Amaravati Updates: పది రోజుల్లోనే అద్భుత మార్పు.. E2 రోడ్డుతో మారనున్న రాజధాని రూపురేఖలు.. Tirupati Laddu: తిరుమల లడ్డూ ప్రసాదంపై టీటీడీ కీలక నిర్ణయం..! నెయ్యి సేకరణలో భారీ మార్పులు! AP Farmers: ఏపీ రైతులకు గుడ్ న్యూస్..! ప్రభుత్వమే నేరుగా కొనుగోలు... సర్కార్ కీలక నిర్ణయం! Municipal Chairman: ముగిసిన న్యాయపోరాటం..! ఇబ్రహీంపట్నం చైర్మన్ పదవిపై హైకోర్టు క్లారిటీ...! AP Elections: ఏపీ పోలింగ్ ‘మిరాకిల్’ వివాదం..! పరకాల ఆరోపణల్లో నిజం ఎంత? Mulapeta Port: ఉత్తరాంధ్ర అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్...! భవిష్యత్తు వాణిజ్య కేంద్రంగా మూలపేట..! Madanapalle Case: మదనపల్లె చిన్నారి హత్య కేసులో బిగ్ ట్విస్ట్...! కీలక నిందితుడి మృతి! Health Department: ఏపీ సర్కార్ కీలక నిర్ణయం...! ప్రభుత్వ వైద్యులకు భారీగా పదోన్నతులు! Ap Government: ఏపీ పేదలకు బంపర్ ఆఫర్...! మీ అకౌంట్లో రూ. 2.50 లక్షలు.. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం! CantileverBridge: మంగళగిరి-తెనాలి రోడ్డుకు మెగా అప్‌గ్రేడ్! ₹16.93 కోట్లతో అత్యాధునిక కాంటిలివర్ బ్రిడ్జ్…! Amaravati Updates: పది రోజుల్లోనే అద్భుత మార్పు.. E2 రోడ్డుతో మారనున్న రాజధాని రూపురేఖలు.. Tirupati Laddu: తిరుమల లడ్డూ ప్రసాదంపై టీటీడీ కీలక నిర్ణయం..! నెయ్యి సేకరణలో భారీ మార్పులు! AP Farmers: ఏపీ రైతులకు గుడ్ న్యూస్..! ప్రభుత్వమే నేరుగా కొనుగోలు... సర్కార్ కీలక నిర్ణయం! Municipal Chairman: ముగిసిన న్యాయపోరాటం..! ఇబ్రహీంపట్నం చైర్మన్ పదవిపై హైకోర్టు క్లారిటీ...! AP Elections: ఏపీ పోలింగ్ ‘మిరాకిల్’ వివాదం..! పరకాల ఆరోపణల్లో నిజం ఎంత? Mulapeta Port: ఉత్తరాంధ్ర అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్...! భవిష్యత్తు వాణిజ్య కేంద్రంగా మూలపేట..! Madanapalle Case: మదనపల్లె చిన్నారి హత్య కేసులో బిగ్ ట్విస్ట్...! కీలక నిందితుడి మృతి! Health Department: ఏపీ సర్కార్ కీలక నిర్ణయం...! ప్రభుత్వ వైద్యులకు భారీగా పదోన్నతులు! Ap Government: ఏపీ పేదలకు బంపర్ ఆఫర్...! మీ అకౌంట్లో రూ. 2.50 లక్షలు.. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం! CantileverBridge: మంగళగిరి-తెనాలి రోడ్డుకు మెగా అప్‌గ్రేడ్! ₹16.93 కోట్లతో అత్యాధునిక కాంటిలివర్ బ్రిడ్జ్…!

Amaravati ORR: ఔటర్ రింగ్ రోడ్డుపై కీలక అప్‌డేట్..! ఆ జిల్లాలకు 3ఏ నోటిఫికేషన్ ఆమోదం!

 ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అమరావతి ఔటర్ రింగ్ రోడ్‌ (ORR) నిర్మాణానికి సంబంధించి కీలక అప్‌డేట్ వెలువడింది. ఐదు జిల్లాల పరిధి

Published : 2025-12-13 09:47:00
Andhra Pradesh Politics: ఢిల్లీ పర్యటనకు సిద్ధమైన చంద్రబాబు… ఏపీ కీలక ప్రాజెక్టులపై నిర్ణయాల దిశలో చర్చలు!!

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అమరావతి ఔటర్ రింగ్ రోడ్‌ (ORR) నిర్మాణానికి సంబంధించి కీలక అప్‌డేట్ వెలువడింది. ఐదు జిల్లాల పరిధిలో నిర్మించనున్న ఈ భారీ ప్రాజెక్టుకు భూసేకరణ ప్రక్రియలో భాగమైన 3ఏ నోటిఫికేషన్ వివరాలకు జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (NHAI) ఆమోదం తెలిపింది. ఎన్టీఆర్ జిల్లా మినహా మిగిలిన నాలుగు జిల్లాలకు సంబంధించిన 3ఏ వివరాలకు ఇప్పటికే NHAIతో పాటు రోడ్లు, ఉపరితల రవాణా మంత్రిత్వ శాఖ ఆమోదం లభించింది. దీనితో ఈ జిల్లాల వరకూ గెజిట్ నోటిఫికేషన్ కూడా విడుదలైంది. రాజధాని అభివృద్ధిలో కీలకమైన ఈ ప్రాజెక్టు మరో ముందడుగు వేసిందని అధికారులు తెలిపారు.

International News: నేనే శాంతి దూత ... ఆ దేశాలు తిరిగి ట్రాక్‌లో పడ్డాయనిఅంటున్న ట్రంప్ వ్యాఖ్యలు!!

అమరావతి ఔటర్ రింగ్ రోడ్డును గుంటూరు, కృష్ణా, ఏలూరు, పల్నాడు, ఎన్టీఆర్ జిల్లాల పరిధిలో నిర్మించనున్నారు. ఈ ఐదు జిల్లాలకు సంబంధించిన 3ఏ ప్రతిపాదనలు ఇప్పటికే కేంద్రానికి చేరగా, ఎన్టీఆర్ జిల్లా వివరాలు మినహా మిగతా అన్ని జిల్లాల వివరాలు ఆమోదం పొందాయి. ఎన్టీఆర్ జిల్లా వివరాలకు కూడా ఆమోదం లభించిన వెంటనే ప్రజల నుంచి అభ్యంతరాలు స్వీకరించేందుకు పత్రికా ప్రకటన జారీ చేయనున్నారు. ఆయా సర్వే నంబర్లలో భూములు కలిగిన వారు అభ్యంతరాలు తెలపగలరు. అభ్యంతరాలు వచ్చినట్లయితే జాయింట్ కలెక్టర్ విచారణ నిర్వహిస్తారు. అభ్యంతరాలు లేకపోతే భూసేకరణ ప్రక్రియను వేగంగా పూర్తి చేసే అవకాశాలు ఉన్నాయి.

Employees: ప్రభుత్వ ఉద్యోగులకు గోల్డెన్ న్యూస్…! పెన్షన్ నుంచి జీపీఎఫ్ వరకూ అన్నీ ఒకే డిజిటల్ ప్లాట్‌ఫాంలో..!

ఈ ప్రతిష్టాత్మక అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు ప్రాజెక్టును మొత్తం 190 కిలోమీటర్ల పొడవునా ఆరు వరుసలుగా (6 లైన్లు) నిర్మించనున్నారు. ఈ ప్రాజెక్ట్ వ్యయం సుమారు రూ.24,791 కోట్లుగా అధికారులు అంచనా వేశారు. ఐదు జిల్లాల పరిధిలోని 23 మండలాల్లో ఉన్న 121 గ్రామాల మీదుగా ఈ రహదారి వెళ్తుంది. రాజధాని పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్యలను తగ్గించడంతో పాటు, అమరావతి చుట్టూ రవాణా వ్యవస్థను మరింత బలోపేతం చేయడమే ఈ ప్రాజెక్టు ప్రధాన లక్ష్యమని అధికారులు స్పష్టం చేస్తున్నారు.

Godavari Pushkaralu: గోదావరి పుష్కరాలకు ముహూర్తం ఫిక్స్! అధికారిక ప్రకటన!

అలాగే కోల్‌కతా–చెన్నై నేషనల్ హైవే నుంచి అమరావతి ఓఆర్‌ఆర్‌కు అనుసంధానంగా దక్షిణ, తూర్పు దిశల్లో రెండు లింక్ రోడ్లను కూడా నిర్మించనున్నారు. చెన్నై–కోల్‌కతా నేషనల్ హైవేలో విజయవాడ బైపాస్ ప్రారంభమయ్యే కాజ ప్రాంతం నుంచి తెనాలికి సమీపంలోని నందివెలుగు వరకు సుమారు 17 కిలోమీటర్ల మేర అనుసంధాన రహదారి నిర్మించనున్నారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా ఇప్పటికే సమగ్ర ప్రాజెక్ట్ నివేదిక (DPR) సిద్ధం చేసింది. మొత్తం 12 ప్యాకేజీలుగా అమరావతి ఔటర్ రింగ్ రోడ్ నిర్మాణాన్ని చేపట్టాలని నిర్ణయించడంతో, త్వరలోనే పనులు ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

IndiGo సంక్షోభం... DGCA నాలుగు ఫ్లైట్ ఆపరేషన్స్ ఇన్స్పెక్టర్లను సస్పెండ్! కారణం ఏంటంటే!
Food Facts: రోజూ కుక్కర్‌లో అన్నం తింటున్నారా..? ఇది తెలిస్తే షాక్ అవుతారు!
Praja Vedika: నేడు (13/12) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!
New Railway Proposal: ఏపీలో ఆ ప్రాంతానికి మహర్దశ! కొత్తగా మరో రైల్వే లైన్... ఈ రూట్లోనే! ఇక అక్కడికి త్వరగా వెళ్ళొచ్చు!
వారికి కూడా అందుబాటులో ఓటీటీ కంటెంట్... కేంద్రం మార్గదర్శకాలు! ఈ నిబంధనలను రెండు దశల్లో అమలు..
విమాన ఛార్జీల పెరుగుదలపై కేంద్రం పరిమితి విధించలేదా?... కేంద్ర మంత్రి ఏం చెప్పారంటే!

Spotlight

Read More →