్యంగా ప్రణాళికలను అమలు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. దీనికి అవసరమైన విధానాలు, ప్రణాళికలను ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు. స్వర్ణాంధ్రప్రదేశ్ విజన్- 2047పై ఏర్పాటు చేసిన టాస్క్ ఫోర్స్ కమిటీ తొలి సమావేశం ముఖ్యమంత్రి అధ్యక్షతన సచివాలయంలో సోమవారం నిర్వహించారు. సమావేశంలో టాటా సంస్థల ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ చంద్రశేఖరన్, సీఐఐ డైరెక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జీ, జీఎంఆర్ గ్రూప్ ఛైర్మెన్ జీఎం రావు, ఎల్అండ్ ఛైర్మన్ ఎస్. ఎన్. సుబ్రమణ్యన్, టీవీఎస్ కంపెనీ ఛైర్మన్ వేణు శ్రీనివాసన్, అపోలో ప్రతినిధి ప్రీతారెడ్డి, పిరమల్ గ్రూప్ ఛైర్మన్ అజయ్ పిరమల్, డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ ఛైర్మన్ సతీష్రెడ్డి పాల్గొన్నారు. కమిటీలో సభ్యులుగా ఉన్న పారిశ్రామిక దిగ్గజాలతో సీఎం మేధోమథనం చేశారు. 'అవకాశాల కల్పనతో సంపద సృష్టించడం సాధ్యమవుతుంది. దాన్ని పేద వర్గాలకు పంచి ప్రజల జీవనప్రమాణాలను పెంచొచ్చు. 2014-19 మధ్య అధికారంలో ఉన్న సమయంలో 13.5 శాతం వృద్ధి రేటు సాధించాం. ప్రస్తుతం 15 శాతం సాధిస్తామన్న విశ్వాసం ఉంది' అని పేర్కొన్నారు.
ఇంకా చదవండి: మూడవ నామినేటెడ్ పోస్టుల లిస్ట్ విడుదల? ఏ ఏ పదవులు అంటే!
కొత్త ఆలోచనలు, ఆవిష్కరణలకు వేదికవుతాం
విజన్-2047పై ప్రభుత్వ ఆలోచనలు, పాలసీలకు సంబంధించి తన అభిప్రాయాలను చంద్రబాబు పారిశ్రామికవేత్తలతో పంచుకున్నారు. 'ఇప్పుడు సాంకేతికత మరింతగా అభివృద్ధి చెందింది. దీన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. యువతకు అవకాశాలు కల్పిస్తే తిరుగులేని ఫలితాలు వస్తాయి. రాష్ట్రంలో సహజ వనరులు, మానవ వనరులు, మౌలిక సదుపాయాలు, జాతీయ రహదారులు, విమానాశ్రయాలు ఉన్నాయి. కొత్త ఆవిష్కరణలకు మేం వేదికగా ఉంటాం. గతంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ గురించి చెప్పాం. ఇప్పుడు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ గురించి మాట్లాడుతున్నాం. నాడు ప్రతి ఇంటి నుంచి ఐటీ ఉద్యోగి ఉండాలన్న లక్ష్యంతో పనిచేశాం.. నేడు ప్రతి కుటుంబం నుంచి ఒక పారిశ్రామికవేత్త ఉండాలన్న లక్ష్యంతో ముందుకెళుతున్నాం. రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన భూములు, నీళ్లు, మానవవనరులు అందుబాటులో ఉన్నాయి. వాటికి తోడు అత్యుత్తమ పాలసీలను ప్రకటించాం. పారిశ్రామిక రంగంలో వాటి ద్వారా సత్ఫలితాలు సాధించాలన్నదే లక్ష్యం' అని సీఎం పేర్కొన్నారు.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
లెక్క తేలుస్తాం.. పవన్ కళ్యాణ్ సీరియస్ వార్నింగ్! మామూలుగా లేదు!
రూ.2.94 లక్షల కోట్లతో ఏపీ వార్షిక బడ్జెట్! రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం!
ఏపీలో రూ.40వేల కోట్లతో టాటాపవర్ ప్రాజెక్టులు! 10వేల ఉద్యోగాలతో ఐటీ డెవలప్మెంట్ సెంటర్!
గుడ్ న్యూస్ చెప్పిన చంద్రబాబు! మహిళల ఖాతాల్లో రూ 1500 జమ పై ప్రభుత్వం కీలక నిర్ణయం!
ముంబయి నటి కేసులో కీలక నిందితుడు వైకాపా నేత సీఐడీ కస్టడీకి! విచారణలో కొత్త మలుపు!
నామినేటెడ్ పోస్టుల రెండో జాబితా! ఈసారి వారికి అవకాశం పక్కా! చంద్రబాబు కీలక వ్యాఖ్యలు!
నేడు సీ ప్లేన్లో శ్రీశైలంకు సీఎం చంద్రబాబు! మీరు ఎప్పుడు ప్లాన్ చేసుకుంటున్నారు?
రౌడీషీటర్ బోరుగడ్డ అనిల్పై మరో కేసు! వైసీపీకి ఊహించని షాక్ - ఈ కేసులో మాజీ ఎంపీ!
వైసీపీకి మరో షాక్.. బీజేపీలోకి మాజీ మంత్రి? జగన్ పై గాటు విమర్శలు!
ఏపీ ప్రజలకు గుడ్ చెప్పిన ఆరోగ్య శాఖ మంత్రి! ఇకపై ఆరోగ్య శ్రీ ద్వారా...
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: